G-1M93C8YK91 LIBERTY.: May 2018

Tuesday, May 29, 2018

నిజాం వ్యతిరేక పోరాటం తరువాత ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్ర?

51. (ఖమ్మం చరిత్ర-3)

నిజాం వ్యతిరేక పోరాటం తరువాత ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్ర.


ప్రతీ తరానికి, వెనుక తరం చరిత్ర తెలుసుకోవాలని కుతూహలము వుంటుంది.

అందులోను ప్రభుత్వాలు మన పిల్లలకు చరిత్ర పాఠాల భోధనలను చాలా వరకు చదువులో భాగంగా పెట్టారు. రాయని చరిత్ర గురించి కుతూహలం ఇంకా అధికంగా వుంటుంది. మా ఖమ్మం చరిత్ర ఇంత వరకు అముద్రితం. రాయని చరిత్ర పై ఎన్నెన్నో ప్రశ్నలు. మాతరం అడగని ప్రశ్నలు. ఈ తరానికి తెలీని సమాధానాలు.

1952 సంవత్సరంలో వేమ్సూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ రావు పై పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి ఇండిపెండెంట్ గా అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన శ్రీ జలగం వెంగళ రావును  కాంగ్రెస్ పార్టీ ఆరు సంవత్సరాలు బహిష్కరించింది. ఆయన బహిష్కరణ సమయం పూర్తి కాకుండానే 1957 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆయన తమ్ముడు శ్రీ జలగం కొండలరావు కాంగ్రెస్ టికెట్ పై పోటీచేసి ఎలా MLA అయ్యాడు? అసలు టికెట్ ఎలా వచ్చింది? అప్పటి వరకు శ్రీ జలగం వెంగళరావు జిల్లా నాయకత్వ హోదాలో లేడు. నిషేధ కాలం పూర్తి కాగానే ఖమ్మం DCC PRESIDENT ఎలా అయ్యాడు? తరువాత వెంటనే జిల్లా పరిషత్ PRESIDENT గా ఎలా ఎన్నికయ్యాడు. దీని వెనుక రాజకీయాలేమిటి? ఎవ్వరి హస్తాలున్నవి?

శ్రీ వెంగళరావు రాజకీయంగా ఏ నిచ్చెన మెట్లేక్కాడు? నిచ్చెన పట్టుకున్నది ఎవ్వరు? నిచ్చెన మెట్లు ఎవ్వరు? ఆయన ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తి కాదు. అంతకు ముందు జిల్లాను శాసించగలిగిన స్థితిలో వున్న వ్యక్తి కాదు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గాని, తరువాత ఖమ్మం జిల్లాలోగాని పోరాట సమయమైనా తరువాతైనా ఖమ్మం మరియు మధిర తాలూకా నాయకులదే  పైచేయిగా వుండేది. విచిత్రంగా వలసదారులదే పైచేయి అయింది. శ్రీ తమ్మినేని వీరభద్రం KHAMMAM MP గా గెలిచేటంత వరకు ఆతరువాత శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచేటంత వరకు వలసదారులే పార్లమెంట్ సభ్యులయ్యారు.  

ఎందుకు?

ఎలా?

ఉద్యమకారుల జిల్లాలో అదెట్లా సాధ్యం?


ఈ ప్రశ్నలకు వచ్చే జవాబుల సారమే 

నిజాం వ్యతిరేక పోరాటం తరువాత ఖమ్మం జిల్లా చరిత్ర.


పై ఫోటోలోని వున్నది శ్రీ జలగం వెంగల రావు. ఈ చిత్రాన్ని 27.07.1965 సంవత్సరంలో శ్రీ మెట్రో వెంకట్రావు తీసింది.

ఇంకా కొన్ని ఆసక్తికర విషయాలు ఈ జిల్లా ముఖ చిత్రం పై కనిపిస్తాయి.అందులో ఒకటి క్రింద పేర్కొన్నది.

1962 సంవత్సరంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆసమయంలో వేంసూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ వున్న SC POPULATION ఆధారం గా SC లకు రిజర్వు చేయాల్సి వచ్చింది .  కానీ వేంసూరు బదులుగా అప్పుడే కొత్తగా ఏర్పడిన PALAIR నియోజక వర్గాన్ని SC RESERVED CONSTITUENCY మార్చారు. ఈ మార్పు వెనుక చాలా రాజకీయ తతంగం నడిచింది. అదేమిటి? కారకులెవ్వరు?

ఇంకోవిచిత్రం వుంధండి.


1959 సంవత్సరంలో జరిగిన పాలేరు పంచాయతి సమితి ఎన్నికలలో. అధ్యక్ష మరియు ఉపాధ్యక్ష ఎన్నికల సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ --అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీలు రెండు కలిసాయి. అధ్యక్ష మరియు ఉపాధ్యక్ష పదవులను పంచుకున్నాయి. గెలిచిన గ్రామ పంచాయతి సర్పంచులను వదిలి వేసి CO-OPTION MEMBERS కు అవకాశాన్నిచ్చారు. అప్పటి వరకు అవి ఉప్పు నిప్పుగా ఉండేవి. ఎవ్వరిని టార్గెట్ చేసి అవి కలిశాయి? కలిసి ఏమి సాధించారు? చివరికి ఎవ్వరు ఏమి కోల్పోయారు?  ఈ ప్రశ్నలకు సమాదానాలలోనే ఆధునిక ఖమ్మం చరిత్ర దాగివుంది.


పై చిత్రంలో కుడివేపున కుర్చిలలో కూర్చున్న మొదటివారు శ్రీ జలగం వెంగళరావు, రెండవ వారు శ్రీ శీలం సిద్దారెడ్డి, మూడవవారు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు మరియు ప్రక్కన శ్రీ కోట పున్నయ్య. సమావేశంలో మాట్లాడుతున్న వ్యక్తి శ్రీ హీరాలాల్ మోరియా. ముందు వరుసలో కుర్చిపై కూర్చున్న వ్యక్తిని నేను గుర్తించలేదు. ఈ కాంగ్రెస్ కార్య కర్తల సమావేశం జరిగింది ఖమ్మం తాలూకా ముదిగొండ గ్రామంలో.

పైన పేర్కొన్నవన్ని  ఒకదానికొకటి ముడివడి వున్న అంశాలు. 
పై అంశాల విశ్లేషణ యే ఆధునిక ఖమ్మం చరిత్ర.

                                                                                                      -----పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Monday, May 21, 2018

ఉద్యమాల గుమ్మం విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం.

50. (ఖమ్మం చరిత్ర-2) 

ఉద్యమాల గుమ్మం విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం.


క్రింది చిత్రం నేలకొండపల్లిలోని శ్రీ విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం. ఈ చిత్రంలో 1935 సంవత్సరంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం ముందర జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. నడుమ మీద చేయివుంచి మాట్లాడుతున్న వ్యక్తే శ్రీ పెండ్యాల. ఈయనకు ఎడమ ప్రక్కన శ్రీ దుగ్గిరాల శ్రిరామయ్య. 


ఈ గ్రంధాలయాన్ని 1912 సంవత్సరంలో స్థాపించారు. ఆనాటి గ్రామ పెద్ద్దలు శ్రీ పెండ్యాల వాసుదేవ సోమయాజులు తన ఆత్మీయ మిత్రుడు నేలకొండపల్లి గ్రామ కరణం/పట్వారి  శ్రీ రావులపాటి గోపాలరావు సహకారంతో గ్రంధాలయానికి శ్రీకారం చుట్టారు. శ్రీ వాసుదేవ సోమయాజుల గారి ఐదుగురు కుమారులు ఆ రోజులలో న్యాయవాద వృత్తిలోవుండేవారు. ఆయన పెద్ద బూస్వామి. బ్రిటిష్ ఇండియాలోని కృష్ణ, గుంటూరు జిల్లాలలో కూడా భూములు వుండేవి. ఆ ప్రాంతంలోని భూములకోసం తరచు ఆప్రాంతాలకు వెళ్ళుచుండేవాడు. ఆ ప్రాంతాల ప్రభావముతో ఆంధ్రభాషాభిమానం పట్ల ఆవిధంగా ఆకర్షించ బడ్డాడు. ఆ విధంగా ప్రభావితమైన భావజాలంతో తెలుగు/ఆంద్ర భాషా వ్యాప్తికై నడుం బిగించి ఈ గ్రంధాలయం ద్వారా కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఆనాడు అందులో తెలుగు మరియు సంస్క్రుత సాహిత్య పుష్తకాలు వుండేవి. 
క్రింది చిత్రంలో గ్రందాలయ వ్యవస్థాపకులు శ్రీ పెండ్యాల వాసుదేవ సోమయాజులు వున్నారు.



కాలం తెచ్చిన మార్పులు, జనం ఆలోచనా విధానంలో కలిగిన మార్పుల ఫలితంగా సామాజిక స్పృహవున్న వ్యక్తులలో సామాజిక భాధ్యతలను  తట్టి లేపాయి. 1934 సంవత్సరంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, విరాట్ రాయాంధ్ర గ్రంధాలయాన్ని పునరుద్ధరించి సామాజిక విప్లవం దిశగా దాన్ని నడిపించారు. ప్రపంచంలో వస్తున్న మార్పులను జనబాహుళ్యం లోకి తీసుకొని వెళ్ళే ఆలోచనలో భాగంగా  ఆధునిక సాహిత్యాన్ని, కమ్యూనిస్ట్ సాహిత్యాన్ని ప్రజలకు అందు బాటులో ఉంచారు. జనాన్ని అక్షరాస్యులుగా తీరిచి దిద్దుటకు ప్రయత్నిచారు. రాత్రి పాతసాలలు నెలకొలిపి వారిని గ్రంధాలయం వేపు అడుగులేసేటట్లు మార్గం వేశారు.

గ్రామసరిహద్దులలో వున్న బ్రిటిష్ ఇండియా నాయకులతో, నిజాం సంస్థానంలో వున్న ఇతర ప్రాంత పెద్దలతో సంభంధాలను కలిగి వుండేవారు. ఆయన తన రాజకీయ ప్రారంభ దినాలలో ఎక్కువ భాగం ఆ గ్రంధాలయం లోనే గడిపేవారు. ఇక్కడ జరిగిన రహస్య సమావేశాల పరిణామాల ఫలితమే నిజాం సంస్థానంలో నిజాం రీజినల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. ఈ సమావేశాలకు బ్రిటిష్ ఇండియా నుంచి శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య, శ్రీ చండ్ర రాజేశ్వర్ రావు, శ్రీ తరిమెల నాగిరెడ్డి, శ్రీ కొండపల్లి సీతారామయ్య వచ్చి వెళ్ళేవారు. స్థానికంగా శ్రీ పెరవెల్లి వెంకట రమణయ్య, శ్రీ దేవులపల్లి వెంకటేశ్వర రావు, శ్రీ రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, శ్రీ కాలోజి, శ్రీ హయగ్రీవా చారి, శ్రీ దాశరధి, శ్రీ వట్టికోట ఆల్వార్ స్వామి  మరియు శ్రీ జమలాపురం కేశవరావు తదితరులు వచ్చీవారు.
ఈ క్రింది  చిత్రం విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం యొక్క ముందరి భాగం. మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని కుడా చూడవచ్చు. ఇక్కడి గాంధి విగ్రహానికి కూడా ఒక విశిష్టత వుంది. 

ఈ విగ్రహాన్ని శ్రీ పెండ్యాల సత్యనారయ రావు గారి ఆదేశం మేరకు లోకల్ కమ్యూనిస్ట్ నాయకులే విరాట్ రాయాంధ్ర  గ్రంధాలయం ఆవరణ లో నెలకొలిపారు. ఉద్యమ సమయం కావటంతో తన మనిషి అయిన శ్రీ మండవ రత్తయ్య ద్వారా ఈ కార్యక్రమం జరిపించారు. ఆ కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది.

The Statue of Mahatma Gandhi was unveiled by Communist Sympathysors in 1940's. It was the evidence of the previous history archive. 



ఇక్కడ గాంధి జయంతి ని స్థానికులు జరుపుకోనటం అలవాటు. ఆ సందర్భ మైన దే ఈ చిత్రం.శ్రీ పెండ్యాల వాసుదేవ రావు నాయకత్వంలోని యువకులు ఇందులో వున్నారు.Gandhi Jayanthi celebrations at Girls School, Nelakondapally by Youth Congress workers in 1980's.

నేలకొండపల్లి గ్రామం లో బాలికల కోసం ప్రత్యేకంగా ఒక ప్రైమరీ స్కూల్ ను శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు ప్రభుత్వం ఆధ్వర్యంలో నెలకొలిపారు. ఆ స్కూల్ వసతికి అప్పుడు విరాట్ రాయాంధ్ర గ్రంధాలయాన్ని ఎంపిక చేసారు.అందులోని పుష్తకాలను బీరువ లలో  నిక్షిప్తం చేసి అక్కడే ఒక మూలన ఉంచారు. ప్రైమరీ స్కూల్ గా వున్నఆ స్కూల్ UP GRADE కావటం వల్ల కొత్త కాలం ఆ పుష్తకాలలో మిగిలినవి మా ఇంట్లో భద్రపరిచినారు. కొంత కాలం తరువాత శ్రీ భక్త రామదాసు స్మారక గ్రంధాలయాన్ని ప్రారంభించాక ఆ పుష్తకాలను ఆ గ్రంధాలయంలో ఉంచారు. ఆ గ్రంధాలయానికి శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారే చైర్మన్ గా వుండేవారు. 

ఆ భక్త రామదాసు స్మారక గ్రంధాలయాన్ని స్వాతంత్ర సమరయోధులు శ్రీ హయగ్రీవాచారి ప్రారంభించారు. 


శ్రీ భక్త రామదాసు స్మారకమందిరంలోనే ఈ గ్రంధాలయం నడిచింది.


దాదాపు ఈ సమయం లోనే శ్రీ భక్త రామదాసు చిత్రపటాన్ని కుడా ఆవిష్కరించారు. పై చిత్రం లో రిబ్బన్ కత్తిరిస్తున్న శ్రీ హయగ్రీవాచార్యం కుడి ప్రక్కన శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, ఆయన వెనుక లోకల్ MLA శ్రీ కత్తుల శాంత య్యఎడమ వేపున శ్రీ పెండ్యాల కృష్ణమూర్తి వున్నారు.


పై చిత్రంలో శ్రీ భక్త రామదాసు చిత్రపటాన్ని ఆవిష్కరిస్తున్న శ్రీ హయహ్రీవాచారి, కుడి ప్రక్కన శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, ఎడమప్రక్కన శ్రీ రావులపాటి సత్యనారాయణ రావు, వెనుక శ్రీ కత్తుల శాంతయ్య లోకల్ MLA వున్నారు.

ఇది సంక్షిప్తంగా గొప్ప చరిత్ర కలిగిన మా నేలకొండపల్లి విరాట్ రాయాంధ్ర  గ్రంధాలయం చరిత్ర.


    -----పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Friday, May 18, 2018

నాకు అన్నీ ప్రశ్నలే...జవాబులు లేవు...


49. SOCIAL-44) )

భరతమాత శిరోభారంకు మందే లేదా? అసలు మందివ్వాలనే జ్ఞానం ఎవ్వరికై నా ఉందా?


నాకు అన్ని ప్రశ్నలే....


ఎవ్వరి దగ్గర సమాధానం లభించలేదు. 


ఈ తరానికైనా సమాధానం దొరికేనా?


బ్రిటిష్ ఇండియాకు స్వతంత్రం ప్రకటించగానే దేశానికి పురిటి నొప్పు లెందు కొచ్చాయి. అవి పురిటి  నొప్పులా? హింస తాలుకు రోధనలా? 

ఇండియా విభజనకు ముందర మతకల్లోలాలు ఎందుకు జరిగాయి. భారత ప్రధాన మంత్రి పదవికై మొహమ్మదాలి జిన్నా మరియు జవహర్ లాల్ ల పదవీకాంక్ష కొట్లాట ఇందుకు కారణమా? జిన్నా ప్రధాన మంత్రిగా గాంధి ఒప్పుకోవటానికి సిద్ధపడినందుకే గాంధీ హత్య జరిగిందా? మెజారిటీ కాంగ్రెస్ నాయకుల అభీష్టం మేరకు సర్దార్ వల్లభాయి పటేల్ ను గాంధీ ఆమోదించి వుంటే జిన్నా ప్రధాన మంత్రి పదవికై పోటీకి రాకుండా వుండే వాడా? సర్దార్ పటేల్ భారత ప్రధాన మంత్రి అవుతే జమ్మూ & కాశ్మీర్ వివాదం సమసి పోయి ఉండేదా? రావణ కాష్టంలా కాల కుండా వుండి ఉండేదా?
సంవత్సరాల తరబడి లక్షల కోట్ల రూపాయల ధనం కాశ్మీర్ మీద వెచ్చించడం, వేల మంది భారత వీర సైనికుల మరణం ..దేశానికి ఎంత వరకు లాభం చేకూరింది. ఆ భూభాగం కోసం దేశం మొత్తము ఇబ్బందుల పాలుకావటం ఏమి రాజనీతి?

బంగ్లాదేశ్ విమోచనం సమయంలో అపరాకాళీ గా పేరుపొందిన అప్పటి భారత ప్రధాన మంత్రి శ్రీమతి  ఇందిరా గాంధీ వేలమంది పాకిస్తానీ సైనికులను తన దగ్గరనుండి బేషరతుగా విడుదల చేయటమెందుకు? జమ్మూ కాశ్మీర్ వివాదానికికు అప్పుడే   తెలివి గా ముగింపు పలుకవచ్చును గదా? అది మన వైఫల్యం కాదా?

ఆనాటి భారత ప్రధాన మంత్రి శ్రీ పండిట్ జవహలాల్ నెహ్రూ అనాలోచిత చర్యలు కాశ్మీర్ వివాదానికి ఆజ్యం పోస్తే, తరువాత ప్రధాని ఇందిరా గాంధి  నిర్లక్ష్యానికి  కాశ్మీర్ ఆజ్యం ఆకాశానికి ఎగసింది. భారత యువత భవిత అంధకారం లో కొట్టు మిట్టాడుతోంది.

            విషయ విశ్లేషణ ఏనాడైనా జరిగేనా?            రావణ కాష్టం ఆరిపోయేనా?

                                 భారత మాత సిరో భారం తగ్గేనా? 

             దీనికి కారణం ఎవ్వరు?            పరిష్కర్తలు ఎవ్వరు?



పై ఫోటోలో భారత అగ్ర నాయకులు వరుసగా బాబు రాజేంద్ర ప్రసాద్, నెహ్రు, సర్దార్ వల్లభాయి పటేల్, రాజగోపాలా చారి,  డాక్టర్ అంబేద్కర్  మరియు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 
 
                                                                                         ----పెండ్యాల వాసుదేవరావు. 

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Sunday, May 13, 2018

మా సహకార గ్రామీణ బ్యాంక్

48. (NKP-8). 

మా సహకార గ్రామీణ బ్యాంకు

( The Co-operative Rural Bank ltd).

ప్రస్తుతం ఈ బ్యాంకును అన్నిటిలాగే ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అంటున్నారు.

నేలకొండపల్లి సహకార గ్రామీణ బ్యాంకును తేది 13.07.1956 న స్వాతంత్ర్య సమరయోధులు, ఆనాటి మద్రాస్ రాష్ట్రంలో సీనియర్ కాబినెట్ మంత్రి మరియు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ గా పనిచేసిన శ్రీ కళా వెంకట్రావు గారు ప్రారంభించారు. కోనసీమను నందనవనం చేసిన మహానుభావుడాయన. శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారికి అత్యంత సన్నిహితుడు ఆయన. సత్యనారాయణరావు గారి ఆహ్వానం మేరకు ఆయన వచ్చారు.అప్పటికి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడలేదు.

మొదటి మూడు టర్మ్ లు సహకార గ్రామీణ బ్యాంకుకు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారు ప్రెసిడెంటుగా ఉన్నారు. అప్పుడు ఒక టర్మ్ ఒక సంవత్సరం మాత్రమే వుండేది. ఆ సహకార గ్రామీణ బ్యాంకు క్రింద 1.నేలకొండపల్లి, 2. సింగారెడ్డిపాలెం,3. సదాశివపురం, 4. కొత్త కొత్తూరు, 5, పాత కొత్తూరు, 6.బోదులబండ,7.తిరుమలాపురం,8. కోరట్లగుడెం, 9.అనాసాగారం.10.గువ్వలగూడెం, 11. ఆరెగూడెం, 12.కోనాయగుడెం,13. ఆచార్లగూడెం ఉండేవి. అన్ని భౌగోళికం గా అనుకూలంగా ఉండేవి.

క్రింది చిత్రంలో సహకార గ్రామీణ బ్యాంకు బకాయి దార్లకు ఇవ్వాలిసిన నోటిసుల ను గ్రామాల వారీగా SORTOUT చేస్తున్న సహకార గ్రామీణ బ్యాంకు ప్రెసిడెంట్ శ్రీ పెండ్యాల వాసుదేవ రావు కనిపిస్తున్నారు.

నాకు ఆ టర్మ్ (ఫస్ట్ టర్మ్) లో సిబ్బంది ఎవ్వరు లేరు. అంతా నేనే. ATTENDER తో సహా.

26 సంవత్సరాల వయస్సులో 1981 సంవత్సరం లో మొట్ట మొదటి సారిగా Co-operative Rural Bank president గా ఎన్నిక అయినాను. నాకన్నా ముందు జరిగిన ఎన్నికలన్నీ ఏకగ్రీవమే అయినవి.ఈ సమయంలో జరిగిన ఎన్నికలు మాత్రము గ్రామ పంచాయతి ఎన్నికలను మించి ఉధృతం గా జరిగాయి. తరం మార్పిడికి సంబంధించి జరిగిన ప్రసవ వేదన అది. ఆ కమిటీలో శ్రీ బుగ్గవీటి కృష్ణయ్య, Ex MLA OPPOSITION పాత్రను పోషించారు.ఆయన డైరెక్టర్ గా వుండే వారు.

నేను ఎన్నిక అయిన వెంటనే అప్పటివరకు సెక్రటరీ గా వున్న శ్రీరామారావు రాజినామ చేసాడు.సెక్రటరీతో సహా స్టాఫ్ ఎవ్వరు లేరు.ప్రెసిడెంట్ ను అనే మాట మరచి ఆ Term అంతా జీతం భత్యం లేని CEO గా సిబ్బంది లేకుండానే పూర్తి సమయం గడపవలసి వచ్చింది.

ప్రతీ విషయంలో ఖమ్మం సెంట్రల్ బ్యాంకు మరియు కో-ఆ ప రే టి వ్ డిపార్టుమెంటు తో యుద్ధమే.

ప్రత్యేకం గా ఆఫీస్ ఏర్పాటు చేసాము. ఫర్నిచర్ కొన్నాము. 25 సంవత్సరాల AUDIT పూర్తి చేసాము.Technical problem వల్ల loan సకాలంలో సెంట్రల్ బ్యాంకు ఇబ్బందులకు గురిచెయ్యటంతో 400 మంది రైతులకు sanction అయ్యే మొత్తమును దృష్టిలో పెట్టుకొని ఎరువులు అరువుకు తీసుకొని వచ్చి పంచాము. ఇంత సాహసం చేసే శక్తి నాకు గాని మరెవ్వరికి గాని లేదని ఓకే రైతు పెద్ద శ్రీ దేశ్ముఖ్ నరహరి రావు వ్యాఖ్యా నించారు.

శ్రీ పెండ్యాల సత్యనారయణ రావు గారు బ్యాంకుకై కొన్న ఒక ఎకరం భూమి అంతకు ముందు దశాబ్దంలో అన్యా క్రంతం కావటం తో మిగిలిన ముక్కలు ముక్కలుగా వున్న భూమిని అమ్మి గోదాము నిర్మాణాని కై అవుసరమైన 1200 చ.గ. స్థలాన్ని కొన్నాము. ఇప్పుడు దాని విలువ కోటి రూపాయల పైననే.

నా టర్మ్ అయిపోయే సమయంలో శ్రీ రామాయణం శ్రీధర్ SERETARY గా వచ్చాడు. అతని పనితనాన్ని చూసి సంతృప్తి చెందాక అతన్ని కొనసాగించాము.

ఈ సేవా కార్యక్రమాలతో జీవనోపాధికోసం జీవితంలో పైచదువులకు వెళ్ళలేక, ఉద్యోగ లేదా  వ్యాపారాల్లోకి పోలేక ఇందులోనే వుండిపోయాను నేను. నాకు ఇదే లోకం అయినది. దశాబ్దాల తరబడి ఈ బ్యాంకుతో అనుబంధం ముడిపడి పాయినది. బ్యాంకు ప్రక్షాళనకు, పునర్నిర్మాణానికి నేను ఎక్కువ సమయం వెచ్చించాను.

Below pic.  CRB, Nelakondapally 1987 TEAM. This was my 2nd term as President.





In the chairs middle Pendyala Vasudeva Rao, President, From Right to left: Sarvasri R.Sridhar(Secretary), D.Papa Rao(Supervisor), Vice President Vadde Ranga Rao, and Smt Gandluri Seeta.

In the standing row from left to right: Sarvasri Koti Hanumantha Rao, Pallapu Rama Rao, Pagidikattula Venkateswarlu, Kasaboina Janaiah, Rayapudi Venkateswar Rao, Bhukya Hanuma, Swamy Krishna Rao, Devarasetty Venkateswar Rao and Volloju Narayana.
On the Back Bench: Right to left: Khammam Venkateswarlu, Kanaparthi Nagender and Kummarikuntla Venkateswarlu(Attender).

ఈ టర్మ్ లో నేను ఒక్క నిమిషం కుడా ఉపిరి తీసుకునే సమయం లేకుండా వుండేది. ఏరియా అఫ్ ఆపరేషన్ పెరిగింది. లోనింగ్ పెరిగింది. షుగర్ పంట వచ్చింది. ఏరియా లోకలైజ్ అయినది. రాష్ట్ర సహకార శాకా మంత్రి అయిన శ్రీ గొల్లపల్లి సూర్య రావు ఖమ్మం జిల్లా ఇంఛార్జ్ మంత్రి కావటంవల్ల రాజకీయ ప్రత్యక్ష పోరాటం వుధృతంగా జరిగింది. బ్యాంకు కార్యకలాపాలలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకొనే వాడు. ఒక డైరెక్టర్ అనర్హత విషయమై ప్రత్యక్ష యుద్ధం జరిగింది మా బ్యాంకు పాలక వర్గం మొత్తాన్నేరద్దు చేస్తానని నోటీసు ఇప్పించాడు.నేను జవాబు ఏమి చెప్పినా పాలక వర్గం రద్దె.High Court government యిచ్చిన Statutory Notice ను admission stage లోనే QUASH చేయటం తో సహకార శాఖ తెల్లబొయింది.

Day to day కార్య కలాపాలలో కూడా అన్ని పోరాటాలే. సిబ్బందిని నియమించుకొంటె సెంట్రల్ బ్యాంకుతో యుద్ధం, వాళ్లకు జీతాలు పెంచుతే Co-operative depatrtment తో జగడం, సిబ్బందిని CO-OPERATIVE TRAINING కు సొసైటీ ఖర్చుతో పంపితే పోరాటం, సిబ్బంది హోదా పెంచి ప్రమోషన్ ఇస్తే ఆడిట్ అభ్యంతరాలు..రాష్ట్రం లో మొదటి సారిగా ప్రాధమిక లెవెల్ లో CHARTERED ACCOUNTANT తో ఆడిట్ చేయించు కోవటానికి రాష్ట్ర కమీషనర్ దగ్గరనుండి పర్మిషన్ కుడా తెచ్చుకొని పోరాటంతో విజయం సాదిం చాము. 

భవిష్యతులో జీవితం లో స్థిర పడే యత్నం లో ఒక ప్రక్కన LLB విద్యనూ అభ్యసించటం...ఇలా ఎన్నో.

ఒక సంవత్సరం చెరుకు రైతులకు లోన్స్ DISBURSEMENT చెయ్యకుండా (AREA LOCALISE అయినది) సెంట్రల్ బ్యాంకు తాస్తారం చేస్తుంటే నేను ఒక్కడినే జిల్లా కలెక్టర్ శ్రీ I.Y.R.కృష్ణ రావు గారి దగ్గరకు రిప్రేసేంట్ చేయటానికి వెళ్లి within 24 hours లో లోన్స్ బట్వాడా చేయించాను. నేను కలెక్టర్ గారి దగ్గరకు వెళ్ళిన సందర్భం లోనే సిపిఐ లీడర్ మొహమ్మద్ మౌలానా కుడా ఒక వంద మంది రైతులతో రైతులకు లోన్ బట్వాడా కోసం Representation కై వచ్చాడు. ఆయన పనికూడా ఐనది.

విషయం ఏమిటంటే ఒక్కడినే పోయి పని సాధించుకు రావటం వల్ల జనానికి సకాలంలో లోన్స్ వచ్చి ఇబ్బంది తెలియలేదు.తాము ఏ పరిస్థితిని ఎదుర్కొన్నారో అదెలా పరిష్కారము అయినదో వాళ్లకు తెలీదు.పుబ్లిసిటీ లేకపోవటం వల్ల నా కృషి తెలియలేదు. శ్రీ మౌలానా జనాన్ని ఊరి నుండి తీసుకుని రావటం వాళ్ళ ఆయన కృషి జనాలందరికీ తెలిసింది.

మా సహకార బ్యాంకు సభ్యులు అయిన రైతులు  అందరికి సకాలంలో ఋణాలు అందిస్తు ఇబ్బంది లేకుండా చేయటమే నా పంధా.

నేను అధికారం లో వున్నా, లేకున్నా సకాలంలో ఇబ్బందులు లేకుండా పని అయిపోయే విధంగా చేయటమే నా తత్వం. నేను చేసింది, సాధించింది అదే.ఇది మా నాయన గారి తత్వం.నేను నేర్చుకున్న పాఠం.



పైచిత్రంలో రెండవ CO-OPERATIVE RURAL BANK PRESIDENT శ్రీ కొమ్మినేని అనంతరామయ్య (2 YEARS- 1960--61 )  కనిపిస్తున్నారు.

చిత్రంలో శ్రీ శీలం సిద్దా రెడ్డికి సన్మాన పత్రం సమర్పిస్తున్న శ్రీ కొమ్మినేని అనంతరామయ్య. చిత్రంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావుతో చర్చిస్తున్న శ్రీ శీలం సిద్ధారెడ్డి, MLC & AP State Major Irrigation minister ప్రక్కన పాలేరు సమితి మాజీ ప్రెసిడెంట్ శ్రీ రావులపాటి సత్యనారాయణ రావు మరియు ఖమ్మం మాజీ MLA శ్రీ బుగ్గవీటి కృష్ణయ్య.



పై నున్న చిత్రంలో Co-operative Rural Bank కు మూడవ president గా వున్న శ్రీ కంకిపాటి రాజేశ్వర రావు @ జగన్నాధరావు కనిపిస్తున్నారు. శ్రీ కీసర అనంతరెడ్డి, ఖమ్మం MLA మరియు  TELANGANA PLANNING BOARD CHAIRMAN గారికి శ్రీ కంకిపాటి సన్మానపత్రం సమర్పిస్తున్న దృశ్యం.  అప్పుడు ఆయన సహకార గ్రామీణ బ్యాంకు ప్రెసిడెంట్. ఈయన 1975-81 వరకు రెండుటర్మ్ లు ప్రెసిడెంట్ గా వున్నారు.చిత్రంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారు సహకార గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకులు  కూడా చిత్రంలో వున్నారు.

                                                                                                         ---------పెండ్యాల వాసుదేవ రావు 
<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>



Thursday, May 10, 2018

మా పల్లె పాఠశాల ---జూనియర్ కళాశాల--జ్ఞాపకాలు.

47. (NKP-7). 

మా పల్లె పాఠశాల ----జూనియర్ కాలేజీ ----జ్ఞాపకాలు 


History of Committee School to the Government School.


This PIC was taken in front of the newly constructed building of Sri Bhakta Ramadasu Memorial Committee School, Nelakondapally in the year 1950's. Parents committee was formed in the year 1952 under the presidentship of Sri Pendyala Satyanarayana Rao. With their efforts school was upgraded to 6th (1952-53) to 10th (1956-57). The first batch of 10th class strength was only 14 members. After hard service and regular supervision, minimum strength was maintained. School buildings were constructed. Elders regularly visited the school to solve administration problems and to appoint good teachers. Sometimes the school was run in a private place. The committee school was handed over to the government in the year 1959. The name of the school was modified later as Z.P.S.S. School.
Sarvasri Pendyala Satyanarayana Rao, Boppana Venkateswara Rao, Pendyala Krishna Murthy and other seen in the pic when they visited the school.


The below rooms construction was for the additional accommodation of school classes in Nelakondapally village. Previously it was for primary school purpose.


In the below PIC H.M Sri APPARAO gari farewell gathering in Government High School Nelakondapally.

There are so many Village elders are there in the picture.


They are Sarvasri HM Apparao, Ravulapati Narasimha Rao, Pendyala Satyanarayana Rao, Kankipati Jagan Mohan Rao, Paidimarri Suryanarayana , Desmukh Srinivasa Rao, Tadikamalla Seetarama Rao, Rayapudi Viswanatham, Jakkepally Dharmaiah, Ravulapati Ranga Rao, Dr.Chakradhar Rao, Bandaru Rajeswar Rao, Kanamarlapudi Vasudev, Sadhu Anantaramaiah, Ravulapati Atmaram Rao, Desamukh Narahari Rao, Gandluri Narasimha Rao, Marla Laxminarayana, Chinnamsetty Janakiramulu, Kummarikuntla Narayana, Kummarikuntla Kotaiah, Dandala Subba Rao and Retd Headmaster Gopala Rao etc.

Government Junior College history: 


THE GOVT JUNIOR COLLEGE WAS SANCTIONED IN THE YEAR 1970 AT NELAKONDAPALLY AFTER SO MANY EFFORTS AND FIGHTS. Village elders collected Rs 25,000/- out of Rs 50,000/- which was needed as a mandatory deposit to remit to the govt. In the remaining amount, elders constructed the lab. Parents committee faced many legal hurdles and outside political forces. Local Khammam MP Smt Thella Laxmikanthamma influenced the education minister Sri P.V.Narasimha Rao to sanction junior college at Gokinepally village. She opposed the efforts of the Nelakondapally village elders to sanction Junior college at Nelakondapally. After a long fight, Junior college was sanctioned at Nelakondapally village. Within a gap of 15 days time,  another Junior college was sanctioned at Gokinepally village also within 9 km radius. Because of KASU BRAHMANANDA REDDY's (Hon'ble CM of AP state) blessings JUNIOR COLLEGE WAS SANCTIONED at Nelakondapally. Parents committee president Sri Pendyala Satyanarayana Rao sold his wife's gold bangles for expenses to stay at Hyderabad and for sanction of college etc.

Later after some years due to lack of strength Gokinepally Junior college was shifted to another village called Mudhigonda. Previously Gokinepally was a Multipurpose school but due to lack of strength school was  

BECAUSE OF THIS COLLEGE SO MANY YOUNG STUDENTS FROM WEAKER SECTIONS GOT THE OPPORTUNITY TO STUDY UP TO INTER/ DEGREE IN THOSE DAYS.

In the below PIC SRI SADHU ANANTHARAMAIAH AND SRI PANTANGI NAGABHUSHANAM PUROHITHS PERFORMING PUJA AT FOUNDATION PLACE.
Major Irrigation Minister of AP Govt Sri SEELAM SIDDHA REDDY AND SARPANCH & PARENTS COMMITTEE PRESIDENT Sri PENDYALA SATYANARAYANA RAO SEEN IN THE PIC.


FOR THE PURPOSE OF SCIENCE LABORATORY FOUNDATION STONE LAID BY SRI SEELAM SIDDHA REDDY ON DT: 27.10.1971.

FOR SANCTION OF GOVT JUNIOR COLLEGE AT NELAKONDAPALLY PEOPLES CONTRIBUTION WAS MANDATORY FOR RS 50,000/- IN VIEW OF DROUGHT CONDITIONS PARENTS COMMITTEE CULTIVATED THE TANK BED IN SURVEY.NOs. 225 & 782 AT NELAKONDAPALLY FOR THE PURPOSE OF INCREASING ITS FINANCIAL RESOURCES. FROM THE INCOME OF THIS CULTIVATION THE SAID SCIENCE LAB WAS CONSTRUCTED. District revenue authorities have filed a case against parents committee for unauthorised cultivation in government Tank bed. Due to the efforts of Sri Pendyala Satyanarayana Rao the case was subsidised after a long time. 

SARVA SRI PENDYALA SATYANARAYANA RAO (PARENTS COMMITTEE PRESIDENT FROM 1970-91), R. BHUVANA SUNDER REDDY(Z.P CHAIRMAN), KATTULA SANTHAIAH(LOCAL MLA), COLLEGE PRINCIPAL B.S. PETER AND SHAJAHAN BEGAM D.E.O. SEEN IN THE BELOW PIC.


In 60's another primary school was sanctioned in Nelakondapally village exclusively for Girls, but so many boys were studied in that school including me. I studied up to fourth class there. 
We can see the girl's school pic in below pic. Once it was the premises of "VIRAAT RAAYAANDHRA GRANDHALAYAM", a historical premise.
Another primary school was sanctioned in the name of "Singareddypalem primary school". Once Singareddypalem was a dead village. At the time of plot allocated to the weaker sections in 1950's houses were built. Singareddypalem and Nelakondapally villages are twin villages. Singareddypalem village is located to the western boundary of Nelakondapally village and western part of the trunk road which is Khammam to Kodad road.

In recent past Degree college was sanctioned and it is running on the same premises of Junior college in Nelakondapally.



                                                                          ----పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>



Tuesday, May 8, 2018

The Legends who drafted the INDIAN CONSTITUTION!

46. (SOCIAL-37) 

The Legends who drafted the INDIAN CONSTITUTION!


Sri B.R.Ambedkar, Chairman and other members of the Constitution drafting committee.
1. Sri K.Munshi (Bombay), 2. Alladi Krishna Swamy Iyyer (Madras), 3. N.Gopala Swamy Iyyer (Ex PM, J & K), 4. Md.Sadullah (Muslim League Member), 5. D.P.Khaitan (Lawyer) and 6. Bengal Narasimha Rao (Adviser).

After the resignation of Sri Mittal Madhava Rao advisor of Maharaja of Vadodara) and After the death of Sri, Khaitan, Sri T.T.Krishnamachary was appointed as members to the Committee. It was adopted on 26th Nov 1949. 

The Drafting Committee and its members were very influential in Indian constitution-making during the Committee stages and the deliberations of the Constituent Assembly.



On 29th August 1947, the Constituent Assembly through a resolution appointed a Drafting Committee and Dr BR Ambedkar was appointed the head of the drafting committee with one objective - draft a permanent and organized constitution for India. At its first meeting on 30th August 1947, the Drafting Committee elected B.R Ambedkar as its Chairman. 

The committee went back to its roots and referred to the Government of India Act, 1935. A  first draft of the constitution was submitted to the Assembly on November 4, 1947, after 141 days into working on it. Towards the end of October 1947, the Drafting Committee began to scrutinize the Draft Constitution prepared by the B.N Rau, the Constitutional Advisor. It made various changes and submitted the Draft Constitution to the President of the Constituent Assembly on 21st of February 1948.

Assembly sessions took place 166 days, for a period of two years, that was also open to the public. After a plethora of discussions, amendments and hard work, on January 24, 1950, 616 signatures were made by 308 members of the Assembly on the two hand-written copies (Hindi and English) of the final draft of Constitution of India. After two days, on January 26, 1950, the longest written Constitution of the world that incorporated 448 Articles in 22 Parts, 12 Schedules, and 97 Amendments was validated and found an across effect across every corner of the country.

                                                          -------పెండ్యాల  వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>




Monday, May 7, 2018

శ్రమదానంతో రోడ్ నిర్మాణం. భావి తరాలకు ఆదర్శం.

45.(NKP-6). 

శ్రమదానంతో రోడ్ నిర్మాణం. భావి తరాలకు ఆదర్శం.
ఆ రోజుల్లో భారత్ సేవక్ సమాజ్ అనే సంస్థ ఒకటి వుండేది. ఖమ్మం జిల్లాలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసేది. దానికి స్వాతంత్ర సమరరయోదులు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు కొంత కాలం ప్రెసిడెంట్ గా వున్నారు.

నేలకొండపల్లి నుండి బోడులబండ కు ప్రస్తుతమున్న రోడ్ వారు నిర్మించినదే.
ఖమ్మంజిల్లా ఏర్పడిన తరువాత జిల్లాలో చాలా చోట్ల గవర్నమెంట్ డొంకలు ప్రజల సౌకర్యార్ధం తన రూపురేఖలను ప్రభుత్వ అనుమతితో మార్చుకున్నాయి.

నేలకొండపల్లి నుండి తిరుమలాపురం,బోడులబండ, కోరట్లగుడెం ద్వారా రాజేశ్వరపురం, కూసుమంచి మార్గాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. కాని బోడులబండ మరియు పరిసర గ్రామాల పజలందరూ దాన్ని వ్యతిరేకించారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు యువకులు, విధ్యార్ధులతో శ్రమదానం క్రింద ఆరోడ్ నిర్మాణం గావించారు. ఆ రోజుల్లో అదో SENSATIONAL NEWS. ఉద్యమ స్పూర్తితో ఆ నిర్మాణం గావించారు. 

ఆకార్యక్రమం ఒక నెల రోజులపాటు జరిగింది.నేలకొండపల్లి విద్యార్థుల పర్యవేక్షణ కోసం టీచర్ శ్రీ ద్రోణంరాజు కృష్ణా రావు, ఖమ్మం MUTIPURPOSE SCHOOL నుండి వచ్చిన విద్యార్థుల పర్యవేక్షణ కోసం అక్కడి ఇంగ్లీష్ టీచరు (ముస్లిం) పనిచేశారు.

విషయం తెలుసుకున్న హైదరాబాద్ రాష్ట్ర హోంశాఖా మంత్రి శ్రీ మందుగుల నరసింగ రావు ఆ కార్యక్రమం ఆఖరులో వచ్చారు, శ్రమదానంలో తానూ పాల్గొన్నారు.

క్రింద వున్న చిత్రం భారత్ సేవక్ సమాజ్ సమావేశంలో ఖమ్మం ప్రక్కనున్న వెంకటాయపాలెంలో ప్రసంగిస్తున్న శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు.. ఆ సమావేశం లో కుడా శ్రీ మందుముల నరసింగ రావు పాలుగొన్నారు.
This generation politicians should learn about this type of politicians and their contributions to the society.
   -----పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Tuesday, May 1, 2018

మా పాలేరు అసెంబ్లీ ప్రాంత రాజకీయాలు---1978 తర్వాత...

44. (NKP-5). 

నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవిర్భావం.

1978 సం.లో ఆంధ్ర ప్రదేశ్ రాష్రంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలో అప్పుడు ఇందిరా కాంగ్రెస్ పార్టీ  శ్రీ కీసర అనంత రెడ్డి గారి నాయకత్వం లో వుండేది. ఆయన తెలంగాణా ప్రాంతీయ బోర్డు చైర్మన్ గా కాబినెట్ ర్యాంక్ లో వుండేవారు.

1980 సం.లో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి ప్రతిపాదన మేరకు నేలకొండపల్లి Agricultural market committee ని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి విడగొట్టి ఏర్పాటు చేశారు.నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీకి మొట్టమొదటి ప్రెసిడెంట్ గా శ్రీ నాగుబండి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ వున్నం వెంకయ్య బాధ్యతల నిర్వహించారు.

క్రింది చిత్రం పాలక వర్గం అధికారిక పత్రాలు అందు కున్నప్పటిది.

చిత్రం లో కుడి నుండి వరుసగా సర్వశ్రీ వంగవీటి వెంకట సుబ్బయ్య, రామసహాయం  భువన సుందర్ రెడ్డి,కొమ్మినేని అనంత రామయ్య,కొత్త యోగానంద రావు, పెండ్యాల సత్యనారాయణ రావు, నాగుబండి సత్యనారాయణ,వున్నం వెంకయ్య, నాగళ్ల భద్రయ్య, ఎల్లంపల్లి రామచంద్రయ్య, సోమ్ల నాయక్, కిలారు వెంకయ్య,పెండ్యాల భగవాన్లు, నాగుబండి లక్ష్మినారాయణ వున్నారు.


నేలకొండపల్లి ప్రధమ వ్యవసాయమార్కెట్ కమిటీకి చైర్మన్ గా శ్రీ కొమ్మినేని అనంతరామయ్య, శ్రీ కొత్త యోగానందరావులు పోటికి వచ్చారు. కాని శ్రీ నాగుబండి సత్యనారాయణ ప్రెసిడెంట్ అయ్యారు.మొదటి నుండీ శ్రీ నాగుబండి జలగం శిష్యులుగా వుండేవారు. 

అసంతృప్తి చెందిన నేలకొండపల్లి ఉపసర్పంచ్ శ్రీ యోగానంద రావు సర్పంచ్ పదవికై వడివడిగా అడుగులు వేసాడు.చివరి నిమిషంలో రంగం నుంచి ఆయన తప్పుకోవటంతో అనుకోకుండా శ్రీ కొత్త జనార్ధనరావు తెరపైకి వచ్చి 1981 సంవత్సరంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ గా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు పై పోటీ చేసాడు.

ఆ పిదప శ్రీ వంగవేటి వెంకటసుబ్బయ్య మధ్యవర్తిత్వంతో మండల కాంగ్రెసుకమిటీ ప్రెసిడెంటుగా శ్రీ కొత్త జనార్ధనరావును శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారు ఆమోదించటంతో పెండ్యాల సత్యనారాయణ రావు గారి మరణం వరకు ఆ వర్గమంతా ఆయనతోనే ఉన్నారు.

కొసమెరుపు ఏమిటంటే ఈ రాజీమార్గాల వల్ల మార్కెటు కమిటీ చైర్మన్ మరియు మండలకాంగ్రెస్ ప్రసిడెంట్ పదవులకు నేను దూరంగా వుండ వలసి వచ్చింది.

పాలేరు అసెంబ్లీ చరిత్ర.
1962 సం లో ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గం నుండి పాలేరు  అసెంబ్లీ నియజక వర్గం ఏర్పడిన దగ్గర నుండి అది షెడ్యూల్ కులాల రిజర్వేషన్స్ లోనే వుంది. 1962  నుండి 1978 దాకా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గా శ్రీ కతుల శాంతయ్య MLA గా ఎన్నికయ్యారు. 1978 సం. లో దేశంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చిన నూతన పరిణామాలరీత్యా బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ లో శ్రీ కత్తులశాంతయ్య వుండి పోవటం వల్ల INDHIRA CONGRESS అభ్యర్ధిగా శ్రీ పొట్టి పింజార హుస్సేన్ పాలేరు MLA  గా ఎన్నిక అయినాడు. తరువాత అసెంబ్లీ ముఖ చిత్రం మారి పోయి కొత్త రాజ కీయ వాతా వరణం కు దోహదం చేసింది.

1981 సం.లో పాలేరు MLA శ్రీ పొట్టిపింజార హుస్సేన్ ఆకస్మిక మరణంతో జరిగిన ఉపఎన్నికలో సంభాని చంద్రశేఖర్ పాలేరు రాజకీయాల్లో అడుగుపెట్టాడు.రాష్ట్ర యువజకాంగ్రెస్ నాయకుడైన శ్రీ ఇంద్రసేనారెడ్డి ఇచ్చిన చేయూతతో సింగరేణి కాలరీస్ ఎంప్లాయ్ అయిన శ్రీ సంభాని అసెంబ్లీ రాజకీయాలలో అరంగ్రేటం చేసాడు.

పార్టీ టికెట్ రాంగానే ఖమ్మం హిల్ బంగ్లా(అధికార కేంద్రం--Road అండ్ Buildings Guest house) లో వున్న శ్రీ కీసర అనంతరెడ్డి గారికి ఆశీస్సుల కోసం పాదాభివంధనం చేయబోగా , ఆయన వారించి ప్రక్కనే కూర్చొని వున్న శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారిని చూపించి ఆనియోజకవర్గం ఆయనది, ఆయన ఆశీస్సులు తీసుకొమ్మని సలహా ఇవ్వటం--శ్రీ సంభాని తీసు కోవటం జరిగి పోయాయి. చీఫ్ ఎలక్షన్ ఏజెంటుగా పెండ్యాల సత్యనారాయణ రావు గారే భాద్యతల తీసుకొని శ్రీ సంభానీని గెలిపించటం జరిగింది.

తరువాత సింగల్ గా జరిగిన రెండు (1983 మరియు 1985) అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ సంభాని చంద్రశేఖర్ ఓడిపోవటం తరువాత శ్రీ జలగం వెంగళరావు గారు లోకసభకు పోటీచేసినప్పుడు (1989), తరువాత శ్రీమతి రేణుకాచౌదరి లోకసభకు పోటీ చేసినప్పుడు (1999  మరియు 2004)  శ్రీ సంభాని చంద్రశేఖర్ ఎం.ఎల్.ఏ గా గెలవటం జరిగింది.

ఉపఎన్నికలో తప్ప అయన గెలిచింది లోకసభ ఎన్నికలతో బాటు జరిగిన అసెంబ్లి ఎన్నికలలోనే. విచిత్ర మేమిటంటే ఆయనతో బాటు  గెలిచిన లోక సభ సభ్యులు ఇద్దరినీ ఆయన తన రాజకీయ శత్రువులుగా భావించేవాడు. బ్రహ్మచారి అయిన శ్రీ చంద్రశేఖర్ విలక్షణవ్యక్తి. ఈ లక్షణమే ఆయన భవిష్యత్తును ప్రభావితం చేసింది. ఈయన రాజకీయాలలోకి వచ్చిన తరువాత పాలేరు, గట్టుసిగారం మొదలుకుని వల్లభి, నేలకొండపల్లి, మేడేపల్లి , ముదిగొండ మరియు కొన్ని ముఖ్య గ్రామాల  సీనియర్ నేతలంతా కొందఱు వ్రుద్ధ్యాప్యంవల్ల రాజకీయాలకు దూరంగా వుండటం, మరికొందరి మరణం వల్ల నియోజకవర్గంలో 1990 తరువాత కాంగ్రెసు పార్టీకి ఈయనే పెద్దదిక్కుగా మారాడు. ప్రత్నామ్యాయం లేకుండా పొయింది.

కాంగ్రెసుపార్టీ మొత్తం తన చెప్పుచేతలలోనే ఉండాలనే తన వ్యవహారశైలి వల్ల కాబినేటు  మంత్రిగా వుండికూడా తదుపరి ఎన్నికలలో(1994) ప్రజాగ్రహంతో ఓటమి చెందవలసి వచ్చింది.

శ్రీ సంభాని రాష్ట్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశాక నేలకొండపల్లిలో జరిగిన సన్మాన కార్యక్రమం క్రింది చిత్రం.
పాలేరు శాసన సభ్యులలో ప్రప్రధమం గా మంత్రి పదవిని అలంకరించింది శ్రీ సంభాని చంద్రశేఖర్ కావటం గమనార్హం.

శ్రీ సంభాని చంద్రశేఖర్ రాష్ట్రమంత్రి అయిన సందర్బంగా జరిగిన సన్మానకార్యక్రమంలో ప్రసంగిస్తున్నది శ్రీ పెండ్యాల వాసుదేవరావు. చిత్రంలో కూర్చున్నవారు కుడి నుండి ఎడమకు వరుసగా సర్వశ్రీ డి.పురుషుత్తం, సంభాని చంద్రశేఖర్, కంకిపాటి జగన్మోహనరావు, కత్తుల శాంతయ్య, జాస్తి వెంకటేశ్వరరావు, ఎం.వి.రామారావు, నాగుబండి సత్యనారాయణ. నిలుచున్నవారిలో నాగుబండిలక్ష్మీనారాయణ, చట్టు వెంకటేశ్వర్లు, డి. సూరిబాబు ఇతరులు వున్నారు.


-----పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>




tag

Billion reasons why the India-Israel partnership is hitting new highs.

#Geopolitics Modi's Diplomatic Dance: Navigating the Geopolitical Tightrope on His Israel Tour IN THE ABOVE PIC INDIAN PM SRI NARENDRA M...