Posts

Showing posts from April, 2018

43. (ఖమ్మం చరిత్ర-1) ఎక్కడుంది మన చరిత్ర? పరిశోధన తోనే చరిత్ర వెలుగు లోకి రావాలి.

Image
ఎక్కడుంది మన చరిత్ర? ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ చిత్రమిది.దీన్ని చూస్తే ఈ ఈ ప్రాంతాల్లో ఈ స్టేట్ వుందని ఈ తరానికి కుడా తెలుస్తుంది.  ఉమ్మడి వరంగల్ జిల్లాలో వున్న మన ఖమ్మం చరిత్ర 1952 వరకు ఏమిటి? కాంగ్రెస్ మరియు కమ్యునిస్ట్ లు ఎవ్వరు వ్రాయలేదు. కారణం తెలీదు.  1953 నుంచి ఖమ్మం జిల్లా చరిత్ర కుడా ఎవ్వరు వ్రాయలేదు.  ఆత్మకధలు చరిత్ర దర్పణాలు కాదు. రష్యా విప్లవం తరువాత బ్రిటిష్ ఇండియా Communist Party సహకారంతో  జరిగిన నిజాం వ్యతిరేకపోరాటం గురించి అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమకారులు గొప్పగా చెబుతారు, కాని పోరాటం ముగిసిన రెండు దశాబ్దాల తరువాత గాని పోరాట ముగింపు సమయంలో రాష్ట్ర భాద్యతలలో వున్న శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు దాని గురించి వ్రాయలేదు.అదికూడా పోరాటం నేర్పిన గుణపాటాల గురించే వ్రాసాడు. తనకు సమగ్ర సమాచారం లేదని --తెలుస్తే చెప్పమని ముగించాడు. తమ స్థానిక పార్టీ తీర్మానానికి భిన్నం గా తాము పోరాటాన్నిఅయిష్టం గా ఎలా కొనసాగిన్చాల్సి వచ్చిందో శ్రీ రావి నారాయణ రెడ్డి చెపారు. ఏదో చెప్పాలనే తాపత్రయం తో పిడికిలి తెరచిన శ్రీ దేవులపల్లి వెంకటేశ్వర రావు చెప్పాలిసింది పూర్తి

42.(NKP-4). నేలకొండపల్లి లో శ్రీ భక్త రామదాసు స్మారక ఉత్సవాలు ---ప్రారంభ చరిత్ర.

Image
శ్రీ భక్త రామదాసు స్మారక ఉత్సవములు నేలకొండపల్లి లో  ప్రారంభ చరిత్ర . ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో 1973 సంవత్సరం డిసెంబర్ 31 వ తేది నుండి 1974 జనవరి 2 వ తేది వరకు శ్రీ భక్త రామదాసు స్మారక ఉత్సవాలు  శ్రీ భక్త రామదాసు మెమోరియల్ సొసైటీని (REGD NO.715/74) ఆధ్వర్యం లో ప్రప్రధమం గా జరిగినవి.   శ్రీ భక్త రామదాసు స్మారక సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులుగా శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, ఉపాధ్యక్షుడిగా శ్రీ కంకిపాటి జగన్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి గా శ్రీ పీ.బీ. సోమయాజులు, సహాయ కార్యదర్స్యులుగా పైడిమర్రి కృష్ణశర్మ, శ్రీ కొడవటిగంటి శివరామశర్మ మరియు  కోశాధికారిగా శ్రీ కొత్త యోగానంద రావు వున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో దాదాపు అదే సమయంలో 1973 డిసెంబర్ 27 నుండి 1974 జనవరి 3 వ తేది వరకు వాగ్గేయకారుల ఉత్సవాలు ప్రారంభించారు. వాటికి అయిదు లక్షల రూపాయల మూల నిధిని ఏర్పరిచి ఆర్ధిక వనరులను ఏర్పచింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యేకించి శ్రీ భక్త రామదాసు పేరున స్మారకోత్సవములు నేలకొండపల్లిలో  మాత్రమే చరిత్రలో ప్రధమంగా ప్రారంభం అయినవి. ఇక్కడ నిర్వహణకు మాత్రం ప్రభుత్వ నిధు

41. (NKP-3). శ్రీ భక్త రామదాసు జన్మ స్థలంలో ఆయన స్మారక మందిరం విశేషాలు.

Image
శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం (ప్రస్తుత ద్యానమందిరం) విశేషాలు. నేలకొండపల్లి గ్రామం ఖమ్మం నుండి 23 కిలోమీటర్ల దూరంలో, కొదాడు నుండి 15 కిలోమీటర్ల దూరం లోవుంది.   శ్రీ భక్త రామదాసు గారి అసలు పేరు కంచర్ల గోపన్న.  ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలోక్రి.శ.  1632   సం.ప్రాంతం లో  శ్రీకంచర్ల లింగన్న,శ్రీమతి కామమ్మ  దంపతులకు ఆయన జన్మించారు. ఆయన భార్య పేరు  శ్రీమతి కమలమ్మ.                  శ్రీ భక్త రామదాసు ప్రముఖ వాగ్గేయ కారుడు. భక్త జయదేవుడు, త్యాగయ్య, అన్నమయ్య, పురందరదాసు, నారాయణ తీర్ధులు, శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్, క్షేత్రయ్య ..ఇలా ఎందరో  కర్నాటక సంగీత జ్యోతిని వెలిగించిన వాగ్గేయకారుల సరసన రామదాసుకు సముచిత స్థానముంది. సాహిత్య పరిశోదనల్లో వెలుగు చుసిన ఆయన 206 కీర్తనలను కాలగర్భంలో కలసిపోకుండా రక్షించుకుంటూ ఆ కీర్తనలకు దేశవ్యాప్త ప్రచారం చేయవలసి వుంది. తిరువయ్యారులో ప్రతి ఏటా జరిగే త్యాగయ్య ఆరాధన ఉత్సవాలలాగా రామదాసు సంస్మరణ ఉత్సవాలలాగ  జరగాలనేది నేలకొండపల్లి వాసుల చిరకాల వాంచ.  కంచర్ల గోపన్న తన రామదాసుగా మారటం వెనుక ఆయన స్వగ్రామంలో ఆయన కుటుంబం నిర్వహించిన

40.(NKP-2). మా వూరి బస్సు స్టాండ్--పాత జ్ఞాపకాలు..

Image
అయ్యో బస్సు స్టాండు వెళ్లి పోయావా? మొన్న నేలకొండపల్లి వెళ్ళినప్పుడు చూశాను. బస్సు స్టాండు కూలగోట్టేసారు.  అది చూడగానే పాత సంగతులు కనుల ముందర కదలాడాయి.ఆ సంగతులకు ఈ ఫొటోలే సాక్ష్యం. నేలకొండపల్లి బస్సు స్టాండ్ ఇక్కడ కట్టటానికంటే ముందునుంచే అక్కడ జనాలు బుస్సులకై వేచివుండేవాళ్ళు. 1955 సంవత్సరం లో స్థానిక గ్రామ పంచాయతీ దాన్ని కట్టించింది. పోరాటం తోనే దాని నిర్మాణం పూర్తి చేశారు. జిల్లాలో బస్టాండ్ ల నిర్మాణం ఆలోచన లేని రోజుల్లోనే దాన్ని ప్రారంభించారు. సర్పంచ్ శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గవర్నమెంట్ రోడ్ లో ఇల్లు కట్టుకుంటున్నాడని మోపిన అభియోగాలని అధిగమించి కట్టారు.  బస్స్టాండ్ ప్రశాంతమైన వాతావరణంలో వుండేది.ముందర రోడ్ కు  ఆవల చెరువు నీళ్ళ నుంచి, వెనుక వేపు నుంచి పచ్చని పొ లాల నుంచి  వచ్చే చల్లని గాలి ఆహ్లాదంగా వుండేది. ఈ క్రింది ఫోటో 1955 సంవత్సరంలో తీసినది. 1955 నుంచి 1975 దాకా నిరాటంకం గా అక్కడ బస్సులు ఆగినవి. 1975 నుండి 1980 దాకా బస్సులు ఆగటానికి పోరాటం చేయాలిసి వచ్చింది. బస్సులు ఆగటానికి అక్కడ  రోడ్ వెడల్పు సరిపోదని ఆర్టీసీ చెప్పిన అభ్యంతరం వల్ల ఛి వరకు సాంప్రదాయాలకు