57. (ఖమ్మం చరిత్ర-5) నైజాం సంస్థానంలో CPI ఆవిర్భావం--పరిణామాలు.

నైజాం సంస్థానం లో  CPI పార్టీ ఆవిర్భావం-తదనంతర పరిణామాలు.

CPI పార్టీ బ్రిటిష్ ఇండియాలో 1925 సంవత్సరంలో కాన్పూర్లో అధికారికంగా ప్రారంభించ బడినది. అంతకుముందు తాష్కెంట్లో 1920  సంవత్సరంలో పార్టీ మేనిఫెస్టో ను తయ్యారు చేశారు. CPI వ్యవస్థాపాకుడు శ్రీ మానవేంద్ర నాథ్ రాయ్.

1934 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగం అయిన ఆంధ్ర ఏరియాలో CPI పార్టీ ఆంధ్ర ప్రొవిన్సియల్ కమిటీ పేరిట ఆవిర్భవించింది. 1940 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాలో కమ్యునిస్ట్ పార్టీని నిషేధించారు. 1939 సంవత్సరంలో నైజాం సంస్థానంలో CPI పార్టీ ఆవిర్భవించింది. అప్పట్లో నైజాంకు వ్యతిరేకంగా గ్రంధాలయోద్యమంతో పాటు  1). కామ్రేడ్స్ అసోసియేషన్, 2), ఆంద్ర మహాసభ, 3). మహారాష్ట్ర పరిషద్ మరియు 4). వందేమాతరం పేరిట కార్యక్రమాలు నడుస్తుండేవి. వీటిలో గ్రామీణ ప్రాంతాలలో ఆంద్రమహాసభ కార్యక్రమాల ప్రభావం ఎక్కువగా వుండేది. ఆంద్రమహాసభలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు, కామ్రేడ్స్ అసోసియేషన్ లో శ్రీ ముఖ్దూం మొహియుద్దీన్, వందేమాతరంలో శ్రీ సర్వదేవభట్ల రామనాధం లాంటి సోషలిస్ట్ ఆలోచనా విధానం కలిగిన యువకులు చురుకుగా వుండేవాళ్ళు.

ఆంధ్రాలో Communist Party పై నిషేధం విధించి వుండటం వల్ల మునగాల పరగణాలో Under Ground లో వున్న శ్రీ చండ్ర రాజేశ్వర రావు వీళ్ళతో Touch లో ఉండేవారు. ఆంద్ర మహాసభలో చురుకుగా వున్ననల్లగొండ జిల్లా కు చెందిన  శ్రీ రావి నారాయణరెడ్డి అప్పుడు మితవాది గానే ఉండేవారు. పార్టీ ఆవిర్భవించిన తరువాత కొంత కాలానికి పార్టీలో ప్రవేశించాడు. దాదాపు ఆ సమయంలోనే పై చదువులు ముగించుకొని వచ్చిన శ్రీ దేవులపల్లి వెంకటేశ్వరరావు తను ఫుల్ టైం వర్కర్ గా  పనిచేయటాని ఆంధ్రా కమ్యునిస్ట్ ప్రొవిన్సియల్ కమిటీ కి అనుమతికై దరఖాస్తు చేసి ఉన్నారు.

అప్పుడు శ్రీ చండ్ర రాజేశ్వరరావు బ్రిటిష్ ఇండియాకు చెందిన క్రిష్ణా జిల్లా Communist పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉండేవారు.. నైజాం సంస్థానంలో ప్రవేశించాలంటే మునగాల పరగణా నుండి నేలకొండపల్లి గ్రామం ప్రవేశ ద్వారంగా వుండేది. ఆ కారణం వల్లనే ఆంధ్రా నాయకులంతా నేలకొండపల్లి వచ్చే వాళ్ళు. అక్కడ వాళ్ళకు  విరాట్రాయాంధ్ర గ్రంధాలయం సమావేశ వేదికగా వుండేది.

శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ప్రేరణతో శ్రీ పెరవెల్లి వెంకటరమణయ్య తాను మధిర పట్టణం లో చేస్తున్న S.I of Police ఉద్యోగానికి రాజీనామా చేసి కమ్యునిస్ట్  ఉద్యమంలో చేరాడు.

శ్రీ పెరవెల్లి వెంకటరమణయ్య ఆధ్వర్యంలో నైజాం రీజియన్ కమ్మ్యునిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. స్టేట్ కమిటీలో కుడా ఖమ్మం  నాయకులే ఎక్కువగా ఉండే వారు. ఒక క్రమంలో తరువాత పార్టీ విస్తరించింది. పార్టీ ఆవిర్భవించగానే మొట్టమొదటగా నేలకొండపల్లి, గోకినపల్లి, తల్లంపాడు, తిరుమలాయపాలెం, సిరిపురం, అల్లినగరం గ్రామాలలో పార్టీశాఖలు ఏర్పడ్డాయి.  చాలా కాలం వరకు కమ్యూనిస్ట్ పార్టీ నైజాంలో ఆవిర్భావం  జరిగినట్లు ప్రభుత్వవర్గాలు పసిగట్ట లేకపోయాయి. చాప క్రింద నీరులా పార్టీ నిర్మాణం జరిగింది. నైజాంలో ఫస్ట్ అండర్ గ్రౌండ్ పార్టీ కమ్యునిస్ట్ పార్టీనే.

ఇక జిల్లా కమిటీ విషయానికి వస్తే మొట్ట మొదటి కమిటీ వరంగల్ జిల్లాలోనే ఏర్పాటు అయినది. జిల్లా జనరల్ సెక్రటరీగా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు వుండేవారు. ఆ తరువాత నల్లగొండ జిల్లా కమిటి ఏర్పాటు అయినది. ఆ జిల్లాకు శ్రీ దేవులపల్లి వెంకటేశ్వరరావు పార్టీ జనరల్ సెక్రటరీ గా ఉండేవారు. జిల్లా సెక్రటరీలంతా కుడా స్టేట్ సెక్రెటరియేట్ లో  వుండేవారు. పార్టీ ప్రణాళికలో భాగ స్వాములుగా వుండేవారు.

వరంగల్ జిల్లా పోరాటాలకు ఖమ్మం తాలుకా కేంద్ర బిందువుగా వుండేది. ఖమ్మం తాలూకా కమ్మ్యునిస్ట్ పార్టీ రాజకీయ కేంద్రస్థానం నేలకొండపల్లిలోనే వుండేది. ఖమ్మం తాలూకా పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ K.L.నరసింహారావు  నేలకొండపల్లిలోనే వుండి పార్టీ కార్యకలాపాలు నిర్వహించే వారు.

బ్రిటిష్ ఇండియాకు చెందిన మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఆంధ్రాలో కమ్యునిస్ట్ పార్టీ కార్యక్రమాలు ఎక్కడ పెట్టుకున్నాఅక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో  ఘర్షణ లు జరుగుతుండేవి. కమ్యూనిస్ట్ పార్టీ  స్వాతంత్ర  సమరంలో వాళ్ళతో పాటు భాగస్వాములు కావటం లేదని కాంగ్రెస్ పార్టీ అభియోగం. నైజాం సంస్థానంలో పరిస్థితులు వేరు. నైజాంలో మాత్రం ఆంద్రమహాసభ వేదికగా కాంగ్రెస్, కమ్మ్యునిస్ట్ లు కలిసే పనిచేసే వాళ్ళు. సిద్ధాంతాలు వేరైనా 12 వ ఆంద్ర మహాసభ వరకు కలిసే పని చేశారు. వరంగల్ జిల్లా ఆంద్ర మహాసభకు ప్రెసిడెంట్ గా శ్రీ జమలాపురం కేశవ రావు, జనరల్ సెక్రటరీ గా శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు వుండేవారు.

నైజాంలో కాంగ్రెస్ వారు మరియు కమ్యూనిస్ట్ లు 12 వ ఆంద్ర మహాసభతో విడిపోయారు. మొట్టమొదటి పూర్తి కమ్యూనిస్ట్ ల వేదిక 12 వ ఆంద్ర మహాసభ 1945 సంవత్సరంలో మార్చ్ 26-28 తేదీ వరకు ఖమ్మం ప్రక్కనున్న ఖానాపురం హవేలీ గ్రామంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఆ రోజుల్లో ఆ సమావేశానికి 40 వేల మంది ప్రజలు వచ్చారు. ఆ సమావేశంలో 13 వ ఆంద్ర మహాసభకు ప్రెసిడెంట్ గా శ్రీ బద్దం ఎల్లారెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ఎన్నిక అయ్యారు. ఈ సమావేశానికి శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య అతిధిగా వచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం వుండటంవల్ల సమావేశం లో శ్రీ సుందరయ్య గారు మాట్లాడలేదు. సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని చెప్పారు. 12 వ ఆంద్ర మహా సభ జరిగిన వెంటనే 1946 సంవత్సరంలో నైజాం లో ఆంద్ర మహాసభను  కూడా నిషేధించటంతో అదే చివరి సమావేశం అయినది.

1946లో న్యూడిల్లీలో జరిగిన అఖిల భారతీయ సంస్థాన సంఘటన్ సమావేశం తరువాత ఉద్యమం నైజాం వ్యతిరేక సాయుధ పోరాటం పంధాన వెళ్ళుటకు కమ్యునిస్ట్ పార్టీ నిర్ణయం తీసుకుంది. న్యూ ఢిల్లీలో జరిగిన సమావేశానికి రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ AD HOC కమిటీ మెంబర్ గా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు హాజరు అయినారు.

పోరాటం ఆరంభం అయినది. 1946 సంవత్సరంలో కమ్యూనిస్ట్, మరియు ఆంద్ర మహాసభలపై  నిషేధం వున్నకారణంగా బోర్డర్ క్యాంప్ లు  ఏర్పాటు చేయబడ్డాయి. పార్టీ ఆఫీసులు విజయవాడకు మళ్ళించబడినవి.

అంతకు ముందు 1946 సంవత్సరంలో ఇండియాకు స్వాతంత్ర్యం రాకముందే శ్రీ జవహర్లాల్ నెహ్రు ప్రధాన మంత్రిగా కేంద్రంలో ప్రభుత్వంను బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వంతో ఒక సంవత్సర కాలానికి నైజాం ప్రభుత్వం Standstill Agreement ను కుదుర్చుకుంది. అప్పుడే నైజాం సంస్థానంలో కాంగ్రెస్ పార్టీ మీద వున్న నిషేధాన్ని ఎత్తి వేశారు. నిషేధం ఎత్తి వేసిన  సమయంలోనే మహాత్మాగాంధి మద్రాస్ నుండి రైలులో వెళుతూ మార్గమధ్యంలో  ఖమ్మం లో  ఉపన్యసించారు. కాంగ్రెస్ పార్టీ పై నిషేధం ఉన్న సమయంలో కార్యకలాపాలు విజయవాడ నుండి జరిగేవి. శ్రీ V.B. రాజు ఆఫీస్ ఇంచార్జ్ గా వుండే వారు. నిషేధం తొలగిన తరువాత కాంగ్రెస్ పార్టీకి నైజాం రాష్ట్రపార్టీ ప్రెసిడెంట్ గా శ్రీ నానాల్, ప్రధాన కార్యదర్శిగా శ్రీ మాడపాటి రామచంద్రరావు వుండేవారు.

బ్రిటిష్ ఇండియా కమ్యునిస్ట్ ఉద్యమం గురించి చెప్పేటప్పుడు శ్రీ P.C.JOSHIని మరువలేరు. ఆయన ద్రుఢమైన మాస్ లీడర్. బ్రిటిష్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీకి  జనరల్ సెక్రటరీ. ఎంతోమంది యువకులకు దిశా నిర్దేశం చేసిన వాడు. ఒకసారి 36 గంటల పాటు ఏకబిగిన ఉపన్యసించారు. శ్రీ పుచ్చల పల్లి సుందరయ్య వివాహం కుడా ఆయన సమక్షంలోనే బొంబాయలో నిరాడంబరంగా జరిగింది.  నైజాంలో వున్న యువకమ్యునిస్ట్ నాయకులందరికీ ఆయన గురుతుల్యుదు.

ఇండియన్ యూనియన్ సైన్యాలు నైజాంను లొంగదీసుకోవటానికి హైదరాబాద్ ను నలువైపులా చుట్టూ ముట్టినవి. అతను అంతకు ముందర ఇండియన్ యూనియన్ తో చేసుకున్న "STANDSTILL AGREEMENT ను కుడా విస్మరించి స్వాతంత్రాన్ని ప్రకటించు కోవటానికి చేస్తున్న ప్రయత్నాలు ఇండియాకు తెలుసు.

సెప్టెంబర్, 13, 1948 తేదిన నైజాంలో ఇండియన్ ఆర్మీ ప్రవేశించినది. నాలుగు రోజులలోనే 1947, SEPTEMBER, 17 న నైజాం, అతని సైన్యం లొంగి పొయింది. రజాకార్లు ఆయుధాలు వదలి తోక ముడిచారు. ఖాశిం రజ్విని అరెస్ట్ చేశారు. నైజాం ప్రభుత్వాన్నిరద్దు  చేశారు. ధీన్నే "ARMY & POLICE ACTION " అని పిలిచారు.

శ్రీ P. C. JOSHI నాయకత్వంలోని బ్రిటిష్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఆగష్టు, 15, 1947 న ఇండియా స్వాతంత్రం పొందినట్లు బ్రిటిష్ వాళ్ళు చేసిన ప్రకటనను స్వాగతించింది.

కానీ కొరియా యుద్ధం ప్రభావం కారణంగా స్టాలిన్ ప్రమేయంతో CPI అప్పటి  వరకు అనుసరించిన రాజకీయ  పంధాను (నైజాం సంస్థానం ఇండియాలో విలీనం కావటం, ఇండియా స్వాతంత్రాన్ని గుర్తించటం ఇతరాలు)  వెంటనే మార్చుకొంది.  పార్టీ లో విభిన్న వాదాలు ప్రారంభము అయినవి. శ్రీ జోషి వంటరి వాడు అయినాడు. ఫలితంగా శ్రీ P.C. జోషిని ఆల్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ  పదవిలో నుండి డిసెంబర్ 1947 తేదీన REMOVE చేశారు. కలకత్తాలో 1948, ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 6 వ తేదీ వరకు జరిగిన రెండవ కాంగ్రెస్ లో శ్రీ B.T. RANADIVE ను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఆయన నేతృత్వంలోని CPI పోరాటాన్ని కొనసాగించే నిర్ణయం చేసింది. ఇండియన్ యూనియన్ సైన్యాలు నైజాం కు రావటాన్ని తప్పు పట్టింది.

నైజాం కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇండియన్ యూనియన్లో విలీనం కాకుండా పోరాటం కంటిన్యూ చేయటం సమంజసం కాదని అభిప్రాయ పడినది. కానీ వారి అభిప్రాయానికి మద్దతు లభించలేదు. శ్రీ రావి నారాయణరెడ్డి  లాంటి వారు కేంద్రపార్టీ ఆదేశాలను జీర్ణించు కోలేకపోయారు. ఆయన నైజాం నుడి వెళ్ళిపోయి బాంబే వెళ్లిపోయారు. నిజాం విమోచనం తరువాత ఇండియన్ ప్రభుత్వానికి వ్యతిరేకం గా పోరాటం కంటిన్యూ చేయటాన్ని వ్యతిరేకించిన శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు లాంటి వాళ్ళు పార్టీ నుండి బయటకు వచ్చారు. ఆ సమయంలోనే మలేసియాలో జరిగిన "Congress of Communist International లో కూడా శ్రీ సత్యనారాయణ రావు రాజీనామా ప్రస్తావనకు వచ్చింది.

ఆ సమయంలోనే  ఖమ్మం వచ్చిన నైజాం రాష్ట్ర కమ్యునిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ పెరవెల్లి వెంకటరమణయ్యని నైజాం పోలీసులు అరెస్ట్ చేసి కారాగారానికి  పంపారు. తనను పెంచి విద్యాబుద్ధులు నేర్పించిన తన నాయనమ్మ అంతిమ సంస్కారాలకు ఆయన ఖమ్మం వచ్చారు. చిన్నతనం లోనే రమణయ్యగారి తల్లితండ్రులు చనిపోవటంతో వాళ్ళ నాయనమ్మే ఆయనను పెంచింది. ఆయన అరెస్ట్ ఆరోజుల్లో పెద్ద సంచలనం. రైల్వే Station లోనే రమణయ్య గారిని చూసిన పోలీస్ సిబ్బందికి ఆయనను అరెస్ట్ చేసే ధైర్యం సరిపోలేదు.పై అధికారులతో సంప్రదిపుల తరువాత అంత్యక్రియల స్థలంలో ఆయనను అరెస్ట్ చేశారు.

తప్పనిసరి పరిస్థుతులలో శ్రీ P.V.రమణయ్య స్థానంలో  1951 ఆఖరు వరకు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య రాష్ట్ర భాద్యతల స్వీకరించారు. 1948-1951 వరకు ఆయన నైజాంలో అండర్ గ్రౌండ్ లో వున్నారు.

చివరగా శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య, శ్రీ దేవులపల్లి వెంకటేశ్వరరావులు  అండర్ గ్రౌండ్ గా పోరాటం నడిపించారు.

ఈ పోరాటం నుండి కమ్యూనిస్ట్ సానుభూతి పరులు మినహా అన్ని రాజకీయ, రాజకీయేతర సంస్థలు వెళ్లి పోయాయి. నైజాం విమోచనం కలుగటంతో తాము అనుకున్న పోరాటం ముగిసిందని తలచారు. కమ్మ్యునిస్ట్ లు ఒక్కరే ఒంటరిగా గ్రామాలనుండి అడవుల కెళ్ళారు. క్రమంగా ఆయుధాలు సమ కూర్చుకున్నారు. ఒంటరి పోరాటం కావటంతో, సైన్యాలు నలుదిశలా మొహరించటంతో ఉద్యమకారులు ఇబ్బంది పడ్డారు. పార్టీ సానుభూతిపరులు కూడా వారికి ఏమి సాయం చేయలేని స్థితి.

ఈ సమయంలో పోరాట ప్రారంభం లో తెలంగాణా కామ్రేడ్స్ అభీష్టాన్ని రష్యా పాలకులకు చెప్పి పోరాట విరమణ కు అనుమతికై బ్రిటిష్ ఇండియా తరఫున నలుగు బృందము రష్యాకు వెళ్ళింది. అందులో సర్వశ్రీ  P.C.JOSHI,  S.K.DANGE, CHANDRA RAJESWARA RAO, MAKINENI BASAVAPUNNAIAH వున్నారు. ఎందుకనో నైజాం నాయకుల ప్రాతినిధ్యం రష్యా వెళ్ళిన బృందంలో లేదు. రష్యా అధినేత శ్రీ JOSEPH STALIN ఎనిమిది నెలల దాకా వాళ్లకు INTERVIEW ఇవ్వలేదు. ఈ లోపు కొన్ని వందల మంది నాయకులు కార్యకర్తలు మరణించారు. ఎంతమంది, ఎక్కడెక్కడ మరణించారో కుడా గణాంకాలు సేకరించలేని స్థితి.

చివరగా 1951 SEPTEMBERలో CPI కేంద్ర నాయకత్వం వాస్తవపరిస్థితిని గమనించి, అర్ధం చేసుకుని సాయుధ పోరాట విరమణకు అంగీకరించింది.

సెప్టెంబర్, 1948 తేదీననే ఇండియన్ యూనియన్ లో కలువటానికి ఒప్పుకుని, అప్పటివరకు ప్రశాంతంగా సాగిన పోరాటాన్ని విరమించి తమ డిమాండ్ ను ఇండియా కాంగ్రెస్ గవర్నమెంట్ పై వత్తిడి తెచ్చి సంస్కరణలు తీసుకొచ్చే మార్గం వేస్తె బాగుండేదని చరిత్ర పరిశీలకుల భావన.  అలా జరగనందున భూపంపిణీకి ఎవ్వరి  మీద వాళ్ళు పోరాటం చేశారో వాళ్ళే రాజ్యాధికారంలో కాంగ్రెస్ పార్టీ నీడన భాగ స్వాములైనారని, బలహీన వర్గాలు నష్టపోయారని (భూ పంపిణీ వగైరా..)  విశ్లేషణ.

నైజాం ప్రభుత్వం విమోచనం/ స్వతంత్ర భారతావనిలో విలీనం అయిన తరువాత  తెలంగాణాలో రాజకీయ, సామాజిక మార్పులు వచ్చినవి. 1951 సెప్టెంబర్ లో కమ్యునిస్ట్ లు  సాయుధ పోరాట విరమణ చేశారు. తరువాత 1972 సంవత్సరంలో  శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు కూడా తెలంగాణా సాయుధ పోరాటం నేర్పిన LESSONS ను  గ్రంధపరం గా  వెలువరించారు.

క్రింది చిత్రం కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు మరియు వరంగల్లు జిల్లా ఆంద్ర మహాసభ నాయకులు.


(1).క్రింద కూర్చున్న వారు: కుడి నుండి ఎడమ వైపుకు. సర్వశ్రీ 1. గుండపనేని హనుమంతరావు//గంగవరపు శ్రీనివాసరావు ,2. K. L. నరసింహారావు, 3. కందిమళ్ళ శేషగిరిరావు, 4. కొండపల్లి గోపాలరావు.

(2).కుర్చీలలో కూర్చున్నవారు: కుడి నుండి ఎడమ వైపుకు : సర్వశ్రీ 1. పారుపల్లి రామయ్య, 2. చిర్రావూరి లక్ష్మినరసయ్య, 3. పెరవెల్లి వెంకటరమణయ్య, 4. పెండ్యాల సత్యనారాయణరావు, 5. వట్టికొండ నాగేశ్వర రావు, 6. సర్వదేవభట్ల రామనాధం.

(3).వెనుక నిలుచున్నా వారు: కుడి నుండి ఎడమ వైపుకు :సర్వశ్రీ 1. రావెల్ల జానకిరామయ్య, 2. పబ్బరాజు రంగారావు, 3. మచ్చా వీరయ్య, 4. సామినేని అచ్యుతయ్య, 5. దశరధ రామయ్య, 6. పర్చా దుర్గా ప్రసాదరావు, 7. వాసిరెడ్డి వెంకటపతి, 7.నేదునూరి జగన్నాధరావు.
    
  -----పెండ్యాల వాసుదేవరావు.


<!-- Google tag (gtag.js) -->
<script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Comments

Popular posts from this blog

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

78. (social...51). ఎవవరెవరో ఎక్కడినుండో వస్తారు..... ఆలోచించండి ప్రజలారా...

80. (SOCIAL--53) దేశంలో ప్రజా సేవ ఇంత Costly నా? ఎవ్వరికీ బాధ్యతలు లేవా?