Posts

Showing posts from 2023

81. (SOCIAL--54) ఔనా? నిజమేనా?

Image
పల్లెల్లో సందడి మొదలైంది అలజడి మొదలైంది పంచాయతీ ఎన్నికల నగారా మ్రోగబోతోంది. "చేతులకు" పనిమొదలైంది "కార్లలో" ఇంధనం రెఢీ అవుతోంది "కోడవళ్లు" నూరటం షురూ అయింది. ఓ నడి వయస్సు పలుకరించింది అయ్యా చూస్తున్నరా? కాలం మారింది తరం మారింది ఓటు వేయాలంటే నోటియ్యాల గెలవాలంటే కోట్లు గావాలే యెట్లయ్యా గిట్లయితే?.... ఓ ప్రశ్న నా మనసును తట్టి లెపింది. గీట్లయితే ఎట్లా? నువ్వు రా అయ్యా యీరందరికీ బుద్ది చెప్పాలయ్యా నువ్వు నిలబడయ్యా అంది  ఆ రోజులు మళ్లీ రావాలయ్యా అంది. ఆలోచనలు ముసిరాయి యుద్ధాన్ని మొదలెట్టాయి. ఉద్యమానికి ఎక్కడో ఒకచోట  ప్రారంభం కావాలి కదా తొలి అడుగు పడాలి కదా అది ఇదే ఎందుకు కాకూడదు నడువు అని చెప్పింది. నా ఆలోచన అందీ.. కుడి యెడమ అయితే  ఇమేజ్ పోదా అని .. మనసు గీ పెట్టింది. ఉద్యమం అన్నాక కష్టాలు, నష్టాలు ఉండవా? మరకలు పడితే శుభ్రం కావా? యువతరం ఆ పని చేస్తుంది నువ్వు పదా అంది. ఔనా? నిజమేనా? చెప్పండి. .... ...పెండ్యాల వాసుదేవరావు <!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91">&l

80. (SOCIAL--53) దేశంలో ప్రజా సేవ ఇంత Costly నా? ఎవ్వరికీ బాధ్యతలు లేవా?

Image
                                    ఈ దేశంలో ప్రజాసేవ                                     ఇంత costly అయిందా?                                     వింటున్నాం                                      నియోజకవర్గంలో                                      ఒక అభ్యర్థికి 400-500 కోట్లు ఖర్చు,                                     అవతల వారూ అంతే..                                     నేనేమీ తీసిపోలేదంటూ..                                     అంతసొమ్ము ఇద్దరూ కలిసి                                     నియోజక వర్గ సమస్యలపై                                     ఖర్చు పెడితే                                     బతికినంతకాలం                                     జనం మిమ్ములను                                     వారి వారి హృదయాలలో                                      దాచుకుంటారు కదా!                                      మిమ్ముల పూజిస్తారు కదా!                                      డబ్బు ఖర్చుపెట్ట దలచుకుంటే                                      పై మార్గంలో వెళ్ళండి.                            

79. (social..52). మీరు నమ్ముతారా. ఎన్నికలు అంటే అలావుండాలి

Image
                                                    ఎన్నికలు .. సంస్కరణలు అంటే  నాకు  మా ప్రక్కగ్రామం అయిన బొదులబండకు చెందిన కీ.శే. శ్రీ పొట్టి పింజర హుసేనయ్య  జ్ఞాపకం వస్తాడు  1978 లో  ఆయన  పాలేరు నియోజక వర్గానికి ఏం. యల్. ఏ.గా గెలిచాడు   ఆ కాలంలో  ఆయన ప్రచారంలో  హంగు ఆర్భాటాలు లేవు.  మైకుల హోరులు, వాహనాల రొదలు అసలే లేవు.  ఊరేగింపులు, గడప గడపకు ప్రచారాలు లేవు.  ఒకటో, రెండో సమావేశాలు జరిగాయోమో  నాకైతే గుర్తు లేదు. మీరు నమ్ముతారా? పోలింగ్ జరిగేటప్పుడు పోలింగ్ స్టేషన్ లో  ఏజెంట్లు కూడా లేరు. పార్టీ గుర్తు చెప్పేవాళ్ళు అసలే లేరు.  సామాన్య జనంలో ఇందిరమ్మపై  అభిమానం ఉప్పెనలా ఉప్పొంగింది.  హుసేనయ్యను ఏం.ఎల్.ఏ గా గెలిపించింది. అంతకు ముందు మూడు పర్యాయాలు  ఏం. ఎల్. ఏ గా వున్న వ్యక్తిని ఓడగొట్టారు. అధికార పార్టీ అయిన కాంగ్రెసును  కాంగ్రెసు వాదులే ఓడించారు       ఇందిరమ్మ కాంగ్రెసును గెలిపించారు  అదే ఇప్పుడు మిగిలింది  జన బలం అది. జన శక్తి అలాంటిది. అలా వుంటే అందరూ బాగుంటారు  ఎన్నికల్లో ఓడినా  ఎవ్వరికీ గుండెపోటు రాదు. అందరి ఆస్తులకు రక్షణ లభిస్తుంది  ----పెండ్యాల వాసుదేవ రావు.       తేదీ: 05.11.20

78. (social...51). ఎవవరెవరో ఎక్కడినుండో వస్తారు..... ఆలోచించండి ప్రజలారా...

Image
ఆలోచించండి.  ఎన్నికల సందడి మొదలు కాగానే ఎవ్వరెవ్వరో వస్తారు ఎక్కడెక్కడి నుండో వస్తారు చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు,  దూరిపోతారు  తెగ హడావుడి చేస్తారు దండలు/ఓ ట్లు వేయించుకుంటారు కుర్చీలో/పదవిలో కూర్చుంటారు ఆ తరువాత ఏమీ పట్టించుకోరు ఏటో వెళ్ళిపోతారు ధన సంపాదనలో మునిగి పోతారు సమస్యలన్నీ పేరుకు పోతాయి సమాజం లో చీకట్లు ముసురుతాయి …. ఎన్నికల్లో  ఎప్పుడూ తక్కువ బడ్డుకు ఓటేద్దాం అనే  భావానికి అలవాటు పడ్డారు జనం ఆ ప్రభుత్వం మీద కోపం వుంటే   దాని ప్రత్యర్థి పార్టీకి, ప్రత్యర్థి పార్టీకి అధికారం వచ్చి దీనిపై కోపం వస్తే మాజీ అధికార పార్టీకి ఓటు వేయడం తప్ప గత్యంతరం లేని స్థితి ప్రత్యామ్నాయం లేని దుస్థితి… ఏదీ, ఏమీ ఆలోచించలేని సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఒకవైపు….. స్వలాభాలకోసం కార్యకర్తల ప్రయోజనాలు తాకట్టు పెట్టి అభ్యర్దుల నిర్ణయాలతో రాజకీయ పార్టీలు మరోవైపు….. ఈ పార్టీల వ్యవస్థ అవస్థల పాలు చేస్తోంది.. ఎన్నికల సంస్కరణల కొరడా పైకెత్తి యువతరం కార్య రంగంలోకి దిగవలసిన సమయం వచ్చింది, దొంగలు, దొంగలు వూళ్ళు పంచుకున్నట్లు గెలిచిన ప్రజాప్ర

77. (social..50). ప్రజాస్వామ్యం.....ఎన్నికలు.

Image
                     ప్రజాస్వామ్యం.....ఎన్నికలు.                      ప్రజాస్వామ్యం                     నన్ను తట్టి నిద్ర లేపింది.                     నిద్రమత్తు వదిలింది.                     అంటోంది                     ఎలక్షన్లు దండగ,                     కావొచ్చు ప్రజలకు పండగ...,                     కానీ నిజానికి                     అది పండగ కాదని,                    ఓటును రెండు/మూడు వేల రూపాయలుకు అమ్మటం,                    1825 రోజులకు(అయిదు సం.లు పదవీకాలం)                    రోజుకు రూపాయి చిల్లరకు                    జీవితాన్ని                    తాకట్టు పెట్టటమే అవుతుంది కదా అంటున్నట్లు వినబడింది.                    నిజమేనండీ...                    రోజు కూలి Rs 500/- చొప్పున  1825 x 500=                    Rs 9,25,000/-                    ఇస్తే బాగుంటది ..                    ఎక్కడిదో ఓ సన్నని కంఠం                    ఫుట్ పాత్ పై మందు మత్తులో జోగుతూ                      పడి వున్న బక్క పలుచని శరీరం తాలూకు ధ్వని                     వినిపించింది,                     ఆ మాటకు అంత ప్రాధాన్య

76. (social..49). రాజకీయ రంగం సమస్తం కుళ్ళి కంపు కొడుతోన్న వైనం.

Image
 ఏ పార్టీ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం ? రాజకీయ రంగం సమస్తం కుళ్ళి కంపు కొడుతోన్న వైనం. బీ.ఆర్.ఎస్  పార్టీలో టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలోకి  ..  కాంగ్రెస్ పార్టీ లో టికెట్ దొరకలేదని  బీ.ఆర్.ఎస్/బీ.జె.పీ.లోకి .... పిల్లనిచ్చి/టికెట్ ఇచ్చి పెళ్లి చేసినా/గెలిపించినా    తాళి కట్టిన మరుక్షణమే, కాళ్ళ పారాణి ఆరకుండానే   వేరే వాళ్ళతో లేచి పోడనే గ్యారంటీ ఏమిటీ? కళ్ళముందు కనిపిస్తున్నదే  కదా! సర్వేలమీద సర్వేలు చేసి  గెలుపు గుర్రాల పసిగట్టి వాటేసుకొనే వారు కొందరు..  గెలిపించిన కార్యకర్తలను, పార్టీని నట్టేట ముంచి  డబ్బు కోసం /కాం ట్రాక్టుల కోసం  గడ్డితినే వారు ఇంకొకరు... చాలా భలేగుంది మీ రాజకీయం... పార్టీ సభ్యత్వం లేకుండా శతాబ్దాల/దశాబ్దాల పార్టీలోకి  లేచిపోయి వచ్చినోళ్ళకి  కుర్చీ లిస్తే  వాళ్ళనే అందలమెక్కిస్తే  ఇంతకాలం పల్లకీ మోసిన, చమటోడ్చిన, త్యాగాలతో బతుకీడ్చిన   కార్యకర్తలకు  ఎవ్వరు  భరోసా? టికెట్ కోసం వచ్చిన అవతలోడికి  నీ సిద్దాంతాలతో పనిలేదు  నీ నాయకులపై గౌరవం వుండదు  నిన్నటి వరకు నిన్ను బూతులు తిట్టినోడు  ఈరోజు నీకు ఎలా ముద్దు అయినాడు?  తప్పదు. మీకు బుద్ది చెప్పాలి . వెట్టి చాకి

75. (social 48). పాలేరు అసెంబ్లీ నియోజక వర్గం...నియోజకవర్గాల పునర్విభజన...రాజకీయాలు.

Image
  పాలేరు అసెంబ్లీ నియోజక వర్గం...నియోజకవర్గాల పునర్విభజన...రాజకీయాలు. 1962 వ సం.లో ఖమ్మం నియోజక వర్గం నుండి విడదీసిన ప్రాంతాన్ని పాలేరు నియోజక వర్గముగా ఏర్పాటు చేశారు. అప్పుడు ఖమ్మం జిల్లా కాంగ్రెసు వర్గ రాజకీయాల ఫలితంగా నిబంధనలకు భిన్నంగా వేంసూరు అసెంబ్లీ నియోజక వర్గానికి బదులుగా వాళ్ళ స్వలాభం కోసం పాలేరును SC నియోజక వర్గంగా మార్చారు. అప్పటికింకా సర్వశ్రీ జలగం వెంగళరావు, శీలం శిద్దారెడ్డి లు ఇరువురు జిల్లా నాయకత్వ హోదాలో లేరు. వేంసూరు అసెంబ్లీ సీటు అప్పటి జిల్లా కాంగ్రెస్ ముఖ్య సీనియర్ నాయకుడు శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ గారికి అవుసరం. పాలేరు అసెంబ్లీ రాజకీయాలలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావును తప్పించటానికి దాన్ని ఎస్.సీ గా చేయటం ఆయన వ్యతిరేకులకు అవుసరం. జిల్లాలో ఆయన రాజకీయ ప్రాభవానికి అడ్డుకట్ట వేయటం వారి లక్ష్యం. ఆ సమయంలో, పంచాయతీ సమితులు ఏర్పడనప్పుడు. పాలేరు బ్లాకుకు BDO అధ్యక్షునిగా, శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ఉపాధ్యక్షునిగా సేవలను అందించారు. పాలేరు ప్రాంత అభివృద్ధిలో పెండ్యాల సత్యనారాయణరావు పాత్ర మరువలేనిది. 1957 వ సం.లో జరిగిన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా శ్రీమతి తేళ

74. (Social..47). విలీనామా? విమోచనా? విద్రోహమా?.. ఈ సందిగ్ధత ఎందుకొచ్చింది?

Image
వందల సంవత్సరాల బానిసత్వం నుండి, ఎన్నోవేల జనాల బలిదానాల ఫలితంగా వచ్చిన హైదరాబాద్ రాష్ట్రఅవతరణ తేదీని ఉత్సవంగా జరుపుకొనే రాత/అదృష్టం తెలంగాణ ప్రజలకు లేకుండా పోయింది. 1). ఏ నిజాంరాజుకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటంచేశారో, ఆ నిజాంరాజు "ది గ్రేట్ నిజాం ఆఫ్ హైదరాబాద్ ఆఫ్ దక్కన్" మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ చేతుల మీదుగా నూతనంగా ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయవలసిన దుస్థితి రావటం నా మనసును కలచి వేసింధి. "మా నైజాం రాజు తరతరాల బూజు" అన్న స్వాతంత్ర సమర యోధులే ఆ రోజు నిజాం ముందు నిలుచుని అభినందించవలసిన స్థితి. ఇండియా ప్రభుత్వం హైదరాబాద్ దక్కన్ పై చేపట్టిన "ఆపరేషన్  పోలో " విజయవంతం అయి మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ లొంగిపోయినా ఆయనని పజల అభీష్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్ర "రాజ్య ప్రముక్ః " గా ఎందుకు ప్రకటించవలసి వచ్చిందో ఆనాటి సర్దార్ వల్లభాయి పటేల్ మరియు జవహర్లాల్ నెహ్రూలకే ఎరుక. ఆనాడు ఇండియాలో విలీనమైన వందల సంస్థానాలలో దేనికీ ఇవ్వని ప్రత్యేకత ఈ సంస్థానంలోనే ఎందుకు? విలీనానికి ఆయనేమీ ఇండియాతో పోరాటం చేయలేదే! పోరాటము చేసి సంధి కుదుర్చుకోలేదే!  రాజీపత

73. (NKP..16). మా నేలకొండపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం.

Image
దేవాలయ చరిత్ర. ఆరు వందల సంవత్సరాల పైగా చరిత్ర గల నేలకొండపల్లి లోని  శ్రీ వేంకటేశ్వర స్వామీ దేవాలయాన్ని పూర్వకాలంలో "నాగుల్ దేవాలయం" గా పిలిచేవారు.నిజాం కాలం నుండి 1967 సంవత్సరంలో రాష్ట్ర దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకునే వరకు "దేవల్ బాలాజీ" అని పిలిచేవారు. యిక్కడ స్వామీ స్వయంభూ మరియు శేషావతారం.యిక్కడ కొలువైవున్న దేముడు భక్తుల కోరిక తీర్చే స్వామియని భక్తుల విశ్వాసం. 320 ఎకరాలు పైగా పొలం ఉన్నా అందులో 100 ఎకరాలు సుమారుగా సాగర్ కాలువ క్రింద పోయింది. మిగిలిన భూమిలో రేగులగడ్డా తండాలో 150 ఎకరాలు పోను నేలకొండపల్లి మరియు పరిసర గ్రామాల్లో ఉంది. 1967 వరకు ముంతకల్దారులు గా మరియు స్థానాచార్యులు గా 17 తరాలు "ముడుంబాయ్" వంశస్థులు వున్నారు. వారి కోరిక ప్రకారం తదుపరి శ్రీ మరింగంటి కృష్ణమాచార్యులు వచ్చారు.  ఉత్సవ సమయాల్లో స్వామి వాహన దారులుగా బెస్త కులస్థులు ఆనాటినుంచి ఈనాటి వరకు తరాలు మారినా సాంప్రదాయం కొనసాగిస్తున్నారు.  మహిమ మరియు చరిత్ర ఉన్న ఈ దేవాలయం గురించిన చారిత్రక ఆధారాలు/ శిలా శాసనాలు లేకపోవటం దురదృష్టకరం. దేవాలయం తో అనుభంధం. మా వూరికి (నేలకొండపల్లి) తూరు

72. (NKP..15). ). నా సాహిత్య జ్ఞాపకాలు.

Image
  సాహిత్య జ్ఞాపకాలు. ఏవేవో జ్ఞాపకాలు. అవన్నీ నా సాహిత్య ప్రపంచానికి సంబంధించినవి. ఎప్పుడు భావావేశం వస్తే అప్పుడే... ఎక్కడవుంటే అక్కడే ...వెంటనే వచన కవితలు వ్రాసే వాడిని. వ్రాసిన తేదీ, సమయం కూడా అందులో వ్రాసేవాడిని. అప్పుడు నా వయస్సు 17 సంవత్సరాలు. అది 1972 వ సంవత్సరం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో "సిటీ కాలేజీ"లో బి.కాం చదువుతున్న రోజులు. ఒకరోజు ఏదో పనిబడి ప్రిన్సిపాల్ గారిని కలవటానికి వెళ్లి ఆయన రూమ్ ముందర ఉన్న బెంచీపై కూర్చున్నా. ఇంతలో ఒక భావావేశం వెన్ను తట్టింది. వెంటనే నా జేబులో ఉన్న పెన్ను వడివడిగా చేతులో ఉన్న నోట్ బుక్ లో ఉన్న తెల్ల కాగితం పైకి దూసుకెళ్లింది. భావం అక్షర రూపం దాల్చింది. దాని ఫలితమే.."నేను ఆశావాదిని...." అనే నా వచన కవిత. కోటి ఆశలతో, రంగుల భవిష్యత్తు కలలతో వందల మైళ్ళ దూరంలో ఉన్న హైద్రాబాద్ మహానగరంలో అడుగిడిన ఆనంద క్షణాలు అవి. ఇంతలో ఒక విద్యార్థి వచ్చి నా ప్రక్కనే కూర్చుని నేను వ్రాసిన కవితను చదివి.." ఏమిటండీ మీ ఆనందం అంత ఉరక లేస్తోంది...ఈ సమాజాన్ని, ఈ పరిస్థితులను చూస్తుంటే మీకంత ఆశాజనకంగా కనిపిస్తోందా" అని చర్చ లేవదీశాడు. ఏవేవో చర్చించా

71. (NKP..14). నేలకొండపల్లి PHC స్థల వివాదం చరిత్ర.

Image
నేలకొండపల్లి ప్రాధమిక ఆరోగ్యకేంద్ర స్థల వివాదం.... 36 సం.ల క్రిందటి మాట.    (1). నేలకొండపల్లి ప్రాధమిక ఆరోగ్యకేంద్రం, స్థానిక కో-ఆపరటివ్ రూరల్ బ్యాంకు స్థలాల మధ్య సరిహద్దు వివాదం వచ్చింది.  ఒక 30 సార్లు కనీసం సంబంధిత అధికారులు సర్వే చేసి నివేధికలిచ్చారు. వివాదమైతే ఇప్పటికీ అంతే ఉంది. విశేషము ఏమంటే స్థానిక గ్రామపంచాయతీ వారు అందులో మా భూమి ఉందంటూ ఆ స్థలంలో జొరబడి కొంత స్థలాన్ని తమ శానిటరీ సిబ్బందికి ప్రభుత్వ నిధులతో ఇళ్లు కట్టించి ఇచ్చారు. రక్షిత మంచినీటి సరఫరా పథకానికి సంబంధించిన వాటర్ ట్యాంక్, వాచమన్ రూమ్ కట్టించారు. ఆ ఇళ్లకు దోవ/రోడ్డు క్రింద కొంత స్థలం కేటాయించారు. స్థానిక మహిళామండలి భవన నిర్మాణానికి భూమి కేటాయించారు. ఇదే అదనుగా కొందరు షాప్స్ కట్టారు. మరికొందరు ఈ భూమి మాదే అంటూ గుడిసెలు వేశారు. ఈ ప్రాంత MLA లు గా చేసినవారు వివిధ కాలాలలో రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా చేశారు. అయినా వారు ఎన్నడూ ఈ స్థలాలపై దృష్టి పెట్టలేదు. అది ఈ ప్రాంత ప్రజల దురదృష్టం. ఆ స్థలం చేసుకున్న పాపం. ఒక దశాబ్దం పాటు స్థానిక ప్రింట్ మీడియాకు ఇదో పెద్ద హాట్ టాపిక్. సీరియల్ వ్యాసాలు వ్రాశారు. వారికి కొద్దిగా ఓపిక సన