50. (ఖమ్మం చరిత్ర-2) ఉద్యమాల గుమ్మం విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం.

ఉద్యమాల గుమ్మం విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం.

క్రింది చిత్రం నేలకొండపల్లిలోని శ్రీ విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం. ఈ చిత్రంలో 1935 సంవత్సరంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం ముందర జనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. నడుమ మీద చేయివుంచి మాట్లాడుతున్న వ్యక్తే శ్రీ పెండ్యాల. ఈయనకు ఎడమ ప్రక్కన శ్రీ దుగ్గిరాల శ్రిరామయ్య. 


ఈ గ్రంధాలయాన్ని 1912 సంవత్సరంలో స్థాపించారు. ఆనాటి గ్రామ పెద్ద్దలు శ్రీ పెండ్యాల వాసుదేవ సోమయాజులు తన ఆత్మీయ మిత్రుడు నేలకొండపల్లి గ్రామ కరణం/పట్వారి  శ్రీ రావులపాటి గోపాలరావు సహకారంతో గ్రంధాలయానికి శ్రీకారం చుట్టారు. శ్రీ వాసుదేవ సోమయాజుల గారి ఐదుగురు కుమారులు ఆ రోజులలో న్యాయవాద వృత్తిలోవుండేవారు. ఆయన పెద్ద బూస్వామి. బ్రిటిష్ ఇండియాలోని కృష్ణ, గుంటూరు జిల్లాలలో కూడా భూములు వుండేవి. ఆ ప్రాంతంలోని భూములకోసం తరచు ఆప్రాంతాలకు వెళ్ళుచుండేవాడు. ఆ ప్రాంతాల ప్రభావముతో ఆంధ్రభాషాభిమానం పట్ల ఆవిధంగా ఆకర్షించ బడ్డాడు. ఆ విధంగా ప్రభావితమైన భావజాలంతో తెలుగు/ఆంద్ర భాషా వ్యాప్తికై నడుం బిగించి ఈ గ్రంధాలయం ద్వారా కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఆనాడు అందులో తెలుగు మరియు సంస్క్రుత సాహిత్య పుష్తకాలు వుండేవి. 
క్రింది చిత్రంలో గ్రందాలయ వ్యవస్థాపకులు శ్రీ పెండ్యాల వాసుదేవ సోమయాజులు వున్నారు.



కాలం తెచ్చిన మార్పులు, జనం ఆలోచనా విధానంలో కలిగిన మార్పుల ఫలితంగా సామాజిక స్పృహవున్న వ్యక్తులలో సామాజిక భాధ్యతలను  తట్టి లేపాయి. 1934 సంవత్సరంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, విరాట్ రాయాంధ్ర గ్రంధాలయాన్ని పునరుద్ధరించి సామాజిక విప్లవం దిశగా దాన్ని నడిపించారు. ప్రపంచంలో వస్తున్న మార్పులను జనబాహుళ్యం లోకి తీసుకొని వెళ్ళే ఆలోచనలో భాగంగా  ఆధునిక సాహిత్యాన్ని, కమ్యూనిస్ట్ సాహిత్యాన్ని ప్రజలకు అందు బాటులో ఉంచారు. జనాన్ని అక్షరాస్యులుగా తీరిచి దిద్దుటకు ప్రయత్నిచారు. రాత్రి పాతసాలలు నెలకొలిపి వారిని గ్రంధాలయం వేపు అడుగులేసేటట్లు మార్గం వేశారు.

గ్రామసరిహద్దులలో వున్న బ్రిటిష్ ఇండియా నాయకులతో, నిజాం సంస్థానంలో వున్న ఇతర ప్రాంత పెద్దలతో సంభంధాలను కలిగి వుండేవారు. ఆయన తన రాజకీయ ప్రారంభ దినాలలో ఎక్కువ భాగం ఆ గ్రంధాలయం లోనే గడిపేవారు. ఇక్కడ జరిగిన రహస్య సమావేశాల పరిణామాల ఫలితమే నిజాం సంస్థానంలో నిజాం రీజినల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. ఈ సమావేశాలకు బ్రిటిష్ ఇండియా నుంచి శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య, శ్రీ చండ్ర రాజేశ్వర్ రావు, శ్రీ తరిమెల నాగిరెడ్డి, శ్రీ కొండపల్లి సీతారామయ్య వచ్చి వెళ్ళేవారు. స్థానికంగా శ్రీ పెరవెల్లి వెంకట రమణయ్య, శ్రీ దేవులపల్లి వెంకటేశ్వర రావు, శ్రీ రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, శ్రీ కాలోజి, శ్రీ హయగ్రీవా చారి, శ్రీ దాశరధి, శ్రీ వట్టికోట ఆల్వార్ స్వామి  మరియు శ్రీ జమలాపురం కేశవరావు తదితరులు వచ్చీవారు.
ఈ క్రింది  చిత్రం విరాట్ రాయాంధ్ర గ్రంధాలయం యొక్క ముందరి భాగం. మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని కుడా చూడవచ్చు. ఇక్కడి గాంధి విగ్రహానికి కూడా ఒక విశిష్టత వుంది. 

ఈ విగ్రహాన్ని శ్రీ పెండ్యాల సత్యనారయ రావు గారి ఆదేశం మేరకు లోకల్ కమ్యూనిస్ట్ నాయకులే విరాట్ రాయాంధ్ర  గ్రంధాలయం ఆవరణ లో నెలకొలిపారు. ఉద్యమ సమయం కావటంతో తన మనిషి అయిన శ్రీ మండవ రత్తయ్య ద్వారా ఈ కార్యక్రమం జరిపించారు. ఆ కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది.

The Statue of Mahatma Gandhi was unveiled by Communist Sympathysors in 1940's. It was the evidence of the previous history archive. 



ఇక్కడ గాంధి జయంతి ని స్థానికులు జరుపుకోనటం అలవాటు. ఆ సందర్భ మైన దే ఈ చిత్రం.శ్రీ పెండ్యాల వాసుదేవ రావు నాయకత్వంలోని యువకులు ఇందులో వున్నారు.Gandhi Jayanthi celebrations at Girls School, Nelakondapally by Youth Congress workers in 1980's.

నేలకొండపల్లి గ్రామం లో బాలికల కోసం ప్రత్యేకంగా ఒక ప్రైమరీ స్కూల్ ను శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు ప్రభుత్వం ఆధ్వర్యంలో నెలకొలిపారు. ఆ స్కూల్ వసతికి అప్పుడు విరాట్ రాయాంధ్ర గ్రంధాలయాన్ని ఎంపిక చేసారు.అందులోని పుష్తకాలను బీరువ లలో  నిక్షిప్తం చేసి అక్కడే ఒక మూలన ఉంచారు. ప్రైమరీ స్కూల్ గా వున్నఆ స్కూల్ UP GRADE కావటం వల్ల కొత్త కాలం ఆ పుష్తకాలలో మిగిలినవి మా ఇంట్లో భద్రపరిచినారు. కొంత కాలం తరువాత శ్రీ భక్త రామదాసు స్మారక గ్రంధాలయాన్ని ప్రారంభించాక ఆ పుష్తకాలను ఆ గ్రంధాలయంలో ఉంచారు. ఆ గ్రంధాలయానికి శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారే చైర్మన్ గా వుండేవారు. 

ఆ భక్త రామదాసు స్మారక గ్రంధాలయాన్ని స్వాతంత్ర సమరయోధులు శ్రీ హయగ్రీవాచారి ప్రారంభించారు. 

శ్రీ భక్త రామదాసు స్మారకమందిరంలోనే ఈ గ్రంధాలయం నడిచింది.


దాదాపు ఈ సమయం లోనే శ్రీ భక్త రామదాసు చిత్రపటాన్ని కుడా ఆవిష్కరించారు. పై చిత్రం లో రిబ్బన్ కత్తిరిస్తున్న శ్రీ హయగ్రీవాచార్యం కుడి ప్రక్కన శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, ఆయన వెనుక లోకల్ MLA శ్రీ కత్తుల శాంత య్యఎడమ వేపున శ్రీ పెండ్యాల కృష్ణమూర్తి వున్నారు.


పై చిత్రంలో శ్రీ భక్త రామదాసు చిత్రపటాన్ని ఆవిష్కరిస్తున్న శ్రీ హయహ్రీవాచారి, కుడి ప్రక్కన శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, ఎడమప్రక్కన శ్రీ రావులపాటి సత్యనారాయణ రావు, వెనుక శ్రీ కత్తుల శాంతయ్య లోకల్ MLA వున్నారు.

ఇది సంక్షిప్తంగా గొప్ప చరిత్ర కలిగిన మా నేలకొండపల్లి విరాట్ రాయాంధ్ర  గ్రంధాలయం చరిత్ర.

    -----పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Comments

Popular posts from this blog

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

78. (social...51). ఎవవరెవరో ఎక్కడినుండో వస్తారు..... ఆలోచించండి ప్రజలారా...

80. (SOCIAL--53) దేశంలో ప్రజా సేవ ఇంత Costly నా? ఎవ్వరికీ బాధ్యతలు లేవా?