G-1M93C8YK91 LIBERTY.: March 2023

Sunday, March 5, 2023

మా నేలకొండపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం.

73. (NKP..16). 

శ్రీ వేంకటేశ్వర స్వామీ దేవాలయ చరిత్ర.


ఆరు వందల సంవత్సరాల పైగా చరిత్ర గల నేలకొండపల్లి లోని  శ్రీ వేంకటేశ్వర స్వామీ దేవాలయాన్ని పూర్వకాలంలో "నాగుల్ దేవాలయం" గా పిలిచేవారు.నిజాం కాలం నుండి 1967 సంవత్సరంలో రాష్ట్ర దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకునే వరకు "దేవల్ బాలాజీ" అని పిలిచేవారు.
యిక్కడ స్వామీ స్వయంభూ మరియు శేషావతారం.యిక్కడ కొలువైవున్న దేముడు భక్తుల కోరిక తీర్చే స్వామియని భక్తుల విశ్వాసం.

320 ఎకరాలు పైగా పొలం ఉన్నా అందులో 100 ఎకరాలు సుమారుగా సాగర్ కాలువ క్రింద పోయింది. మిగిలిన భూమిలో రేగులగడ్డా తండాలో 150 ఎకరాలు పోను నేలకొండపల్లి మరియు పరిసర గ్రామాల్లో ఉంది. 1967 వరకు ముంతకల్దారులు గా మరియు స్థానాచార్యులు గా 17 తరాలు "ముడుంబాయ్" వంశస్థులు వున్నారు. వారి కోరిక ప్రకారం తదుపరి శ్రీ మరింగంటి కృష్ణమాచార్యులు వచ్చారు. ఉత్సవ సమయాల్లో స్వామి వాహన దారులుగా బెస్త కులస్థులు ఆనాటినుంచి ఈనాటి వరకు తరాలు మారినా సాంప్రదాయం కొనసాగిస్తున్నారు. మహిమ మరియు చరిత్ర ఉన్న ఈ దేవాలయం గురించిన చారిత్రక ఆధారాలు/ శిలా శాసనాలు లేకపోవటం దురదృష్టకరం.

దేవాలయం తో అనుభంధం.
మా వూరికి (నేలకొండపల్లి) తూరుపు దిక్కున పొలాల మధ్యన, వూరికి దూరంగా ఉన్న వెంకటేశ్వర దేవాలయం చుట్టూ వాగు(తూరుపు మినహా) ఉంటుంది. ఈదులు గీయటానికి వచ్చే గౌడలు, వాగులో చాకళ్ళు ఉదయం నుంచి సందడి.1958 ప్రాంతంలో ధ్వజస్థంభాన్ని వేశారు. నేను మా జీప్ లో మా ఫాథర్ తో వెళ్లిన గుర్తుంది. వీధి దీపాలు లేకున్నా అ చీకెట్లోనే ప్రతి శనివారం వెంకటేశ్వర దేవాలయానికి స్నేహితులతో వెళ్ళేవాడిని. ధర్మకర్తల కమిటీ వచ్చేవరకు గ్రామ మాలీ పటేల్ శ్రీ రావులపాటి రంగారావు గారు ప్రతి శనివారం భజన హార్మొనీ వాయిస్తూ చేసేవారు. నేనూ అందులో పాలుపంచుకొనే వాడిని. దేవాలయం లోనికి వెళ్ళాలంటే కత్వా పైనున్న రాతి గోడ ఎక్కి దిగవల  సిందే. యువకులతో బాటు వ్రుద్హులు అయినా, స్త్రీలు అయినా పిల్లలు అయినా దైవ దర్శనం కావాలంటే అలా వెళ్ళవలసిందే. దేవాలయానికి దాహ్షిణ దిక్కుగా చారిత్రాత్మక బైరాగుల గుట్ట వుంటుంది. యువకులము అందరము గుట్ట ఎక్కటానికి ప్రతేకంగా వెళ్ళే వాళ్లము. ఆ రోజులు ఆ అనుభవాలే వేరు.

అభివృధ్హి పధాన దేవాలయం--దేవాదాయ శాఖ నియామక కమిటీ ఆవిర్భావం.
1967 సంవత్సరం లో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు చైర్మన్ గా నేలకొండపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ స్తానానికి  ధర్మకర్తల మండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.వారి ఆధ్వర్యంలో దేవాలయం అభివృద్ధి తో శోభను సంతరించుకుంది. దేవాలయ ప్రవేశానికి వాగుపై సిమెంట్ వంతెన కట్టారు. ఎలక్ట్రిసిటీ సదుపాయం కల్పించారు. తిరుమల నుంచి మైక్ సెట్ తెప్పించారు, చుట్టూ రాతి కాంపౌండ్ కట్టించారు.పూజారి కుటుంబ అవుసరాల నిమిత్తం రూమ్ కట్టించారు. కొంత కాలం గోశాల నిర్వహించారు. వాగు అవతల వున్న రాతి మండపంలో శ్రీరామనవమి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించారు. ఉప్పుదిమ్మెల దగ్గరనుండి దేవాలయం వరకు విద్యుత్ వీధి దీపాలు వేయించారు. దేవాలయ ప్రాంగణం అంతా నల్లరాయి కావటంతో వాస్తు కూడా అవుసరం కావటం వల్ల భావి తవ్వించే ప్రయత్నాలు ఫలించలేదు. ఆదాయ పెంపు మార్గాలకు మాత్రం ప్రయత్నాలు ప్రారంభించారు.

క్రింది ఫోటో దేవాలయ ప్రవేశం తరువాత దేవాలయ ప్రాంగణం.

క్రింది ఫోటోలో దేవాలయం ముందర కనిపిస్తున్న తెల్ల రాతి కట్టడమే  ముజ్జిగుడెం మరియు అనాసాగరం గ్రామాలకు రహదారి ఒకప్పుడు. కత్వాకు వరద వచ్చినప్పుడు జనాలు ప్రాణాలకు తెగించి నడిచే వాళ్ళు.

                       ఈ క్రింద ఫోటోలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు 
            కనిపించే రాతి గోడ కట్టడమే దేవాలయ ప్రవేశానికి పోయే రోడ్డు1968 వరకు.

First published on dt: 13.04.2018.

                                                                                      ------పెండ్యాల వాసుదేవ రావు/

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

నా సాహిత్య జ్ఞాపకాలు.

                         నా సాహిత్య జ్ఞాపకాలు.

72. (NKP..15). ). 

సాహిత్య జ్ఞాపకాలు.

ఏవేవో జ్ఞాపకాలు.

అవన్నీ నా సాహిత్య ప్రపంచానికి సంబంధించినవి.

ఎప్పుడు భావావేశం వస్తే అప్పుడే...

ఎక్కడవుంటే అక్కడే ...వెంటనే వచన కవితలు వ్రాసే వాడిని. వ్రాసిన తేదీ, సమయం కూడా అందులో వ్రాసేవాడిని.

అప్పుడు నా వయస్సు 17 సంవత్సరాలు.

అది 1972 వ సంవత్సరం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో "సిటీ కాలేజీ"లో బి.కాం చదువుతున్న రోజులు. ఒకరోజు ఏదో పనిబడి ప్రిన్సిపాల్ గారిని కలవటానికి వెళ్లి ఆయన రూమ్ ముందర ఉన్న బెంచీపై కూర్చున్నా. ఇంతలో ఒక భావావేశం వెన్ను తట్టింది. వెంటనే నా జేబులో ఉన్న పెన్ను వడివడిగా చేతులో ఉన్న నోట్ బుక్ లో ఉన్న తెల్ల కాగితం పైకి దూసుకెళ్లింది. భావం అక్షర రూపం దాల్చింది. దాని ఫలితమే.."నేను ఆశావాదిని...." అనే నా వచన కవిత.

కోటి ఆశలతో, రంగుల భవిష్యత్తు కలలతో వందల మైళ్ళ దూరంలో ఉన్న హైద్రాబాద్ మహానగరంలో అడుగిడిన ఆనంద క్షణాలు అవి. ఇంతలో ఒక విద్యార్థి వచ్చి నా ప్రక్కనే కూర్చుని నేను వ్రాసిన కవితను చదివి.." ఏమిటండీ మీ ఆనందం అంత ఉరక లేస్తోంది...ఈ సమాజాన్ని, ఈ పరిస్థితులను చూస్తుంటే మీకంత ఆశాజనకంగా కనిపిస్తోందా" అని చర్చ లేవదీశాడు. ఏవేవో చర్చించాము.

అతని పేరు శ్రీ ఎస్. వి. సత్యనారాయణ. మొన్నా మధ్య "తెలుగు విశ్వవిద్యాలం వైస్ ఛాన్సిలర్" గా వున్నాడు. 

ఈ సంవత్సరం College మాగజైన్  కు కవిత ఎందుకు పంపకూడదు, పంపించండి అన్నాడు. పంపాను. సెలెక్ట్ అయింది. 

ఆ కవిత వ్రాయటమూ ఓ అందమైన జ్ఞాపకం.

అది B. Com (తెలుగు) ఫస్ట్ ఇయర్ Econamics క్లాస్ రూమ్.మా లెక్చరర్ శ్రీ జయశంకర్(అటుతరువాత "ప్రొఫెసర్ జయశంకర్ సారు" గా సూపరిచితులు) ఒక ప్రక్క పాఠం చెబుతుండగానే నా చేతిలో ఉన్న పెన్ను ఎదురుగా బల్లపై వున్న నోటు పుస్తకములోని తెల్లకాగితంలో అక్షర ప్రవాహాన్ని పారించింది. ఒక ప్రక్కన జయశంకర్ గారిని గమనిస్తూ వచ్చిన భావావేశాన్ని అక్షరబద్దం చేయటంలో నిమగ్నమై ఉన్న నన్ను  నా ప్రక్కనే ఉన్న నా సహవిద్యార్థి ఇంద్రారెడ్డి(అటు తరువాత "ఉమ్మడి AP హోమ్ మంత్రి" గా సుపరిచుతులు) మధ్య మధ్యలో మోచేత్తో నన్ను ఎలర్ట్ చేసేవాడు. అప్పుడు వ్రాసిన కవితే " బాపూ మరోసారి రావూ". ఇదే college మాగజైన్ కు పంపా. ఆ కవిత వ్రాయటానికి ఆ పీరియడ్ టైం పట్టింది. ఆ కవితను మాగజైన్ వ్యవహారాలు చూసే మా తెలుగు లెక్చరర్ శ్రీ రెడ్డి గారికి ఇచ్చాను. ఏమిటీ ఇది ఇంత పెద్దగా ఉంది. దీన్ని నువ్వే వ్రాశావా అని అడిగారు. "అమృతం కురిసిన రాత్రి" లో శ్రీ తిలక్ వ్రాసినంత పొడవుంది.

తరువాత మళ్లీ కలసిన శ్రీ ఎస్.వీ.ఎస్ సలహా మేరకు OU కాంపస్ లోని ఆర్ట్స్ కాలేజ్ లో యూనివర్సిటీ లెవల్లో జరిగే సెమినార్ కు మా "సిటీ కాలేజ్" ప్రతినిధిగా హాజరు ఐనాను. అదే నాజీవితాన్ని మలుపు తిప్పింది. ఎందరో పరిచయమయ్యారు. సర్వశ్రీ దువ్వూరి చక్రపాణి (IAS), CH. పాండురంగ మూర్తి(రిటైర్డ్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్, కపిల రామ్మోహన్ తదితరులు). వారి పరిచయం వల్లనే YMCA వక్తృత్వ సాహిత్య కళా సమితి కార్య క్రమాలలో చురుకుగా పాల్గొన్నాను.

Dr నాగినేని భాస్కర్ రావు పరిచయంతో "యువ భారతి" సాహిత్య కార్యక్రమాలలో లీనమయ్యే వాడిని. విశ్వనాథం గారితో పరిచయం ఎన్నో విషయాలను తెలుసుకోవటానికి దోహద పడింది.

"నేను ఆశావాదిని..."కవితను శ్రీ దాశరధి రంగాచార్యకు (ఆయన ఇంట్లో )చూపించాను. "సంతోష స్థంభాలు" అని నేను కవితలో వ్రాసిన పదం పై భాషా ప్రాతిపదికన అభ్యంతరం చెప్పారు. ఆశతో ఉండటం అవుసరమే..."అగ్గిలా" ఉండాలన్నారు.

అప్పటికప్పుడే..

"నేను అగ్గిని..

మండుతాను.. మండిస్తాను..

మండే మంటలతో వెలుగులు పండిస్తాను"...అని వ్రాశా..


-----------పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Saturday, March 4, 2023

నేలకొండపల్లి PHC స్థల వివాదం చరిత్ర.

71. (NKP..14). 

నేలకొండపల్లి ప్రాధమిక ఆరోగ్యకేంద్ర
స్థల వివాదం....36 సం.ల క్రిందటి మాట. 

36 సం.ల క్రిందటి మాట.    (1).


నేలకొండపల్లి ప్రాధమిక ఆరోగ్యకేంద్రం, స్థానిక కో-ఆపరటివ్ రూరల్ బ్యాంకు స్థలాల మధ్య సరిహద్దు వివాదం వచ్చింది. 

ఒక 30 సార్లు కనీసం సంబంధిత అధికారులు సర్వే చేసి నివేధికలిచ్చారు. వివాదమైతే ఇప్పటికీ అంతే ఉంది.

విశేషము ఏమంటే స్థానిక గ్రామపంచాయతీ వారు అందులో మా భూమి ఉందంటూ ఆ స్థలంలో జొరబడి కొంత స్థలాన్ని తమ శానిటరీ సిబ్బందికి ప్రభుత్వ నిధులతో ఇళ్లు కట్టించి ఇచ్చారు. రక్షిత మంచినీటి సరఫరా పథకానికి సంబంధించిన వాటర్ ట్యాంక్, వాచమన్ రూమ్ కట్టించారు. ఆ ఇళ్లకు దోవ/రోడ్డు క్రింద కొంత స్థలం కేటాయించారు. స్థానిక మహిళామండలి భవన నిర్మాణానికి భూమి కేటాయించారు.

ఇదే అదనుగా కొందరు షాప్స్ కట్టారు. మరికొందరు ఈ భూమి మాదే అంటూ గుడిసెలు వేశారు.

ఈ ప్రాంత MLA లు గా చేసినవారు వివిధ కాలాలలో రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా చేశారు. అయినా వారు ఎన్నడూ ఈ స్థలాలపై దృష్టి పెట్టలేదు. అది ఈ ప్రాంత ప్రజల దురదృష్టం.
ఆ స్థలం చేసుకున్న పాపం.

ఒక దశాబ్దం పాటు స్థానిక ప్రింట్ మీడియాకు ఇదో పెద్ద హాట్ టాపిక్. సీరియల్ వ్యాసాలు వ్రాశారు. వారికి కొద్దిగా ఓపిక సన్నగిల్లినట్లుంది. ఇప్పుడేమి మాట్లాడటం లేదు.

కోసామెరుపు ఏమిటంటే ఇటీవలే గ్రామపంచాయతీ నిధులతో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మిస్తే స్థానిక MLA రిబ్బన్ కత్తిరించాడు. రక్షిత నీటి సరఫరా కు సంబంధించిన వాటర్ ట్యాంక్ ను కులగొట్టే శారు. ఏవో అభివృద్ధి కార్యక్రమాలకు ఆ స్థలం కావాలట.

ఈ మధ్యనే అటుగా వెళ్తూ ఆ స్థలాన్ని చూశాను. చాలా బాగుంది. ఒక చిన్న కాలనీలా వుంది. పక్కా భవంతులతో, షాపులతో, ఆ భవంతులకు సిమెంట్ రోడ్డుతో నవ యవ్వనంతో ఉంది.

అటు వెళుతే మీరుకూడా ఒక లుక్కేయండి.

36 సంవత్సరాల క్రిందటి మాట.   (2).


నేలకొండపల్లి, సింగారెడ్డిపాలెం రెవిన్యూ గ్రామాల మధ్య సరిహద్దులో ప్రస్తుతపు మెయిన్ రోడ్డులో పాత బోదులబండ డొంక ప్రక్కనే ఉన్న సర్వే నెంబర్ 219/1 లో ఒకే పట్టేదారు నుండి మొదటగా సహకార గ్రామీణ బ్యాంక్ (ఒక ఎకరం), ఆ తరువాత ప్రాధమిక ఆరోగ్య కేంద్రం(2ఎకరాలు) కొనుగోలు చేసి రిజిస్టర్డ్ డాకుమెంట్స్ ను పొందాయి.

దశాబ్దాల తరబడి రెండు సంస్థల స్థలాలకు ప్రహరీ గోడలు లేకపోవటంతో స్థలాల్లో కొంత భాగం ఆక్రమణలకు గురిఅయింది. సహకార బాంకు 1961 నుండి కొన్ని కారణాల వల్ల 1975 వరకు కార్యకలాపాలు లేక Defunct కావటం ఆక్రమణ దారులకు వరం గా మారింది.

సహకార గోదామును 1983 సం. లో లక్మి మహిళామండలికి స్థానిక గ్రామ పంచాయతీ పాలకవర్గం ధారాదత్తం చేయటంతో వివాదం రాజుకుని క్రమంగా సమస్య పక్కదారులు పట్టి రాజకీయ కార్చిచ్చులా వ్యాపించింది. అది ఇప్పటికీ కాలుతూనే ఉంది.

ఆ స్థలం పాత ఫోటోలు మీకోసం.


36 సంవత్సరాల క్రిందటి మాట (3).

అసలు జరిగిందేమిటంటే ------ 1).


సింగారెడ్డిపాలెం రెవిన్యూ గ్రామానికి చెందిన 219/1 సర్వే నంబరులో రిజిస్టర్డ్ డాక్యుమెంట్  నంబర్ 139/59,తేదీ.3.3.1959 ప్రకారం సహకార గ్రామీణ బ్యాంకు కు ఒక యకరం భూమి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నంబర్ 1915/60, తేదీ.3.12.1960 ప్రకారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి రెండు ఏకరముల భూమిని ఆ సర్వే నంబరు పట్టాదారు నుండి కొనుగోలు చేశారు. ఆ స్థల స్వరూపాన్ని తెలిపే మ్యాప్ క్రింద ఇవ్వబడింది. 


అప్పుడు సింగారెడ్డిపాలెం గ్రామం సాంకేతికంగా మృత గ్రామం.ఎవ్వరు నివాసం లేరు. 

పైన పేర్కొన్న రెండు సంస్థల భూమికి కాంపౌండ్ వాల్స్ కట్టలేదు. ఆ రోజుల్లో అవుసరమనిపించలేదు. ఇలా ఉండగా 1961 నుండి సహకార గ్రామీణ బ్యాంకు సహకాశాఖ విచారణలో మునిగి కార్యకలాపాలు స్తంభించి 1975 వరకు మూతపడి పోయినది. పి. హెచ్.సి కి ఒక భవనాన్ని కార్య కలాపాల అవుసరాలకు నిర్మించారు.

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మరియు సహకార గ్రామీణ బ్యాంకు స్థలాల ఉమ్మడి మ్యాపు క్రింద చూడవచ్చు. ఈ మ్యాపును ఈ రెండింటి స్థలాలను కొనుగోలు చేసిన అప్పటి గ్రామ సర్పంచ్ పెండ్యాల సత్యనారాయణ రావు గారి స్వహస్తాలతో రాశారు. 

ఇలాఉండగా 1971 సం.లో అప్పటి ఖమ్మం జిల్లాలో రక్షిత నీటిసరఫరా పథకమును ఖమ్మం జిల్లా కలెక్టర్(మెమోరాండం. నంబరు.6654/progs. Vll/70-71, తేదీ. 18.11.1971) మంజూరు చేశారు. అందులో నేలకొండపల్లి గ్రామ పంచాయతీ ఉంది. పాలవంచ, బూర్గంపాడు, బయ్యారం, సుజాత నగర్ తదితర 9 గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. దానికి గ్రామ ప్రజల తరఫున స్థానిక గ్రామ పంచాయతీ "పీపుల్స్ కంట్రిబ్యూషన్" కట్టవలసి రావటంతో దానికి ప్రత్యామ్నాయంగా ఖాళీగా ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్ర స్థలాన్ని చూపంచటంతో జిల్లాపరిషత్ నిధులతో వాటర్ టాంకు, వాచమన్ క్వార్టరు నిర్మాణం చేశారు. 

నిర్మాణం పూర్తి కాగానే RC. NO.100/1977, తేదీ. 1.4.77 ప్రకారం జిల్లాపరిషత్ ఇంజనీరింగ్ శాఖ వారు ఆ నిర్మాణాలను స్వాధీనంలోకి తీసుకొనమని స్థానిక గ్రామ పంచాయతీకి  ఉత్తరం వ్రాయటంతో తేదీ. 30.04.77 నాటి గ్రామపంచాయతీ సమావేశములో ఎజెండా.నం.7 ప్రకారం తీర్మానించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న భూమి ఎ.0.14. కుంటలుగా పేర్కొంటూ, దాని చుట్టూ సిమెంట్ స్తంభాలతో తీగ వేసి కాంపౌండ్ నిర్మించాలని తేదీ. 29.07.77 నాటి పాలకవర్గ సమావేశంలో గ్రామపంచాయతీ ఎజెండా.నం.33 ద్వారా తీర్మానిం చారు. అప్పటి నుండీ ఆ 0.14 కుంటల భూమి గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉంది.


రక్షిత మంచినీటి సరఫరాపధకం అమలుకు, ప్రజాప్రయోజనాలకోసం మాత్రమే గ్రామ పంచాయతీ ఆస్థలాన్ని స్వాధీనంలో ఉంచుకొన్నందున గ్రామపంచాయతీకి  దానిపై యాజమాన్యపు హక్కు రాదు. వేరేవాళ్లకు బధలాయించే హక్కు రాదు.

ప్రస్తుతం అక్కడున్న వాటర్ టాంక్ ను కూలగొట్టినందున, రక్షిత నీటి సరఫరా లేనందున ఆ స్థలాన్ని తిరిగి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి స్థానిక గ్రామ పంచాయతీ వారు అప్పగించవలసి ఉంది.

ఇది ఇలావుంటే ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి ఈశాన్య దిక్కున ఉన్న 205/1 సర్వే నం కు చెందిన 0.3 కుంటల స్థలం 0.8 కుంటాలుగా మారడంతో అక్కడ పక్కా భవనాలు వెలిశాయి. తూర్పు ఆగ్నేయ భాగాన పట్టేదారు వారసులు వేసిన గుడిసెలు నేడు పక్కా భవనాలైనవి. మరి ఇవన్నీ పరిష్కారం అయ్యే దెన్నడో...... చూద్దాము.


పైన వున్నమూడు ఫోటోలు పట్టేదారు వారసులవి.  
క్రింద వున్న ఫోటో ఆ స్థలానికి ఈశాన్యం మూలాన వున్న ఆక్రమిత నిర్మాణాలను చూడవచ్చు.
వివిధ సందర్భాలలో పత్రికలలో వచ్చిన వార్తా క్లిప్పింగులను చూడవచ్చు.

జిల్లా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన నిధులతో స్థానిక గ్రామపంచాయతీ శానిటరీ సిబ్బందికి నిర్మించిన గృహాలు. 

FIRST PUBLISHED ON DT: 12.02.2021.ON FACE BOOK WITH PHOTOS.
AUTHOR. PENDYALA VASUDEVA RAO. PRESIDENT  CRB, NELAKONDAPALLY.

----పెండ్యాల వాసుదేవరావు 

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Billion reasons why the India-Israel partnership is hitting new highs.

#Geopolitics Modi's Diplomatic Dance: Navigating the Geopolitical Tightrope on His Israel Tour IN THE ABOVE PIC INDIAN PM SRI NARENDRA M...