G-1M93C8YK91 LIBERTY.: 2024

Monday, July 22, 2024

SOCIAL. అంబానీ ఇంట్లో పెళ్లి.. నీకూ, నాకూ ఎందుకీ లొల్లి...

84. (SOCIAL...56)


ఈ మధ్యన సోషల్ మీడియాలో "ప్రేమ్  టాక్స్" వీడియో  చూశా. వెంటవెంటనే మరెన్నో వీడియోలు చూసే భాగ్యం కలిగింది. వాటి  సారాంశం చూశాక నా అభిప్రాయం చెప్పాలనిపించింది.

ఈ మధ్యనే అంబానీ ఇంట్లో ఆయన కొడుకు పెండ్లి జరిగింది. తనకు కావలసిన వారిని తాను పిలుచుకున్నాడు. వచ్చినవారికి తనకు నచ్చిన రీతిలో బహుమతులు ఇచ్చి సత్కరించుకున్నాడు. ప్రపంచస్థాయి కళాకారులను, నిష్ణాతులను  పిల్చి అధ్భుత కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారిస్థాయిలో  వారికి పారితోషికాల ఇచ్చాడు. తాను కస్టపడి, తన తెలివి తేటలతో, శక్తి యుక్తులతో శ్రమను ధారపోసి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకొని సంపాదించుకున్న సంపాదనలోంచి తాను ఖర్చు పెట్టాలనుకున్నంత కొడుకు వివాహానికి ఖర్చు పెట్టుకున్నాడు.  

ఆయన ప్రాధమిక హక్కులలో మన జోక్యం ఏమిటి?. ఆయన తన కుమారుని పెళ్ళిలో తాను ఖర్చుచేసిన విధానంపై మనకు అభ్యంతరం ఏమిటి?. ఈ విరుచుకుపడటాలు, అక్కసు వెళ్ళ  గక్కటం ఏంటీ?

నాకు చాలా విచిత్రం అనిపించింది.  

తన తండ్రి "బ్రిటిష్ షెల్" అనే ఇంధన కంపెనీలో 300 రూ.ల జీతంతో పనిచేసిన సాధారణ వ్యక్తి. చాలా క్రిందిస్థాయి నుండి పైకెదిగి తన వ్యాపారసామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఆయన మరణానంతరం ఆ వ్యాపారసామ్రాజ్యంలో వారసత్వంగా తనకు వచ్చిన వాటా దిన,దిన ప్రవర్ధమానం చెందుతూ ఆసియా ఖండంలోనే కుబేరుడుగా స్థానం సంపాదించాడు. ప్రపంచ స్థాయి కుబేరులలో ఒకరుగా నిలిచాడు. అతని ఇంట్లో ఇది ఆఖరు పెండ్లి. ఎవ్వరి ఇంట్లో ఎవ్వరు  ఖర్చుపెట్టకుండా వుంటారు. మనకంటే ముందు తరాల వాళ్ళు ఆర్ధిక స్థోమత లేకున్నా వున్న ఆస్తులన్నీ అమ్మి లేదా అప్పులు చేసి ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేసి అప్పుల పాలై, క్రుంగి కృశించి పోవటం మనకు తెలీదా? హిందూ వ్యవస్థలో పెళ్ళిళ్ళు అలానే వుంటాయి. అప్పులపాలై ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేసే మామూలు సగటు మనిషితో పోలిస్తే ఇదేమి పెద్దవిషయం కాదు. ఆయన చేసిన ఖర్చులకు మీ అనుమతి కావాలా? లేనోడే అప్పులు చేసి ఎంతో గ్రాండుగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. కొన్ని కోట్ల మందికి తన వ్యాపార సామ్రాజ్యం ద్వారా ఉపాధి కల్పించి కంపెనీలు పెట్టి సంపాదించుకొని వాళ్లకుటుంబంలో ఒక వివాహాన్ని అంగరంగ వైభవంగా చేసుకుంటే మనం అతనిమీద పది ఏడవటం ఎందుకు?

తన సొమ్మును తాను ఖర్చు పెట్టాడు. ఎవ్వరినీ మోసం చేయలేదే! అష్ట ఐశ్వర్యాలు వాళ్ళ సొంతం. రేపు మీ పాపకు గానీ, బాబుకు గానీ పెళ్లి, పేరంటాలకు మీరు ఖర్చుపెట్టరా? మీ స్తోమతకు తగ్గట్లు కొత్త బట్టలు కొని కట్టుకోరా? మీ ఆడవాళ్ళు నగలు పెట్టుకోరా? 

బీదవారు వేలరూపాయల్లో, మధ్యతరగతివారు లక్షలరూపాయాల్లో, ధనవంతులు కోట్లరూపాయల్లో  మరియు అంబానీలాంటి వాళ్ళు తమడబ్బు ఎంతైనా ఖర్చుచేస్తారు. ఎంత చెట్టుకుకు అంత గాలి. మన స్థాయికి మనం ఎలా చేస్తామో వాళ్ళ స్థాయికి వాళ్ళు అలా చేస్తారు.

వాళ్ళ స్థోమతుకు తగ్గట్లు వాళ్ళు ఖర్చుచేసుకున్నారు. వాళ్ళ స్తోమతకు తగ్గట్లు వాళ్ళు, వాళ్ళ సంతోషాలు తీర్చుకుంటారు. తప్పులేదు. తప్పని చెప్పే హక్కు మనకు లేదు. ఆ ఖర్చు అంతా వేస్టు అనటంలో అర్ధంలేదు. ఈ వివాహ సందర్భంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల కుటుంబాలు జీవితాలు బాగుపడ్డాయి. కోడలు చీర ఖరీదు, పెళ్లి కొడుకు కట్టుకున్న షార్వాణీ ఖరీదు 1600 కోట్ల రూపాయాలట,  బంగారు, వజ్ర వైడూర్యాలతో పొదిగిన నగలు వేసుకున్నారట. ప్యాంటుకు ఎంత అయింది, శుభలేఖకు ఎంత అయింది, డెకరేషన్ కు ఎంత అయింది, మెటీరియల్స్ కు అంత ఖర్చా...ఇదంతా వేస్ట్ అంటారు. ఈ ఖర్చు చేసే బదులు ఈ సొమ్మంతా జనాలకు పంచిపెట్టాలంటారు.  

Why waste? It's their money, they will spend the way they want. we all want to enjoy our life with what we earn, they are celebrating their life as per their wish, who are we to sit and talk shit about them.

అంతే కాకుండా పెళ్ళికి ఖర్చుచేసిన సొమ్ములో ఎక్కువశాతం ఎంతోమందికి సంపాదనగా మారింది. ఎంత ఎక్కువ ఖర్చుపెడితే అంత ఎక్కువ మందికి సొమ్ము చేరుతుంది. ప్రతి ఖర్చుకు జీ.ఎస్.టీ  ద్వారా ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. ఈ ఖర్చు అంతా స్వదేశంలోనే జరగటం వల్ల ఈ డబ్బంతా మన దేశంలోనే వుంటుంది. అంబానీ ఈ రకంగా ఖర్చు చేయటం, వారి స్థాయిలో ఎంజాయ్ చేయటం దేశద్రోహం కాదు. ఒక తండ్రి తన కొడుపై చూపించిన ప్రేమ అది. నీ విమర్శ  అతనీపై నీకున్న కసిని తెలుపుతుంది. 

మనం మన సొమ్ములో ఒక్క రూపాయి అయినా మనం ఎవ్వరికైనా ఇస్తున్నామా? ఇస్తామా? ఈ పెళ్లి  సమయంలో అంబానీ 50 మంది బీదవారికి వివాహాలు జరిపించాడు. 50 రోజులు రోజుకు 9000 మందికి అన్నదానం చేశాడు. వాళ్ళ ఇంటిపెళ్లి ఎన్ని వేలమందికి పనికల్పించిందో తెలుసా?తిండి పెట్టిందో తెలుసా? మేరేజ్ ఎవెంట్స్ పై ఆధారపడి బతికే వేలమందికీ ఈ వివాహం ద్వారా ఉపాధి లభించింది. సూక్ష్మంగా చెప్పాలంటే సామాన్యులలో పూలు అమ్మేవారికీ.. ఆకులు ఎత్తే వారి వరకూ ఎందరెందరికో ఉపాధి.

అస్సలు ఆయన ఆస్థి ఎంతో తెలుసా? 4.30 లక్షల కోట్ల రూపాయల ఆస్థులకు అధిపతులు. ఆయన తన ఇంట్లో ఆఖరుపెండ్లికి కొడుకు కోసం పెట్టిన ఖర్చు 0.5% అతని ఆస్తిలో.  వున్నవాడు వున్నట్లు వాళ్ళ స్టేటస్ కు తగ్గట్లు చేయడంలో తప్పేమీ లేధు. జయలలిత పెంపుడు కొడుకు పెళ్లి, గాలి జనార్ధన్ రెడ్డి ఇంట్లో చేసిన పెండ్లి, బీ. జె. పీ జాతీయ నాయకుడు రాజ్ నాథ్ సింగ్ ఇంట్లో జరిగిన పెండ్లి  మరియు ఈ మధ్యనే మా ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో జరిగిన  ఆయన కుమార్తె పెండ్లి వారివారి స్టేటస్ లకు తగ్గట్లు జరిగాయి. చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి.

మీరు ఒక విషయాన్ని గమనించటం లేదు. 

అంబానీగారు తన ఇంట్లో వివాహానికి ప్రపంచ వ్యాప్తంగా తనకు సంబంధించిన వ్యక్తులను. రాజకీయ, వ్యాపార దిగ్గజాలను  మరియు  సెలబ్రిటీలను ఆహ్వానించటం ద్వారా మన సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలకు చూపటమే కాకుండా భారతీయ వివాహ బంధాన్ని  అధ్భుతంగా వారు చూపెట్టారు. వీణానాదం, కూచిపూడి, భారతనాట్యం నృత్య ప్రదర్శనలతో  మన కళారంగాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించారు. ఒక భారతీయుడుగా భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్ళే అధ్భుత కార్యక్రమాన్ని తమ ఇంటిలో చివరి వివాహావేదిక ద్వారా తెలియజేయటం గొప్ప విషయం. జరిగిన వివాహం హిందూ సాంప్రదాయంలో వైభవంగా జరిగినది. ప్రతి ఒక్క అతిధిని గౌరవించే విధానం భారతీయ అతిధి మర్యాదనలను ప్రపంచదేశాలకు తెలియచేసింది. 

అంబానీ చేసిన పొరపాటు ఏమిటంటే .. తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నట్లు ...

ఆయన ఇంట్లో పెళ్లి ముందర జియో రీఛార్జ్ ధరలు పెంచకుండా వుండవలసినది. ఆ ఛార్జీలు ఏవో పెళ్లి తరువాత పెంచితే "జియో" వినియోగదారుల్లో ఇంత ఆగ్రహం, ఆక్రోశం లేకుండా వుండేది. 

అయినా జియో నెట్వర్క్ మాత్రమే వాడాలని నిర్బంధం ఏమైనా వుందా? లేదుకదా! ధరలు పెరిగాయి, పెంచారు అనుకుంటే వేరే నెట్వర్క్ లోకి మారే స్వేచ్చ మనకు వుందికదా. ఎయిర్టెల్, ఐడియా కూడా పెంచాయి కదా, వాటిపై వ్యతిరేకత ఎందుకు లేదు? అంబానీ నెట్ ను  సామాన్యుల చెంతకు చేర్చాడు.ఉచితంగా కొంతకాలం ఇచ్చాడు.మొబైలు ఫోన్ ను ప్రతి పల్లెకు చేరేటట్లు శ్రమించాడు. 2G  నుండి 4G మరియు 5G కు సాంకేతికతను పెంచి జనాలకు సేవలందించాడు. 

అంబానీ సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతో కొడుకు పెండ్లి చేస్తే వీడికేం పుట్టింది.. డబ్బు వుందిగా ఖర్చు పెట్టుకోలేడా .. పొయెప్పుడు కట్టుకుపోతాడా .. కొడుక్కు వివాహానికి  ఘనంగా ఖర్చు చేయకూడదా ....అని మనమే అంటాం. 

అందుకే .. నెగిటివ్ ఆలోచనలు మానండి.

అనంత అంబానీ, రాధికా దంపతులను ఆశీర్వదించండి. విమర్శలు మానండి. 

                                                                -------    పెండ్యాల వాసుదేవ రావు .

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

<script async src="https://fundingchoicesmessages.google.com/i/pub-1447880810215412?ers=1" nonce="BDKM9oEoU_MCwJ721WC3Lg"></script><script nonce="BDKM9oEoU_MCwJ721WC3Lg">(function() {function signalGooglefcPresent() {if (!window.frames['googlefcPresent']) {if (document.body) {const iframe = document.createElement('iframe'); iframe.style = 'width: 0; height: 0; border: none; z-index: -1000; left: -1000px; top: -1000px;'; iframe.style.display = 'none'; iframe.name = 'googlefcPresent'; document.body.appendChild(iframe);} else {setTimeout(signalGooglefcPresent, 0);}}}signalGooglefcPresent();})();</script>

Friday, June 14, 2024

ప్రభుత్వాలు మారినా..విధానాలు మారవా?



 83. NKP.. (17).

ప్రభుత్వాలు మారినా విధానాలు మారవా?



ప్రజల/ప్రయాణీకుల  తలరాత మారదా?

నేలకొండపల్లి మండల బస్సు ప్రయాణీకుల బాధలు ఎవ్వరికీ పట్టవా?


ఆర్.టీ.సీ బస్సు స్టాండ్ ను నేలకొండపల్లి గ్రామంలో 1990 ఏప్రిల్ నెలలో అప్పటి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ జీ.వీ.సుధాకరరావు ప్రారంభించారు. 


అప్పటి సర్పంచ్, స్వాతంత్ర సమర యోధులు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు.


ఈ బస్సు స్టాండ్ ఆనాడు, ఈనాడు పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో వున్న ఏకైక బస్సు స్టాండ్. రెండెకరాల సువిశాల విస్తీర్ణంలో వుంది. ఆ స్థలానికి రక్షణ లేకుండా పోతోంది. విలువ కోట్ల రూపాయల్లో వుంది.


నియోజకవర్గంలో వున్న ఏకైక బస్సు స్టాండ్ ను కూడా సంరక్షించ లేరా?

వినియోగంలోకి తేలేరా?


11 సంవత్సరాలనుండి నేలకొండపల్లి మండల ప్రజలు బస్సుల నిరీక్షనకై రోడ్డుమీద ఎండకు, వానకు నిలబడి నానా యాతన పడుతున్నారు. స్త్రీలకు వాష్ రూం సౌకర్యం వద్దా?

ముసలివారు, గర్భిణీలు, పసిపిల్లలు ప్రభుత్వాల తిట్టుకుంటూ తమ దురదృష్టానికి వాపోతున్నారు. విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. వికలాంగుల పరిస్థితి సరేసరి. 


ప్రయాణీకుల అసౌకర్యాల తొలగిపుకై చర్యలు తీసుకోవాలని స్థానిక శాసన సభ్యులు మరియు రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి గారికి విజ్ఞప్తి.


ఒక ప్రజా ప్రతినిధి (MLA) ఏలుబడి  కాలంలో 2013 లో పక్కా బిల్డింగ్ తో సహా మొత్తం బస్సు స్టాండును  పది సంవత్సరాలకు లీజుకు ఇచ్చారు. లీజు పూర్తి కాగానే తమ కట్టడాల తీసేసి ఓపెన్ స్థలాన్ని ఆర్.టీ.సీ కి అప్పగించాలి అనేది ఇరుపక్షాల మధ్యన అగ్రిమెంట్.


బస్సుస్టాండును లీజుకు ఇవ్వటాన్ని  వ్యతిరేకించి, అధికారులపై ప్రయాణీకులు తిరగబడితే లీజును కేన్సిల్ చేస్తూ ఆర్.టీ.సీ అధికారులు ఇచ్చిన నోటీసు పై లీజుకు తీసుకున్న వ్యక్తి కోర్టును ఆశ్రయించి ఆర్.టీ.సీ అధికారులు తన జోలికి రాకుండా స్టే తీసుకోవటం జరిగింది. అతను వేసిన దావా ముగిసేదాకా ఈ స్టే అమలులో వుంటుంది.


తరువాత కోర్టు వెలుపల వాది, ప్రతివాదులు రాజీ చేసుకున్నారు. ఆ విషయం కోర్టు వారికి తెలియకుండా మరో agreement ను కుదుర్చుకున్నారు. ఇదీ తప్పిదమే. న్యాయ సూత్రాలకు విరుద్ధం.


లీజుకు ఇచ్చిన స్థల విస్తీర్ణాన్ని కుదించి బిల్డింగ్ ను లీజు నుండి తప్పించారు. అయినా ప్రయాణీకుల కష్టాలు తీరలేదు. బస్సులు బస్సు స్టాండ్ ముఖమైనా చూడలేదు.


కోర్టు వారి ఆదేశాన్ని శిరసావహించి దావా వేసిన వాది ట్రైల్ కు  (సాక్ష్యాలతో విచారణకు) రాకపోవటంతో దావా డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అయింది.


లీజు పూర్తి అయి, చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం అక్కడ వున్న నిర్మాణాలను dismaantle చేసి ఓపెన్ ప్లేస్ ను ఆర్ టీ.సీ కు అప్పజెప్పాల్సి రావటంతో దావాను తిరిగి పునరుద్ధరించాలని వాది(లీజుకు తీసుకున్న వ్యక్తి) కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు.


దావా పునరుద్ధరణ జరిగితే ఇంజక్షన్ ద్వారా ఆర్.టీ.సీ వారిని అడ్డుకోవచ్చని, దాన్నొక ఆయుధంగా వాడుకోవచ్చని లేజుదారు ఆలోచనగా కనిపిస్తోంది.


అగ్రిమెంట్ ప్రకారం చర్యలు  తీసుకునే వ్యవహారంలో భాగంగా ఓపెన్ ప్లేస్ అప్ప జెప్పటానికి  చర్యలు తీసుకుని, మళ్ళీ లీజుకు ఇచ్చే చర్యలు మానుకోవాలని ప్రయాణీకుల డిమాండ్.


దావా purpose తీరిపోయినా చేసిన వాది దావాను పునరుద్ధరించే  ప్రయత్నాలను ఆర్.టీ.సీ అధికారులు వ్యతిరేకించలేదు. కోర్టు వారికి సమాధానం సమర్పించ లేదు. 


లీజు కాలం అయి పోయినా చర్య తీసుకోక పోగా, మరో సంవత్సరం లీజును రహస్యంగా పొడిగించారు.

 

ఆర్.టీ. ఐ ద్వారా పై పొడిగింపు పత్రాన్ని అడిగినా సంవత్సరము అయినా ఆర్.టీ.సీ వారు దరఖాస్తు దారునికి ఇవ్వకుండా రహస్యంగా వుంచటంలో ఆంతర్యం అర్ధము కాలేదు.


వాది మరియు ప్రతివాది చర్య వల్ల దావా పునరుద్ధరణ జరిగితే ఇంజక్షన్ ఆర్డర్ పునరుద్దరణ జరిగి మళ్ళీ ప్రయాణీకులు ఇబ్బందులు పడతారు. ఆర్.టీ.సీ అధికారులు ఆ కారణాన్ని చూపి వాదికి తోడ్పడే అవకాశం వుంది.


ఈ స్థితిలో స్థానిక బస్సు ప్రయాణీకుడు శ్రీ కే.రవికుమార్ న్యాయవాది శ్రీ పెండ్యాల వాసుదేవరావు ద్వారా ఆ దావాలో తాను ఇంప్లీడ్ కావాలని గౌరవ నీయ కోర్టులో దరఖాస్తు దాఖలు చేసి వాస్తవ విషయాలను కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 


అందువల్ల సంవత్సర కాలంగా లీజుదారుకు స్టే లేదు. ఆర్.టీ.సీ వారు ప్రయాణీకులకు అనుకూలం గా చర్య తీసుకునే అవకాశం లభించింది. కానీ వారు ఏ చర్యా తీసుకోక పోగా ప్రయాణీకుల సౌకర్యాలను నేల రాస్తున్నారు. ఏవో ప్రయోజనాలను ఆశిస్తున్నట్లు వుంది. 


కోర్టులో వేసిన ఏ దరఖాస్తుకు సమాధానాన్ని ఆర్టీసీ వారు ఇవ్వకపోవడం వారి బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోంది.


నేలకొండపల్లి మండలంలో బస్టాండ్ మరలా లీజ్ ప్రకటన వలన ఆందోళనలో మండల ప్రజానీకం వున్నారు.


లీజ్ పూర్తి అవగానే బస్టాండ్ వినియోగం లోకి వస్తుంది అని అందరు ఆశ పడ్డారు....
ప్రభుత్వాధి నేతలు స్పందిస్తారని ఆశ.


----పెండ్యాల వాసుదేవ రావు.


<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


<script async src="https://fundingchoicesmessages.google.com/i/pub-1447880810215412?ers=1" nonce="BDKM9oEoU_MCwJ721WC3Lg"></script><script nonce="BDKM9oEoU_MCwJ721WC3Lg">(function() {function signalGooglefcPresent() {if (!window.frames['googlefcPresent']) {if (document.body) {const iframe = document.createElement('iframe'); iframe.style = 'width: 0; height: 0; border: none; z-index: -1000; left: -1000px; top: -1000px;'; iframe.style.display = 'none'; iframe.name = 'googlefcPresent'; document.body.appendChild(iframe);} else {setTimeout(signalGooglefcPresent, 0);}}}signalGooglefcPresent();})();</script>



Tuesday, April 9, 2024

ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?


  82. (SOCIAL.55).

ఖమ్మంకు  ఆత్మాభిమానం  లేదనుకున్నారా?


లోకసభ ఎన్నికల బరిలో
ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి.

ఏవేవో కులాల కొట్లాటలు కనిపిస్తున్నాయి. 


ఖమ్మం ఎన్నికల సమరాంగణములో

ఏవేవో రాజకీయ మంత్రాంగాలు నడుస్తున్నాయి.


ఖమ్మం ఆత్మాభిమానం ఎవ్వరికీ అక్కరలేదా ?.

ఆత్మాభిమానం మంటగలుస్తున్నా .

పౌరుషం ఆనవాళ్లు కనిపిస్తలే.


ఖమ్మం ఉద్యమాల గుమ్మం.

తెలుసా ఈ తరానికి?

చరిత్ర ఎవ్వరైనా చెప్పారా?


నాకు తెలిసి,

ఉద్యమాలలో 

కీలక స్థానాల్లోవుండి 

త్యాగాలు చేసిన వారికో, 

వారి కుటుంబ సభ్యులకో... 

పార్టీ లోనో, ప్రభుత్వ, రాజ్యాంగ స్థానాలలోనో 

ఉద్యమకారులకు, వాటి బాధితులకు

అవకాశాలు ఇచ్చిన దాఖలాలు లేవు.

వాళ్ళ బలిదానాలతో, ఆత్మార్పణతో ఏర్పడ్డ రాష్ట్రంలో

మాది ఫక్తు రాజకీయ పార్టీ, ఇక్కడ మాకు

అధికారంలోకి రావటమే మాలక్ష్యం

ఉద్యమకారులతో, ఉద్యమంతో మాకు సంబంధం లేదు

అని ప్రకటించడానికి ఉద్యమనాయకులకు న్యాయమా?

అలా అన్నందుకు సిగ్గుపడాలి కదా!


నైజాంపై పోరాటం సమయంలో,

1968 తెలంగాణా ఉద్యమ సమయంలో,

2000 సం.లో తర్వాత

ప్రత్యేక తెలంగాణ పోరాటం సమయం ఉద్యమకారుల చూశాను.

త్యాగాలు చేసిన వారికి ఎవ్వరికీ గుర్తింపులు లేవ్.


బ్రిటిష్ ఇండియా స్వాతంత్ర చరిత్ర చూసినా అదే జరిగింది.

అక్కడ ఒకే కుటుంబం అందల మెక్కింది. 

దేశాని శాసిస్తోంది.

మిగతా అందరినీ చరిత్ర పుటల్లోకి నెట్టేశారు.

వారందరినీ అనాధల్లా మార్చేశారు.


1969 లో ఉద్యమాన్ని రగిల్చిన

చెన్నారెడ్డి సొంత అవుసరాలు తీర్చేసు కున్నాడు, 

2014 లో కల్వకుంట్ల కుటుంబం రాజకీయ లబ్ధి పొందింది. 

త్యాగాలు పునాదులపై 


సరే, 


రాష్ట్రంలో రాజకీయంగా పెద్దన్న పాత్ర పోషించిన

ఖమ్మంలో

1952 నుండి ఇప్పటివరకు ఇద్దరే ఖమ్మం స్థానికులు

లోకసభ అభ్యర్థులుగా గెలిచారు.

ఒకరు తమ్మినేని వీరభద్రం, రెండు పొంగులేటి శ్రీనివాస రెడ్డి.

ఎందుకని..?


లోకసభా బరిలో ఎక్కువగా

వలసవాదులే అందాల మెక్కారు.

ఎందుకని?

ఇప్పుడైనా ఖమ్మం స్థానికులు కరువయ్యారా?

దొరకలేదా?

రాజకీయ పార్టీలు ఇంకా డబ్బులకే అమ్ముడు పోవాలా?


అసలు నాయకుల నోట ఓ డైలాగ్

ఈ మధ్యన వైరల్ అవుతోంది 


అది "ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోట" అని.


అవునా ఎప్పుడైందీ?


ఏ చారిత్రక పరిస్థితుల్లో అయింది?

కమ్మ్యూనిస్టుల ఖిల్లా కాంగ్రెసు అడ్డాగా ఎలా మారింది?

చరిత్ర తెలుసా?

చెప్పే వాళ్ళున్నారా?


ఏ పార్టీకి నిజాయితీల్లో మినహాయింపులు లేవు.

అభ్యర్థుల నిర్ణయాల్లో సహేతుకత లేదు.

ఎవ్వరి స్వార్ధం వారిదే.


కాంగ్రెసులో 45 సం.లుగా

పార్టీ మారకుండా,

సొంత వ్యాపారాలు, ఉద్యోగాలు చేయకుండా ,

ఆరోపణలు లేకుండా

పార్టీ కోసమే వున్న కార్యకర్తలు ఖమ్మంలో కోకొల్లలు.


వాళ్ళ త్యాగాలు లేకుంటేనే పార్టీ బతికిందా?

వేరే పార్టీ జిల్లా అధ్యక్షులుగా వున్న వ్యక్తులకు,

పార్టీ సభ్యత్వం తీసుకోకున్నా

ఖమ్మం నడి బొడ్డున

లోగడ ఏం.ఎల్.ఏ టిక్కెట్టు ఇచ్చి

కార్యకర్తల అవమానించారు.


మీరేం గౌరవం దక్కించినట్లు వారికి?

ఏమి సందేశం ఇస్తున్నట్లు?


పదవులు ఎలాగో ఇవ్వకున్నా ,

గౌరవాలు అన్నా దక్కాలి కదా?

ఎప్పుడో ఒకప్పుడైనా పదవులతో సత్కరించాలి కదా?

సాంప్రదాయ ఓటు బాంక్ అంటే అంత నిర్లక్ష్యమా?


ఖమ్మానికి ఆత్మాభిమానం లేదనుకున్నారా?

మీ భరతం పట్టరనుకుంటున్నారా?

నిత్యం కట్టుబానిసలనుకుంటున్నారా?


నిఖార్స్  అయిన కార్యకర్తను గుర్తించండి

లోకసభా అభ్యర్ధిగా నిర్ణయించండి.


కళ్ళు  తెరవండి.

నిజాన్ని గ్రహించండి


........మీ పెండ్యాల వాసుదేవ రావు


<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Billion reasons why the India-Israel partnership is hitting new highs.

#Geopolitics Modi's Diplomatic Dance: Navigating the Geopolitical Tightrope on His Israel Tour IN THE ABOVE PIC INDIAN PM SRI NARENDRA M...