G-1M93C8YK91 LIBERTY.: 2022

Thursday, March 17, 2022

ఏంది సామీ!


70. (NKP..13). 

ఏంది సామీ?





ఏంది సామీ యిది ?        గీ చిచ్చు ఏంది?

సన్యాసివి కదా....జర సైలెంటుగా వుండరాదురి.
తరం మారే.  విలువలు మారిపాయే.

రామున్ని నిందించిండని, రామాయణాన్ని కించపరిచిండని కత్తి మహేష్ ని నగర బహిష్కరణ చేసినరు గందా. 

మన సమ్మక్క, సారలమ్మ వనదేవతలని , గ్రామదేవతలని అది ఇది అని అవమానించినోన్ని ఏమి చెయ్యాలే అని గొంతెత్తి అడుగుతున్నరండీ.  పడేండ్ల సంది గిట్లనె  మాట్లాడుతున్న రాంట . పాత వీడియో  చూపిస్తున్నారు. 


శివయ్య, పార్వతీదేవి  గురించి గట్లనే మాట్లాడితివి. పార్వతీ దేవి గురించి వెకిలిగా మాట్లాడితివి. 


దేవుడంటే కేవలం వైష్ణవం అని విషపు భావజాలం ప్రజల్లో నింపేటోన్ని నెత్తికెక్కిచ్చుకునుడు అవసరమా. సమతా మూర్తి విగ్రహాన్ని వేలకోట్లు ఖర్చు చేసి పెట్టినా  దేవుళ్లను సమానంగా చూడలేనోనివి ఇంక మనుషులనేం చూస్తవ్..?

పూర్వం సనాతన హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్లలో  శైవులు( శివ భక్తులు) ,వైష్ణవులు( విష్ణువు భక్తులు) అంటూ వర్గాలుగా విభజింపడ్డారు.. వీళ్లకు అస్సలు పడేది కాదు..మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని పోట్లాడుకునేవారు..

చిన్న జీయర్ వైష్ణవుడు..కాబట్టి ఈయన దృష్టిలో దేవుడు అంటే కేవలం విష్ణువు (అవతార రూపాలు).. ప్రజలను అందరిని వైష్ణవం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు..అందుకే పార్వతి పరమేశ్వరులపై ఇతర దేవుళ్ళపై విషం చిమ్ముతున్నాడు..

రామానుజులు గొప్పవాడంటే చిక్కు లేదు. ఆదిశంకరుల చిన్నబుచ్చుడు మేధావిగా  గొప్పవాడవ ని పేరు వస్తదని ఆశా సామీ..

మా తెలంగాణ తాత (ముఖ్యమంత్రి గారు) నీ మాయలో పడిపాయే. 


పుణ్యానికి వందలకొద్దీ భూములు, గుట్టలు ఇచ్చి నీకఇక్కడ పీట వేసి ఆశ్రమం ఏర్పాటు చేసే. యాదాద్రి పర్యవేక్షణ బాధ్యత అప్పగించే. అన్నీ వేల కోట్లే నాయే.  

ఇప్పుడు జీయర్ సామి  తెలంగాణ కల్చర్ నే అవమానిస్తుంటే చర్యలు తీసుకోరా?
మేక మాంసం, పంది మాంసం తినే వాళ్ళను ఏమెమో ఆంటివీ, నచ్చ చెప్పుడు లేకపోగా అవమానిస్తివి .

మా తెలంగాణ తాత నీ మాయలో పడి పాయే....
సంప్రదాయాల వలువలు పీకేస్తున్న కళ్ళప్పగించి చూస్తుండి  పాయే. నువ్వాడినది ఆట, పాడింది పాట. 

నరనరాల్లో పెనవేసుకు పోయిన యాదగిరిగుట్ట పేరును చరిత్ర శిధిలాల్లోకి నెట్టేసి, గుట్ట పేరు మార్చి  యాదాద్రిగా మార్చేస్తివ.-----వేల సంవత్సరాల యాదగిరి పేరు కనుమగయ్యే. 

తరతరాల భద్రాచలం రాముడిని రామనారాయణుడుగా మార్చి సీతారామ కళ్యాణంలో ప్రవరలు మారిస్తివి...


జనాలను ఎర్రి వెధవల  చేస్తున్నా అనుకుంటున్నావు  సామీ.. 
నీకిది తగదు. 

నీ పూర్వాశ్రమాన్ని గెలుకు తున్నారు. తగ్గు సామీ. తగ్గు. ఆల్లు తగ్గుతారు. 


మత పెద్ద హుందాతనం కాపాడురీ. 

                                                                               ---------PENDYALA VASUDEVARAO.


<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Sunday, February 27, 2022

ఖమ్మం జిల్లాలోని ఓ ఆర్ . టీ. సీ. బస్సు స్టాండు ....కధా.. మా వ్యధ..

69. (NKP...12). 

ఖమ్మం లో 

ఓ ఆర్ . టీ.  సీ. బస్సు స్టాండు ....కధా.. మా వ్యధ.. 


హలో సార్లూ!

క్రింది మొదటి రెండు ఫోటోలు గుర్తుపడతారా?
ఎక్కడివో చెప్పగలరా?

ఈ మధ్య ఆర్.టీ. సి. పెద్దసారు సజ్జనారు సారూ నెటిజన్లను ఈ ప్రశ్నే అడుగుతే తడుముకోకుండా రాష్ట్రం నలుమూలలా వున్నోల్లంతా " ఖమ్మం బస్సు స్టాండు " అని చె ప్పేసినృ . బావుందని మెచ్చుకున్నరు.

ఏంది మరి? ఏమనుకున్నారు.

రాష్ట్ర రవాణా శాఖా మంత్రి నియోజకవర్గమా? మజాకా?

మా ఖమ్మం బస్సు స్టాండు ఎప్పుడూ అంతేనండి.

మీకో విషయం తెలుసా?


శ్రీ జలగం వెంగళరావు రాష్ట్ర ముఖ్యమంత్రి గా వున్నప్పుడు ఇప్పుడందరికీ తెలిసిన పాత బస్సు స్టాండు ను కట్టించాడు. అంతకు ముందు రైల్వే స్టేషను ప్రక్కన బస్సులు ఆగేవి. అదే బస్సు స్టాండు అప్పుడు. పెరిగే అవుసరాల కొసమని పెద్దది కట్టించినరు.
క్రింద ఫోటోనే ఆ బస్సు స్టాండు.



బస్సు స్టాండు ప్రారంభోత్సవానికి తరువాతి ముఖ్యమంత్రి శ్రీ మర్రిచెన్నారెడ్డి వచ్చింరు{1979 లో అనుకుంటా) . రిబ్బను కత్తిరించే ముందు బస్సు స్టాండును అంతా చూసి, చేతిలో వున్న కర్రను ఊపుతూ "ఖమ్మానికి ఇంత పెద్ద బస్సు స్టాండా?" అన్నాడండి.

నేను ప్రక్కనే వున్నా. ఖమ్మం ఎమ్మెల్యే అనంత రెడ్డి గారి ప్రక్కనే వున్నా. మా నాయనగారితో వెళ్లిన.
ఇంతకూ ఇదంతా ఎందుకంటే...మా ఖమ్మం బస్సు స్టాండు ఎప్పుడూ ప్రత్యేకతని కలిగి ఉంటుందని చెప్పటానికే....

మరి నేలకొండపల్లి బస్సు స్టాండు పాపం ఏంటండీ?



1989 లో శ్రీ జి.వి. సుధాకర రావు జిల్లా in-charge మంత్రి ప్రారంభం చేసినప్పటి నుండి ఈ రోజు వరకూ బస్సులు బస్సు స్టాండు లోకి పోవు. బస్సులకై జనాలంతా రోడ్డు మీదే పడిగాపులు. ముసలోళ్లు, పిల్లలు, పిల్లల తల్లులు, గర్భిణీలు, పేషెంట్లు, వికలాంగులు, విద్యార్థులంతా రోడ్డు మీదే.ఎండకు, వానకు.

ఇదేమి ఖర్మండీ బాబు?


నియోజక వర్గం "OC"(UN reserved) అవుతే బాగని, లోకలోల్లు వుంటే బావుంటదని కృషి చేశామాండి..
సరే. బయటోల్లు వస్తే వచ్చారు. అదృష్టం కొద్దీ మంత్రులయ్యారా... కనీసం మా బస్సు స్టాండు బాధలు నయం చేయలేదు. కన్నెత్తి చూడలా...

ఇక్కడో విశేషం వుందండోయ్!


పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం మీద వున్న ఏకైక బస్సు స్టాండ్ 30 సం. ల. క్రిందటనే కట్టారు. ఇప్పటివరకు ఇంకో చోట ప్రభుత్వం బస్సు స్టాండు కట్టలేదంటే నమ్మండి.

నియోజక వర్గాల పునర్విభజన(డీలిమిటేషను) జిల్లా కమిటీకి నేనే రథ సారధిని లేండి.ఢిల్లీ కూడా వెళ్ళా. కులదీప్ Singh గారితో కూడా కలిసినా. మూడేండ్లు కష్ట పడ్డా దీన్ని "OC" ను చేయటానికి. ఆశించిన ఫలితం దక్కినా నియోజక వర్గం లాభపడిందా? జనాలే చెప్పాలా!

బాధ నయం చేయకపోగా బస్సు స్టాండు బస్సు స్టాండు స్థలంలో కొంత (చాలా) కోత పెట్టి లీజు కిచ్చారు. మూసేశారు.

క్రింద వున్న చిత్రం. నేలకొండపల్లి బస్సు స్టాండ్ లేఔట్ మ్యాప్. ప్రస్తుతం బస్సు స్టాండ్ క్రింద వున్న స్థలము మరియు లీజుకు ఇచ్చిన స్థలముల కొలతలు క్రింది చిత్రంలో చూడవచ్చు.


అయ్యా ఎమ్మెల్యే గారూ, ఎంపీ గారూ, రవాణా మంత్రి గారూ జర ఇటు దృష్టి పెట్టరాదే..... పుణ్య ముంటాది.
బస్సు స్టాండ్ చరిత్ర కాస్త ఇనుకొరి, చెప్తా.

నేలకొండపల్లి మండల కేంద్రంలో వున్న APSRTC బస్సు స్టాండ్ ఆవరణ నిరుపయోగంగా వున్నదని భావించి ఖమ్మం రీజినల్ ఆర్టీసీ విభాగము వారు, ఉపయోగం లోకి తేవటానికి చర్యలు వదిలేసి, తేదీ: 06.05.2013 నుండి తేదీ: 05.05.2023 వరకు ఒక ప్రైవేటు వ్యక్తికి పది సంవత్సరాలకు ఫంక్షన్ హాల్ నడుపటానికి లీజుకు లైసెన్స్ (నెలకు రూ. 5000/- తరువాత దఫా, దఫాలు నిర్దేశిత పెంపుతో) ఇవ్వటం, తరువాత ప్రయాణీకుల విజ్ఞప్తి, నాయకుల జోక్యంతో ఇదివరకు కాంట్రాక్ట్ ఒప్పందం లో వున్న నిబంధనల మేరకు స్థలం వేకెట్ చేయటానికి, లీజు రద్దు notice ను సంబంధిత అధికారులు లీజుకు తీసుకున్న వ్యక్తికి పంపారు. లీజుకు తీసుకున్న లైసెన్స్ దారుడు తాను ఇప్పటికే రూ.50,00,000 లు ఖర్చు చేశానని కోర్టు మెట్లు ఎక్కి, తనకు న్యాయం చేయమనగా మళ్లీ ఇంకొక కొత్త యెగ్రిమెంట్ తో ఒప్పందం చేసుకున్నారు.
దాని తాలూకు బస్సు స్టాండ్ ప్లాన్ పైన ఇవ్వటం జరిగింది. దాని ప్రకారముగా కూడా తేదీ: 05.05.2023 న లీజుకు తీసుకున్న బస్సు స్టాండ్ ప్రాంగణంలోని స్థలాన్ని ఓపెన్ గా (నిర్మాణాలు తీసేసి) అప్పచెప్పాలి. ఎప్పుడైనా బస్సు ప్రయాణీకుల కష్టాలు తొలగుతాయని తలుస్తాము.

సజ్జనారు (TSRTC MD) సారూ!


తెలంగాణా పల్లెలలో చాలాచోట్ల ఇప్పటికీ బస్సు స్టాండులు లేవు. ఎప్పుడో దశాబ్దాల క్రింద మేము కస్టపడి తెచ్చుకున్న బస్సు స్టాండును, పక్కా భవన సముదాయాన్ని రోడ్డు రవాణా సంస్థ చిన్న చూపు చూస్తోంది. మా బస్సు స్టాండ్ లీజు కాన్సెల్ చేసి ప్రయాణీకుల కస్టాలు తీర్చండి మహాప్రభూ !

బస్సు ప్రయాణీకుల అవస్థల గమనిస్తారు అని ఆశ. ప్రజాగ్రహాన్ని గుర్తిస్తారు అని ఆశ.
----పెండ్యాల వాసుదేవరావు.
Vasudeva Rao Pendyala

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Billion reasons why the India-Israel partnership is hitting new highs.

#Geopolitics Modi's Diplomatic Dance: Navigating the Geopolitical Tightrope on His Israel Tour IN THE ABOVE PIC INDIAN PM SRI NARENDRA M...