G-1M93C8YK91 LIBERTY.: April 2018

Saturday, April 28, 2018

ఎక్కడుంది మన చరిత్ర? పరిశోధన తోనే చరిత్ర వెలుగు లోకి రావాలి.


43. (ఖమ్మం చరిత్ర-1) 

ఎక్కడుంది మన చరిత్ర?



ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ చిత్రమిది.దీన్ని చూస్తే ఈ ఈ ప్రాంతాల్లో ఈ స్టేట్ వుందని ఈ తరానికి కుడా తెలుస్తుంది. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వున్న మన ఖమ్మం చరిత్ర 1952 వరకు ఏమిటి? కాంగ్రెస్ మరియు కమ్యునిస్ట్ లు ఎవ్వరు వ్రాయలేదు. కారణం తెలీదు. 1953 నుంచి ఖమ్మం జిల్లా చరిత్ర కుడా ఎవ్వరు వ్రాయలేదు. 

ఆత్మకధలు చరిత్ర దర్పణాలు కాదు.

రష్యా విప్లవం తరువాత బ్రిటిష్ ఇండియా Communist Party సహకారంతో జరిగిన నిజాం వ్యతిరేకపోరాటం గురించి అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమకారులు గొప్పగా చెబుతారు, కాని పోరాటం ముగిసిన రెండు దశాబ్దాల తరువాత గాని పోరాట ముగింపు సమయంలో రాష్ట్ర భాద్యతలలో వున్న శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు దాని గురించి వ్రాయలేదు.అదికూడా పోరాటం నేర్పిన గుణపాటాల గురించే వ్రాసాడు. తనకు సమగ్ర సమాచారం లేదని --తెలుస్తే చెప్పమని ముగించాడు.


తమ స్థానిక పార్టీ తీర్మానానికి భిన్నం గా తాము పోరాటాన్నిఅయిష్టం గా ఎలా కొనసాగిన్చాల్సి వచ్చిందో శ్రీ రావి నారాయణ రెడ్డి చెపారు.


ఏదో చెప్పాలనే తాపత్రయం తో పిడికిలి తెరచిన శ్రీ దేవులపల్లి వెంకటేశ్వర రావు చెప్పాలిసింది పూర్తి చేయకుండానే తన పిడికిలిని తుపాకితో మూసేసి అడవుల్లోకి వెళ్ళిపోయాడు.

1948 ఆఖరులో కొందరు ఉద్యమాన్ని వీడారు అని చెప్పిన శ్రీ పెండ్యాల వరవరరావు కారణాలు విశ్లేషిన్చ లేదు..వాస్తవానికి ఆ సమయంలో బ్రిటిష్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ గందరగోళ పరిస్థితిలో వుంది. అంతర్జాతీయ రాజకీయాల పట్ల కమ్యూనిస్ట్ పార్టీ వైఖరిలో మార్పు దానికి కారణం. శ్రీ P.C.JOSHI కి ఉద్వాసన చెప్పి శ్రీ RANADIVE కు పార్టీ సారధ్య భాధ్యతలు అప్పగించిన ఎఫెక్ట్ నిజాం రాష్ట్ర పార్టీ పై పడింది.


ఇంకా ఎంతో చరిత్ర వుంది. 
అప్పటి తరం ఇప్పుడులేదు. 
విషయాలు చెప్పగలిగే వాళ్ళు తక్కువ.

రెండేళ్ళ క్రింద ఒక ML PARTY కార్యకర్త శ్రీ రేపాల శివలింగం నాకు కలిసాడు. గత ఏడు సంవస్తరాలుగా చరిత్ర పరిశోధనలో వున్నట్లు చెప్పాడు. తాను సేకరించిన విషయాలను ఎవ్వరితోనైనా వ్రాయిస్తానని చెప్పాడు. చరిత్రకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.

చరిత్ర చెప్పటం మరచిన సంఘటనల తాలూకు జ్ఞాపకాలు క్రింది ఫోటో లలో నిక్షిప్త మై ఉన్నవి. అవి జరిగిన ఉద్యమాలకు వాటి నాయకత్వమ్ వహించిన  వ్యక్తులకు సాక్షి . చరిత్ర చెప్పే చిత్రాలు.చరిత్రలో దాగిన చిత్రాలు.
ఫోటో. No.1
.

First Generation Heros of Telangana. 
Palair Patti Pradhamandhra Mahasabha at Nelakonda Pally in the year 1938 organised by Sri Pendyala Satyanarayana Rao. Palair Patti was played a key role in United Warangal dist in Nizam poratam days.

Sarvasri Pendyala Satyanarayana Rao, Ravi Narayana Reddy, Jamalapuram Kesava Rao, Peravelli Venkataramanaiah, T.Hayagreva Chary, Sarvadevabhatla Ramanatham, Kaloji Narayana Rao and Komaragiri Narayana Rao etc leaders seen in the pic No.1.

Villagers Sarvasri Pendyala Seshadri(Advocate), Pendyala Neelakanta Rao, Cheruvu Narayana Rao and Duggirala Sriramaiah also seen in the above pic.

PHOTO.No.2.

HISTORY NEVER IGNORES REAL HEROES.Below are the Andhra Mahasabha leaders as well as Founders of the Communist party of India in Nizam state. Sri Pendyala Satyanarayana RAO who was the first General Secretary of Warangal district Communist party of India (which was the first district committee in the state) and Sri P.V.RAMANAIAH who was the first General Secretary of Nizam state Regional Communist party of India seen in the picture. In sitting row left the first person was Sri Sarvadevabhatla Ramanatham. His name was missed in the printing in the below pic. 


నిజాంపై తిరుగుబాటు యుద్ధంలో ఆంధ్రమహాసభ వేదికగా కాంగ్రెస మరియు కమ్యూనిస్టులు కలిసే పనిచేశారు. పన్నెండవ ఆంధ్రమహాసభతో విడిపోయారు. పూర్తి కమ్యూనిస్టుల వేదికగా పన్నెండవ ఆంధ్రమహాసభ ఖమ్మం ప్రక్కన ఖానపురం హావేలిలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ఆధ్వర్యంలో జరిగింది. ఆ రోజుల్లో ఆ మీటింగ్ కు నలభై వేలమంది ప్రజలు హాజరైనారు.




PHOTO.No.3.
In the memory of Telangana struggle against Nizam.
Palair Patti Chaturdhandhra Maha Sabha at Nelakondapally.
In the pic. Front row in chairs.From left to Right
Sarvasri K.L.Narasimha Rao, Mandava Rathaiah, Pendyala Sugunamma(Child, D/o Satyanarayana Rao, Pendyala SATYANARAYANA Rao, P.Neelakanta Rao & another.

Standing row. Middle. Kanamarlapudi Venkatramaiah, Nunna Rangaiah, P. Sadasiva Rao,Thota Venkataratnam and others.



Photo.No.4.
Gandhi's meeting was held in my ancestral land in Khammam town near Venkatagiri Railway gate 5th  August 1946.

PHOTO.NO.5.
VIRAATRAYA ANDHRA GRANDHALAYAM building at NELAKONDAPALLY which was the centre for state-level activities against NIZAM. It was established in the year 1912 & reorganized by Sri Pendyala Satyanarayana Rao in the year 1934 for a social moment to educate people and fight against NIZAM. Secret meetings held here resulted in the formation of HYDERABAD STATE REGIONAL COMMUNIST PARTY OF INDIA. SRI Pendyala Satyanarayana Rao addressing the gathering in those days in the premises of Viraatrayaandhra Grandhaalayam at Nelakondapally. After the formation of the Telangana regional communist party, Nelakonda pally was the headquarters to the Khammam taluka communist party activities.


-------పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Monday, April 23, 2018

నేలకొండపల్లి లో శ్రీ భక్త రామదాసు స్మారక ఉత్సవాలు ---ప్రారంభ చరిత్ర.

42.(NKP-4). 

శ్రీ భక్త రామదాసు స్మారక ఉత్సవములు నేలకొండపల్లి లో  ప్రారంభ చరిత్ర .

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో 1973 సంవత్సరం డిసెంబర్ 31 వ తేది నుండి 1974 జనవరి 2 వ తేది వరకు శ్రీ భక్త రామదాసు స్మారక ఉత్సవాలు  శ్రీ భక్త రామదాసు మెమోరియల్ సొసైటీని (REGD NO.715/74) ఆధ్వర్యం లో ప్రప్రధమం గా జరిగినవి. 


 శ్రీ భక్త రామదాసు స్మారక సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులుగా శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, ఉపాధ్యక్షుడిగా శ్రీ కంకిపాటి జగన్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి గా శ్రీ పీ.బీ. సోమయాజులు, సహాయ కార్యదర్స్యులుగా పైడిమర్రి కృష్ణశర్మ, శ్రీ కొడవటిగంటి శివరామశర్మ మరియు  కోశాధికారిగా శ్రీ కొత్త యోగానంద రావు వున్నారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో దాదాపు అదే సమయంలో 1973 డిసెంబర్ 27 నుండి 1974 జనవరి 3 వ తేది వరకు వాగ్గేయకారుల ఉత్సవాలు ప్రారంభించారు. వాటికి అయిదు లక్షల రూపాయల మూల నిధిని ఏర్పరిచి ఆర్ధిక వనరులను ఏర్పచింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.

ప్రత్యేకించి శ్రీ భక్త రామదాసు పేరున స్మారకోత్సవములు నేలకొండపల్లిలో  మాత్రమే చరిత్రలో ప్రధమంగా ప్రారంభం అయినవి. ఇక్కడ నిర్వహణకు మాత్రం ప్రభుత్వ నిధులు మాత్రం ఏమీ లేవు. ఆ ధ్యాసే ప్రభుత్వ వర్గాలకు లేదు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలోనూ 1973 డిసెంబర్ 27 నుండి  1974 జనవరి 3 వ తేది వరకు వాగ్గేయకారుల ఉత్సవాలు ప్రారంభించారు. వాటికి అయిదు లక్షల రూపాయల మూల నిధిని ఏర్పరిచి ఆర్ధిక వనరులను ఏర్పచింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.
 శ్రీ భక్త రామదాసు విగ్రహావిష్కరణ.



                  
శ్రీ భక్తరామదాసు స్మారక మందిరంలోని ఏకశిలా తెల్ల రాతి విగ్రహము. ప్రాచిన గ్రందాలలోని చిత్రాల ఆధారంగా ఈ విగ్రహాన్న  రూపొందించారు.  పై ఫోటో లో శ్రీ భక్త రామదాసు విగ్రహం పెట్టినప్పటి చిత్రం. 1977 సం.లో మే 28 తేదిన శ్రీ భక్త రామదాసు ఏకశిలా విగ్రహాన్ని తెనాలి పట్టణం లోని శిల్పులతో చేయించి శ్రీ భక్త రామదాసు మందిరంలో నెలకొలిపారు. సీతా రామ లక్ష్మనుల విగ్రహాలను కుడా తెల్ల రాయి తోనే యించారు.

శ్రీ భద్రాచల సీరామచంద్రస్వామి దేవస్థానానికి  శ్రీ భక్తరామదాసు  స్మారక భవనం అప్పగింత.


శ్రీ భక్త రామదాసు గారు దేశ విఖ్యాత భాక్తాగ్రేస్వరుడు. చరిత్ర ప్రసిద్ది చెందినవాడు కావటం వల్ల ఆయన స్మారకంగా చేసే కార్యక్రమాల నిర్వహణకు ఒక ఆడిటోరియం కూడా అవుసరమున్నది. స్థానికుల ఆర్ధిక యిబ్బందులతో రామదాసుగారి స్మారక  కార్యక్రమాల నిర్వహణ ఆయన ఖ్యాతికి తగ్గట్లు న్యాయం చేయలేమని, ఆయన ఆథ్యాత్మిక భావ ప్రచార వ్యాప్తిని జాతీయ స్థాయిలో చేయవలసిన అవుసరాన్ని గమనించిన పెద్దలు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారు ఈ స్మారక మందిరాన్ని/జన్మస్థల ప్రాంగణాన్ని భద్రాచల శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి అప్పగించుటకు  శ్రీ భద్రాచల సీతారామస్వామి దేవస్థాన కమిటీని సంప్రదించటం జరిగింది.

మే 4 తేది 1983 సంవత్సరంలో జన్మ స్థల ప్రాంగణాన్ని భవన నిర్వహణకు, కార్యక్రమాల నిర్వహణకు  భద్రాచల రామాలయానికి AP STATE ENDODWNMENTS COMMISSIONER LETTER R.C.NO.B3/74179/81, DT: 22.02.1983 and EXECUTIVE OFFICER , SRI SEETHAA RAMASWAAMY DEVASTHANAM, BHADRACHALAM LETTER R.C.NO.C1/2804/81, DT: 15.04.1983 ప్రకారం స్వాధీనం చేయటం జరిగింది. 

భద్రాచల దేవస్థానానికి అప్పచేప్పిన తరువాత 28.03.1984 తేది వరకు మందిర నిర్వహణలో భాగము అయిన సిబ్బంది వేతనాలు, ఎలక్ట్రిసిటీ బిల్ చెల్లింపులు, నిత్య నైవేధ్య దీపారాధనల ఖర్చులే కాక ధనుర్మాసాది ఉత్సవములకు  కూడా వైభవంగా నిర్వహించారు. కాని పైన పేర్కొన్న తేదీ తరువాత మందిరం తీవ్రమైన నిర్లక్ష్యమునకు  గురికావటమే కాకుండా రామదాసు స్మారక కార్యక్రమాల వూసే లేకుండా పోయింది. భక్తిరసం ఉట్టిపడేలా మేళతాళ ధ్వనులతో మర్మోగావలసిన ఈ మందిర ప్రాంతంలో కీచురాళ్ళ ధ్వనులు జనులకు వినిపించింది. మందిరంలో ప్రతిష్టించిన సీతారామచంద్రుల విగ్రహాలు పూజా పునస్కారాలకు నోచుకోక అపరిసుభ్ర వాతావరణంలో వెలతేలా పోయింది. 1989 సంవత్సరము దాక అదే పరిస్థితి వుండేది. దేవస్థాన పాలకమండల్లకు చేసిన విజ్ఞాపనల ఫలితంగా కొంతకాలం ఆతరువాత పూజా ద్రవ్యాలు, తరువాత పూజారి నియామకం జరిగింది. మందిరాన్ని భద్రాచలానికి అప్పగించింది శ్రీ భక్తరామదాసు గారిక స్మారకోస్థవాల కార్యక్రమాలు జాతీయస్థాయిలో చేయటానికి, ఆయన ఆధ్యాత్మిక భావవ్యాప్తిని  విశ్వవ్యాపితం చేయటానికి.

భద్రాచలానికి అప్పగించాక ఆశించినది లభించక పోగా రామదాసు స్మారక మందిరం దయనీయ స్థితిని    క్రింది చిత్రం లో చూడవచ్చు.
 
         

              
        
 శ్రీ భక్త రామదాసు విద్వత్ కళా పీఠం ఆవిర్భావం.      
పై దుస్థితిలో రామదాస స్మారక కార్యక్రమాలను గాలికి వదిలేయలేక ఉడతా భక్తిగా శ్రీ భక్త రామదాసు ఉత్సవాలు జరపాలనే ఉద్దేశ్యాన్ని శ్రీ సత్యనారాయణ రావు గారికి తెలిపి వారి ఆశీస్సులతో 1990 సం.లో శ్రీ భక్త రామదాసు విద్వత్ కళాపీఠంను స్థాపింఛి కార్యక్రమాలు ప్రారంభించారు. దాని Regd No.1829/93 గా నమోదైంది. 1993 సంవత్సరములో రామదాసు స్మారక మందిరంలోని సీతారామచంద్రుల మూల విగ్రహాలకు ఇత్తడి మకరతోరణాన్ని శ్రీమతి పెండ్యాల అన్నపూర్నమ్మ గారు బహుకరణ చేసారు. శ్రీ భక్తరామదాసు విద్వత్కళాపీఠం ప్రధమ అధ్యక్షులుగా శ్రీ రావులపాటి రంగారావు, ప్రధాన కార్యదర్శిగా శ్రీభీకంసింగ్ వున్నారు. వీరితోపాటు సర్వశ్రీ పెండ్యాల రామ్మోహన రావు, గండికోట రాజేశ్వర్ రావు, గండికోట శేషభూషణ రావు కార్య వర్గం సభ్యులుగా వుండేవారు.

శ్రీ భక్త రామదాసు స్మారక మందిరమునకు తురుపు దిక్కున స్థలం కొనుగోలు.
శ్రీభక్త రామదాసు జన్మస్థలములోని భావికి ఉత్తరదిక్కున వున్న ప్రైవేటు స్థలమును 1990 సంవత్సరములో శ్రీభక్తరామదాసు విద్వత్కళాపీఠం పేరున 690.00 చ.గ.కొన్నారు. అందులోని వేపచెట్లు వగైరాల అమ్మకంతో కొనుగోలు సొమ్ము చేకూరింది.

 శ్రీ భక్త రామదాసు స్మారక మందిరంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు.

1993 సం.ములో రామదాసు మందిరంలోని సీతారామచంద్రుల మూలవిగ్రహాలకు ఇత్తడి మకరతోరణాన్ని శ్రీమతి పెండ్యాల అన్నపూర్నమ్మగారు బహుకరణ చేసారు.శ్రీ భక్త రామదాసు స్మారక మందిరమునకు తూరుపు దిక్కున ఆగ్నేయంమూల నుండి రాతి స్థంభం వరకు శ్రీ భక్త రామదాసు స్మారకకమిటీ అధ్యక్షులు శ్రీ పెండ్యాల వాసుదేవరావు సొంత ధనంతో కాంపౌండ్ నిర్మాణం చేశారు. ఆ సమయంలో అక్కడికి అనుకోకుండా వచ్చిన స్థానిక మాజీ MLA , అప్పటి భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ శ్రీ కత్తుల శాంతయ్య నిర్మాణ వివరాలు తెలుసుకొని మా కుటుంబ నేపధ్యం తెలిసిన వారు కాబట్టి "ఇప్పటివరకు మీకుటుంబం పెట్టింది చాలు, నేను భద్రాచలదేవస్థానం నుంచి కొంత ఇస్తాను" అని చెప్పి వారి కమిటి తీర్మానం మేరకు Rs 25,000/-ఇచ్చారు. వెంటనే అప్పటి MLA శ్రీ సండ్ర వెంకటవీరయ్య తన నిధులనుంచి Rs 25,000/-ఇచ్చారు. ఈ విధంగా రామదాసు మందిరం చుట్టూ తూరుపు, దక్షిణ మరియు పడమర దిక్కులలో కాంపౌండ్ నిర్మాణం జరిగింది.

 1999 సంవత్సరంలో శ్రీ భక్త రామదాసు ప్రాజెక్ట్, భద్రాచలం వారి కార్యక్రమం.

శ్రీ భక్తరామదాసుప్రాజెక్ట్, భద్రాచలం వారు 1999 సం.లో అప్పటి ఖమ్మం డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ అప్పారావు, ఖమ్మంజిల్లా కలెక్టర్ శ్రీ N.గిరిధర్ మరియు జిల్లాసూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ పెండ్యాల సీతారామాంజనేయులు తీసుకున్న చొరవతో  శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం Renovation కార్యక్రమాన్ని చేపట్టారు. డంగుసున్నంతో వున్న గోడల plasting ను తీసేసి సిమెంట్ plasting ను చేసారు. సిమెంట్ ఫ్లోరింగ్ ను  తీసేసి Marble  ఫ్లోరింగ్ ను వేసారు. మందిరానికి ENAMIL painting ను వేసారు. జిల్లా ఉద్యానవ శాఖ వాళ్ళు మొక్కలు వేసారు. ప్రక్కనే వున్న విద్వత్కలాపీఠం స్థలాన్ని లెవెల్ చేయించి ఆస్థలంలో వున్న పాటి మన్నును చదును చేసి మందిరం చుట్టూ పోయించటంతో ప్రాగణమంతా ఎత్తు పెరిగింది. విద్వాత్కలా పీఠం స్థలాన్ని రామదాసు మందిర ప్ప్రాంగణంనంలో కలిపేసారు. ఆ స్థలానికి పడమర మరియు ఉత్తర దిక్కున కంపొండ్ నిర్మాణం చేసారు.   

శ్రీ భక్త రామదాసు ప్రాజెక్ట్, భద్రాచలం వారు  శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం పేరును ధ్యానమందిరంగా మార్చారు. అంతకు ముందు స్మారకమందిరం గానే పిలువబడేది. భద్రాచల శ్రీ సీతారామస్వామిదేవస్థానంకు స్వాధీనం చేసేతంతవరకు శ్రీ రామదాసు స్మారకోత్సవాలుగాను తరువాత ఆరాధనోత్సవాలుగానామకరణం చేసి నిర్వహించారు.
శ్రీ భక్త రామదాసు ప్రాజెక్ట్, భద్రాచలం ప్రాజెక్ట్ వారి  కార్యక్రమం తరువాత మందిరం  చిత్రాలు. 

  

శ్రీ భక్త రామదాసు జయంతి కార్యక్రమాల ప్రారంభం: 
2001 సం.లో శ్రీ పెండ్యాల వాసుదేవరావు   శ్రీ భక్త రామదాసు విద్వాత్కళాపీఠం అధ్యక్షులుగా   బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్ట మొదటిసారిగా శ్రీ భక్త రామదాసు జయంతిని 14.02.2002  తేదిన నేలకొండపల్లిలో చేయటం జరిగింది. అప్పటినుడి రెగ్యులర్ గా  జయంతి కార్యక్రమాలు జరుగుతున్నవి. తరువాత భద్రాచలంలో కూడా దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ భక్త రామదాసు జయంతి కార్యక్రమాలు 372  జయంతి నుండే (11-2-2005 -13-2-2005) ప్రారంభం అయినవి. ఆకార్యక్రమాలు భద్రాచలం  కళ్యాణమంటపం వేదికగా జగినవి. అప్పుడు భద్రాచల దేవస్థానం  కార్యనిర్వహణాధికారిగా శ్రీ యం. రఘునాద్ వున్నారు. 

నేలకొండపల్లిలో ప్రధమంగా శ్రీ భక్తరామదాసు జయంతిని జరిపిన సంధర్హంగా చిన్నారి కళాకారులు, వారి గురువు శ్రీ మాధవరావుతో పీఠం ప్రెసిడెంట్ శ్రీ పెండ్యాల వాసుదేవ రావు మరియు పీఠం సెక్రటరీ శ్రీ రాజపుత్ర భీకంసింగ్.



శ్రీ భక్త రామదాసు ప్రాజెక్ట్, భద్రాచలం వారు మందిర పునరుద్ధ్హరణ తరువాత మందిర నిర్వహణలో ఏమాత్రం మార్పు రాలేదు. కార్యక్రమాల నిర్వహణ లోకల్ శ్రీ భక్త రామదాసు విద్వత్ కళాపీఠం మీదనే పడింది. 2001-04 వరకు పీఠం అధ్యక్షులు శ్రీ పెండ్యాల వాసుదేవ రావు స్వంత వనరులతోనే చేయవలసి వచ్చింది. తదుపరి వచ్చిన కార్యవర్గం ఏవో కొద్దిగా వసులుచేసిన చందాలతో కార్యక్రమాలను ప్రతి సంవత్సరం మొక్కుబడిగానే నిర్వహించారు. నియోజకవర్గంలో మొట్ట మొదటి సారిగా సోలార్ లైట్స్ ను  రామదాసు మందిరంలో శ్రీ భక్త రామదాసు మెమోరియల్ కమిటీ చొరవతో చైర్మన్ శ్రీ పెండ్యాల వాసుదేవ రావు పెట్టించటం జరిగింది.

శ్రీ భక్త రామదాసు జన్మస్థలాన్ని భద్రాచల రామాలయానికి అప్పగించేటంత వరకు శ్రీ రామదాసు స్మారకోత్సవాల పేరిట కార్యక్రమాలు జరిగేవి. జన్మస్థల ప్రాంగణాన్ని శ్రీ భక్త రామదాసు స్మారకమందిరం అనేవారు. విద్వాత్కళాపీఠం వారు స్టార్ట్ చేసాక అవి శ్రీ రామదాసు ఆరాధనోత్సవములని పిలవటం ప్రారంభం అయినది. శ్రీ భక్త రామదాసు ప్రాజెక్ట్ వారు భవన పునరుద్దరణ తరువాత జన్మస్థల ప్రాంగణాన్ని శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరమని నామకరణం చేశారు.

తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఉత్సవాల నిర్వహణ ప్రారంభం.

ఈ సందర్భంలో స్మారక మందిరంలో ఇదివరకు వున్న శ్రీ భక్త రామదాసు ఏకశిలా తెల్ల రాతి విగ్రహాన్ని మారుస్తారని విన్న పిదప జనం తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకు క్రింది విధంగా విజ్ఞప్తి చేసియున్నాము. విజ్ఞప్తిని మన్నించి నందులకు  ధన్యవాదాలు.
We will be thankful to Hon'ble CM of Telangana for an announcement of Sri Bhaktha Ramadasu Jayanthi celebrations on behalf of State Govt at Nelakondapally.

Here is Ekasila White Stone Statue of Sri Bhaktha Ramadasu and Seeta Rama, Laxmana & Hanuman White Stone Statues in the Memorial Hall of Sri Bhaktha Ramadasu Birth Place Nelakonda Pally. The Statues were unveiled dt: 28 th May 1977 by the Elders who built the memorial in the year 1955. The Statues were made in Tenali town of Andhra Pradesh.

We bring to the notice of the Hon'ble CM of Telangana not to replace the present Ramadasu Statue with a new one which it will hurt the sentiments of people of this area. Arrange new one in another place.

The Statue was made on the basis of the pic which was in the old Historical Books.
Thank u.





2016 సం.లో తెలంగాణారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న దేవాలయాల పునరుద్ధరణలో భాగంగా వారి దృష్టి శ్రీ భక్త రామదాసు జన్మస్థలం మీద పడటము వారి ఆదేశాలమేరకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ శ్రీ భక్త రామదాసు గారి ఆరాధన మరియు జయంతి ఉత్శావాల నిర్వహణ చేపట్టటం నేలకొండపల్లి మరియు పరిసర గ్రామాల ప్రజల చిరకాల వాంఛ నేరవేరినట్లు అయినది. శ్రీ భక్త రామదాసు గారికి ఇకనైనా న్యాయం జరుగుతున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కలువకుంట్ల  చంద్రశేఖర రావు గారికి అభివందనాలు. 2017 మరియు 2018 సం.లలో రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగినవి. నేలకొండపల్లి పరిసర ప్రాంత ప్రజల కోరిక ఈడేరినట్లు అయినది. సంతోషం.
                                                                      జై శ్రీరామ్.
----పెండ్యాల వాసుదేవ రావు. 

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>
      

శ్రీ భక్త రామదాసు జన్మ స్థలంలో ఆయన స్మారక మందిరం విశేషాలు.

             41. (NKP-3). 

శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం (ప్రస్తుత ద్యానమందిరం) విశేషాలు.
నేలకొండపల్లి గ్రామం ఖమ్మం నుండి 23 కిలోమీటర్ల దూరంలో, కొదాడు నుండి 15 కిలోమీటర్ల      దూరంలోవుంది. శ్రీ భక్త రామదాసు గారి అసలు పేరు కంచర్ల గోపన్న. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలోక్రి.శ. 1632 సం.ప్రాంతంలో శ్రీకంచర్ల లింగన్న, శ్రీమతి కామమ్మ దంపతులకు ఆయన జన్మించారు. ఆయన భార్య పేరు శ్రీమతి కమలమ్మ. 
               
శ్రీ భక్త రామదాసు ప్రముఖ వాగ్గేయ కారుడు. భక్త జయదేవుడు, త్యాగయ్య, అన్నమయ్య, పురందరదాసు, నారాయణ తీర్ధులు, శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్, క్షేత్రయ్య ..ఇలా ఎందరో  కర్నాటక సంగీత జ్యోతిని వెలిగించిన వాగ్గేయకారుల సరసన రామదాసుకు సముచిత స్థానముంది. సాహిత్య పరిశోదనల్లో వెలుగు చుసిన ఆయన 206 కీర్తనలను కాలగర్భంలో కలసిపోకుండా రక్షించుకుంటూ ఆ కీర్తనలకు దేశవ్యాప్త ప్రచారం చేయవలసి వుంది. తిరువయ్యారులో ప్రతి ఏటా జరిగే త్యాగయ్య ఆరాధన ఉత్సవాలలాగా రామదాసు సంస్మరణ ఉత్సవాలలాగ  జరగాలనేది నేలకొండపల్లి వాసుల చిరకాల వాంచ. 

కంచర్ల గోపన్న తన రామదాసుగా మారటం వెనుక ఆయన స్వగ్రామంలో ఆయన కుటుంబం నిర్వహించిన సంతర్పణ సమయంలో ఆయన కుమారుని మరణం ప్రభావితం చేసిందంటారు. భద్రాచలం తహసిల్దారుగా బాధ్యతల స్వీకరించిన తరువాత భద్రాచలం కొండ పైన జీర్ణావస్థలో నున్న రామాలయాన్ని చూసి చలించిన శ్రీ గోపన్న, తనకు శిక్ష పడుతుందని తెలిసి శ్రీ రాముని పై నున్న భక్తితో ప్రభుత్వ నిధులను వెచ్చించి ఆ ఆలయ నిర్మాణాన్ని చేసారు. ఫలితంగా ఆగ్రహించిన తానీషా ప్రభువు 12 సం.లు శిక్ష వేసి చెరసాలకు పంపారు. సాక్షాతు శ్రీ రామచంద్రుడే వచ్చి ఆరు లక్షల వరహాలు తానీషాకు చెల్లించి రామదాసుని విడుదల చేయించాడని ప్రతీతి.

రామాలయ నిర్మాణానికి ఎంత ఖర్చు అయినదో ‘ఇక్ష్వాకుల తిలకా ఇకనైనా బలుకవు రామచంద్రా” అనే రామదాసు కీర్తనలో కనబడుతుంది. ప్రాకారాలకు పది వేల వరహాలు, భరతునికి చేయించిన పచ్చల పతకానికి పది వేల వరహాలు, శత్రజ్ఞ్యుడికి  చేయించిన బంగారు మొలత్రాడుకు పదివేల మొహరీలు, లక్ష్మనుడికి చేయించిన పతకానికి పది వేల వరహాలు, సీతమ్మకు చేయించిన చింతాకు పతకానికి పది వేల వరహాలు...ఇలా ఎన్నెన్నో ఆభరణాలకు ఎంతెంత ఖర్చు అయినదోఆయన ఏకరువు పెట్టాడు. రామదాసు కీర్తనలన్నీ బందిఖానాలోనే ప్రాణం పోసుకున్నాయి.

శ్రీ భక్త రామదాసు జన్మస్థల నిర్ధారణ.
సుమారు 1687 సం.లో చనిపోయే ముందర శ్రీ కంచర్ల గోపన్న@శ్రీభక్త రామదాసుగారు తన జన్మ స్థల మైన నేలకొండపల్లి లోని తన నివాస గృహాన్ని తనకు ఆప్తుడైన శ్రీ జోన్నాభట్ల సీతారామయ్య కు దాన పత్రాన్ని వ్రాసి నేలకొండపల్లి గ్రామ పెద్దలకు ఇచ్చారు. దానిని బట్టి అందులో పేర్కొన్న సరిహద్దుల ఆధారంగా ఆయన వినియోగించిన భావిని, జన్మస్థలాన్ని లోగానే  నిర్నయించి వున్నారు. ఆ దాన పత్రంలో ఉత్తర సరిహద్దుగా మహామ్మాయి దేవాలయం అని పేర్కొన్నారు. 


శ్రీ భక్త రామదాసు స్మారక భవన నిర్మాణానికి వెనుక చరిత్ర: 
1946 సం.లో నైజాం వ్యతిరేక పోరాటం రోజుల్లో నేలకొండపల్లి కి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు ఆంధ్ర మహాసభ మరియు కమ్యూనిస్ట్ పార్టీల తరఫున నిజాం సంస్థానం ప్రతినిధిగా అఖిల భారత సంస్థానాల సమావేశానికి ఢిల్లీ కి వెళ్ళటం జరిగింది. సమావేశం తరువాత మరునాడు ఉదయం ఢిల్లీ పురవీధిలో వున్న ఒక తోపుడు బండి దగ్గరకు టీ తాగేందుకు వెళ్ళటం,అక్కడ అతనితో పిచ్చాపాటి సంభాషణ సమయంలో తన స్వగ్రామం నిజాం సంస్థానం లోని నేలకొండపల్లి గ్రామమని చెప్పటం జరిగింది. వెంటనే ఆ తోపుడు బండి యజమాని సత్యనారాయణ రావు గారికి పాదాభివందనం చేసాడు. ఆశ్చర్యం చెందిన సత్యనారాయణ గారు కారణం అడుగగా సాక్షాత్తు శ్రీ రామ చంద్రుని దర్శన భాగ్యం తో పునీతమైన పరమ భక్తాగ్రేస్వరుడైన శ్రీ రామదాసు జన్మస్తలిలో జన్మించిన మీరు ధన్యజీవులు. మీ పాదాలు స్పృశిస్తే సమస్త పాపాలు పోతవని తన జన్మ పావనమైనదని చెప్పి సంతోష పడటం జరిగినది.అప్పటి వరకు శ్రీ సత్యనారాయణ రావు గారికి రామదాసు గారి గురించి అంతగాతెలియదు. ఆయన అన్న వైద్యనాధంగారు న్యాయవాద వృత్తిలో మానుకోట పట్టణంలో మకాం ఉండుటవల్ల చిన్న వయసులోనే చదువు కోసం అక్కడికి వెళ్ళటం, మెట్రిక్ చదువుచుండగానే ఉద్యమంలో అడుపెట్టి కార్యక్రమాలు చేయటం వల్ల, అప్పటి వరకు రామదాసు గారి కార్యక్రమాలేమి గ్రామంలోగాని, జిల్లాలో గాని  జరగక పోవటం వల్ల రామదాసు గారిపై అవగాహన లేదు. పై సంఘటన అయన మనో ఫలకంపై చెరుగని ముద్ర వేసింది. యావత్ దేశఖ్యాతిని పొందిన శ్రీ రామదాసుగారి స్మారకంగా గ్రామంలో ఏదైనా చిరస్మరణీయమైన కార్యక్రమం మొదలెట్టాలని ఆలోచన మొగ్గ తొడిగింది. ఉద్యమ విరమణ తరువాత స్వగ్రామం చేరుకున్నాక ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

శ్రీ భక్త రామదాసు గారి జన్మ స్థల సేకరణ. 
శ్రీ భక్త రామదాసు గారి రామదాసు గారి జన్మస్థలం గా భావిస్తున్న స్థలాన్ని 1954 సం.లో ఆరుగురు ప్రైవేటువ్యక్తులనుండి 1.హరివిశ్వనాథం(232.00చ.గ.లు), 2.చిలుకూరివిశాలాక్షమ్మ(132.00 చ.గ.లు), 3. చిలుకూరి సీతారామయ్య(332.00 చ.గ.లు), 4. రంగావజ్జుల రామయ్య (384.00 చ.గ.లు), 5. పెండ్యాల వరలక్ష్మమ్మ(110.00 చ.గ.లు), 6. ప్రయాగ లక్ష్మినరసయ్య(160.00 చ.గ.లు) మరియు ప్రక్కనే ఆ ప్లాట్స్ కోసం ఉన్న Govt సందు ----30.00 చ.గ.లు తో కలిపివారి ఆధీనంలో నున్న  మొత్తం చ.గ.లు.1380.00 స్థలాన్ని శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు సేకరించి వారికి ప్రత్యామ్నాయ స్థలాన్ని వారి అంగీకారం మేరకు తన సొంత భూమిలో వేరే చోట ఇచ్చారు.

         స్మారక భవన శంకు స్థాపన-చరిత్ర.
               
    25 th December 1955 తేదీన శ్రీ జహీర్ అహ్మద్ IAS, Development Commissioner, Board of Revenue  Hyderabad state వారు శంకుస్థాపన చేసారు. 

1961 సం.లో నిర్మాణం పూర్తి అయినది. క్రింది చిత్రంలో నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు కనిపిస్తున్నారు. ఎదురుగా కనిపిస్తున్న ఇల్లు ఆయనదే. రామదాసు స్మారక మందిరం ఎదురుగానే వుంటుంది. ఆ ఇంటి నిర్మాణం జరిగి ఇప్పటికి దాదాపు రెండు  వందల సం.ల వయస్సు వుంటుంది. Old model Duplex House అది.
           

కుడి నుండి ఎడమ వైపున నిలుచున్న నాలుగోవ్యక్తి శ్రీ పెండ్యాల. భవన నిర్మాణానికి సంబంధించిన తెల్లరాయిని మనం చూడవచ్చు. నిర్మాణం లో కొన్ని ఎదురైన ఆటంకాలతో ఆర్ధిక సమస్యలను అధిగమించటానికి ఆయన తన ఇంట్లో భార్య మెడలోని చంద్రహారాన్ని అమ్మ వలసి వచ్చింది. అయినా ఆయన వెనకడుగు వేయలేదు.

1961 సం.లో నిర్మాణం పూర్తి అయిన తరువాత మానవ సేవే మాధవ సేవ అనే స్పూర్తితో కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆ భవనాన్ని సామాజిక అవుసరాలకు వినియోగించాలిసి వచ్చింది. కొంతకాలం ప్రైమరీ హెల్త్ సెంటర్ గాను, కొంతకాలం స్థానిక గ్రామ పంచాయత్ ఆఫీస్ గాను మరియు శ్రీ భక్త రామదాసు స్మారక లైబ్రరీ గాను వినియోగించారు. మానవసేవే మాధవసేవ అనే పద్ధతిలో సామాజిక సేవాకార్యక్రమాలకు అక్కడ స్థానమ లభించింది. ఆంధ్రప్రదేశ్ అప్పటి గవర్నర్ శ్రీ ఖందుబాయ్ దేశాయ్ ఆ భవనానికి మెదటి ముఖ్య అతిధిగా వచ్చారు. తరువాత స్వాతంత్ర సమరయోధులు శ్రీ కళా వెంకట్ రావు (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధమ రెవిన్యూ & ఆర్ధిక శాఖామాత్యులు), ఆతరువాత హైదరాబాద్ రాష్ట్ర హోంశాఖామాత్యులు స్వాతంత్ర సమరయోధులు శ్రీ మందుమల నరసింహారావు సందర్శించారు.

శ్రీ భక్త రామదాసు చిత్ర పట ఆవిష్కరణ 
శ్రీ భక్తరామదాసు స్మారకమందిరంలో ఏర్పాటైన లైబ్రరీ ప్రారంభసమయంలో మొట్టమొదటి సారిగా  శ్రీ భక్తరామదాసు  చిత్రపటాన్ని స్వాతంత్ర సమరయోధులు శ్రీ హయగ్రీవాచారి ఆవిష్కరించారు. ప్రస్తుతం సీతారామూల విగ్రహాలున్న ప్రదేశంలోనే ఆ చిత్ర పటాన్నుంచారు. 

           
ప్రాచిన గ్రంధాలలోని చిత్రాల ఆధారంగా రూపొందించిన శ్రీ భక్త రామదాసు చిత్రపటానిని శ్రీ హయగ్రీవాచారి  మాజీ మంత్రి, స్వాతంత్ర సమరయోదులు ప్రప్రధమంగా 1972 సం. లో ఆవిష్కరించారు.  

     చిత్రపటాన్ని ఆవిష్కరించిన ఫోటోలో స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ హయగ్రీవాచారి, గ్రంధాలయం  చైర్మన్ శ్రీ  పెండ్యాల సత్యనారాయణ రావు, పాలేరు MLA శ్రీ కత్తుల శాంతయ్య, పాలేరు సమితి మాజీ అధ్యక్షులు శ్రీ రావులపాటి సత్యనారాయణ రావు తదితరులు వున్నారు. ఫోటోలో కుడి వైపున వున్న మొదటి వ్యక్తి శ్రీ పెండ్యాల. చిత్రపటానికి పూలమాల వేస్తున్న శ్రీ హయగ్రీవాచారి. ప్రక్కన శ్రీ రావులపాటి సత్యనారాయణరావు మరియు లోకల్ MLA శ్రీ కత్తుల శాంతయ్య.



                వివిధ సమయాలలో శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం లో భక్తుల వితరణలు.
1993 సం.లో శ్రీమతి పెండ్యాల అన్నపూర్ణమ్మగారు ఇత్తడి మకరతోరణం చేయించారు. సీతారాముల, లక్ష్మణుల విగ్రహాలపైన కనిపించేది అదే.2005 సం.ములో ఉత్శవ విగ్రహాలను శ్రీ వాకా రామచంద్రరావు చేయించారు. వాటికి కావలసిన వస్తు సామాగ్రిని డాక్టర్ పెండ్యాల వెంకటేశ్వర రావు, డాక్టర్ యాచవరపు హైమవతి మరియు పెండ్యాల వాసుదేవ రావు సమకూర్చారు. శ్రీ భక్త రామదాసు స్మారక మందిరమునకు తూరుపు దిక్కున ఆగ్నేయం మూల నుండి రాతి స్థభం వరకు శ్రీ భక్త రామదాసు స్మారక కమిటీ అధ్యక్షులు శ్రీ పెండ్యాల వాసుదేవరావు సొంతసొమ్ములతో కాంపౌండ్ నిర్మాణం చేస్తున్న సమయంలో అక్కడికి అనుకోకుండా వచ్చిన స్థానిక మాజీ MLA , అప్పటి భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ శ్రీ కత్తుల శాంతయ్య నిర్మాణ వివరాలు తెలుసుకొని "ఇప్పటివరకు మీ కుటుంబం పెట్టింది చాలు నేను భాద్రాచల దేవస్థానం నుంచి కొంత ఇస్తానని" చెప్పి Rs 25,000/-ఇచ్చారు. వెంటనే అప్పటి MLA శ్రీ సండ్ర వెంకటవీరయ్య తన నిధులనుంచి Rs 25,000/-ఇచ్చారు. ఈవిధంగా రామదాసు మందిరం చుట్టూ తూరుపు, దక్షిణ మరియు పడమర దిక్కులలో కాంపౌండ్ నిర్మాణం జరిగింది. ఈశాన్యంవేపు గేటును మరియు compound ను శ్రీ రావులపాటి రంగారావు నిర్మించారు. అంతకు ముందు స్థానిక కస్తుర్బా మహిళాసంఘం పేరిట స్మారకమందిరం నైరుతిమూల బెంగుళూరుపెంకు పైకప్పుగా రెండురూమ్స్ నిర్మాణం జరిగింది. 1960 దశకం చివరలో శ్రీ భక్త రామదాసు రిక్రియేషన్ తరఫున సిమెంట్ స్లాబుతో ఆగ్నేయం మూలన ఒక రూమ్ నిర్మాణం చేసారు. దాని ముందర తూర్పుదిక్కుగా ఓపెన్ ఎయిర్  ధియేటరును లిబర్టీయూత్ క్లబ్ వారు 1978 సం.ములో నిర్మించారు. శ్రీ భక్త రామదాసు స్మారకోత్షవాలు అన్నిటికీ అదే వేదికైంది. వెనుక వున్న రూమ్ కార్యక్రమాలకు గ్రీన్ రూమ్ గా ఉపయోగపడింది. 2006 సం.ములో RS 1,50.000/-ఖర్చుతో రెండు సోలార్ లైట్సను రామదాసు స్మారకమందిరం ఆవరణలో ఉత్తర మరియు పడమర దిక్కులలో శ్రీ పెండ్యాల వాసుదేవరావు శ్రీ భక్త రామదాసు మెమోరియల్ కమిటి సౌజన్యంతో పెట్టించారు. స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో  సోలార్ దీపాలు పెట్టటం ఇదే మొదటిసారి. 2009 సం.ములో శ్రీ భక్త రామదాసు విద్వత్ కళాపీఠం వారు పడమర నైరుతి దిక్కున మరో స్టేజి నిర్మాణం చేసారు.

2011 సం.ములో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భద్రాచలం వారు శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం ఈశాన్యం మూలన వున్న రూమ్ ను కూలగొట్టి పడమర దిక్కున వరండాను మరియు వాయవ్యం మూలన ఒక రూమ్ ను కట్టించారు. శ్రీ భక్త రామదాసు ప్రాజెక్ట్ వారు రామదాసు భవన పునరుద్దరణ  సమయములో మెమోరియల్ హాలుకు నైరుతిదిక్కున వున్న రూము ఫ్లూరింగును పూర్తి చేయకుండా వదిలేసిన దానిని మరియు భద్రాచల దేవస్థానంవారు అసంపూర్తిగా వదిలేసిన  వాయవ్య రూమ్ & ఉత్తర వరండా అసంపూర్తి నిర్మాణమును శ్రీ కుంచకర్ర రాధాకృష్ణ  2013 సం.ములో పూర్తి చేసారు.

శ్రీ భక్త రామదాసు మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన సోలార్ లైట్స్ సంవత్సరాల తరబడి వెలుగకున్న ఎవ్వరు ఈనాటికి కూడా పట్టించుకోలేదు. వాటిని వెలిగించవలసి వుంది. పలైర్ అసెంబ్లీ పరిధి మొత్తంలో వున్న సోలార్ లైట్స్ అవి మాత్రమే. ఆశించిన అభివృధి జరుగకపొగా మందిరం రూపురేఖలను ఎవ్వరి ఇష్టం వచ్చినట్లు వారు మార్చటం గురించి, మందిరం మీద నియంత్రణ లేకపోవటం గురించి ఆందోళనతో లోగడ ఇచ్చిన లేఖలను చర్యలకై సంభందిత అధికారులకు సమర్పించనైనది. అలాగే ఆలయం కాని స్థలంలో ఆగమశాస్త్ర విరుద్ధ కార్యక్రమాలను కట్టడి చేయవలసి వుంది. జన్మ స్థల ప్రాంగణం మధ్యలో నున్న భావి దోష నివారణకు తూర్పు, పడమరలుగా భావికి ఉత్తర భాగంలో గోడను బేస్ మట్టం లెవెల్ వరకైనా నిర్మించ వలసి వుంది.

పిశాచస్థలంలో కొత్తగా నిర్మించిన స్టేజిపై దైవికకార్యక్రమాలు నిర్వహించటం ఆగమ శాస్త్ర విరుద్ధం. భద్రాచల దేవస్థానం అధీనంలో వున్న స్థలంలో అనుమతిలేని నిర్మాణాలు, మార్పులు మందిరం అభివృద్ధికి  అవరోధాలు అవుతున్నవి. ఎవ్వరి ఇష్టంవచ్చినట్లు వాళ్ళు నిర్మాణాలు చేస్తున్నారు. కాలంచెల్లిన దర్వాజాలు, కిటికీలు మార్చవలసి వుంది.

శ్రీ భక్త రామదాసు ఆరాధనోత్సవాలు మరియు జయంతి కార్యక్రమాలు తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక శాఖ చేపట్ట టానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు సంమతించటం హర్షణీయం. ఇప్పటికైనా ఈ ప్రాంత వాసుల చిరకాల వంచ నెరవేరుతున్నంధుకు సంతోషం.

తెలంగాణారాష్ట్ర దృష్టికి వచ్చిన తరువాత ఇప్పటికైనా మందిరంలో కొన్ని మరమ్మతులు చేసి మందిరానికి కలర్స్ వేయిస్తే బాగుండేదనే ప్రజల అభిప్రాయాన్ని స్థానికదినపత్రిక వెలిబుచ్చినది. క్రింద వున్నది ఆక్లిప్పింగుయే. సంబంధీకులు గమనించగలరని మనవి. ఆమందిరానికి రంగులు పదిహేడు సంవత్సరాల క్రిందవేసినవి.



                                     
                                        -----పెండ్యాల వాసుదేవరావు. 
<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

                     

             .

    

Sunday, April 22, 2018

మా వూరి బస్సు స్టాండ్--పాత జ్ఞాపకాలు..

40.(NKP-2). 

అయ్యో బస్సు స్టాండు వెళ్లి పోయావా?
మొన్న నేలకొండపల్లి వెళ్ళినప్పుడు చూశాను. బస్సు స్టాండు కూలగోట్టేసారు.  అది చూడగానే పాత సంగతులు కనుల ముందర కదలాడాయి.ఆ సంగతులకు ఈ ఫొటోలే సాక్ష్యం.

నేలకొండపల్లి బస్సు స్టాండ్ ఇక్కడ కట్టటానికంటే ముందునుంచే అక్కడ జనాలు బుస్సులకై వేచివుండేవాళ్ళు. 1955 సంవత్సరం లో స్థానిక గ్రామ పంచాయతీ దాన్ని కట్టించింది. పోరాటం తోనే దాని నిర్మాణం పూర్తి చేశారు. జిల్లాలో బస్టాండ్ ల నిర్మాణం ఆలోచన లేని రోజుల్లోనే దాన్ని ప్రారంభించారు. సర్పంచ్ శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గవర్నమెంట్ రోడ్ లో ఇల్లు కట్టుకుంటున్నాడని మోపిన అభియోగాలని అధిగమించి కట్టారు. 
బస్స్టాండ్ ప్రశాంతమైన వాతావరణంలో వుండేది.ముందర రోడ్ కు  ఆవల చెరువు నీళ్ళ నుంచి, వెనుక వేపు నుంచి పచ్చని పొలాల నుంచి  వచ్చే చల్లని గాలి ఆహ్లాదంగా వుండేది.
ఈ క్రింది ఫోటో 1955 సంవత్సరంలో తీసినది.



1955 నుంచి 1975 దాకా నిరాటంకం గా అక్కడ బస్సులు ఆగినవి. 1975 నుండి 1980 దాకా బస్సులు ఆగటానికి పోరాటం చేయాలిసి వచ్చింది. బస్సులు ఆగటానికి అక్కడ రోడ్ వెడల్పు సరిపోదని ఆర్టీసీ చెప్పిన అభ్యంతరం వల్ల ఛివరకు సాంప్రదాయాలకు విరుద్ధంగా అక్కడ ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని వెనక్కు జరపాల్సి వచ్చింది.  సాంప్రదాయ వాదులు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.ఫోటోలో ఉన్న రాతి గోడ రోడ్ సగం వరకు మీదకు ఉండేది. కొంత కాలం తరువాత దానిని  చెరువుకట్ట బస్సు స్టాండ్ అనే  పేరుతో పిలుచుకోనేవారు.
క్రింది చిత్రాలు రెండు  1979 లో తీసినవి.


స్త్రీ, పురుషులకు మరియు ఆర్టీసీ కంట్రోలర్ కోసం రూమ్ ను వేరు వేరుగా ఆరోజుల్లోనే కట్టారు. 2000 సంవత్సరం తరువాత రిపేర్లు లేక కృంగి కృశించి పోయింది. పట్టించుకున్న నాధుడే లేకపోయాడు.chiవరకు కులగొట్టేశారు. మళ్లీ కడితే ప్రయాణీకులకు సౌకర్యం. సంతోషం.
 ఈ ఫోటో ను 1979 సంవత్సరం లో తీశారు.

                          -------------పెండ్యాల వాసుదేవరావు 
.
<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Billion reasons why the India-Israel partnership is hitting new highs.

#Geopolitics Modi's Diplomatic Dance: Navigating the Geopolitical Tightrope on His Israel Tour IN THE ABOVE PIC INDIAN PM SRI NARENDRA M...