Posts

84. (SOCIAL...56). అంబానీ ఇంట్లో పెళ్లి.. నీకూ, నాకూ ఎందుకీ లొల్లి...

Image
ఈ మధ్యన సోషల్ మీడియాలో "ప్రేమ్  టాక్స్" వీడియో  చూశా. వెంటవెంటనే మరెన్నో వీడియోలు చూసే భాగ్యం కలిగింది. వాటి  సారాంశం చూశాక నా అభిప్రాయం చెప్పాలనిపించింది. ఈ మధ్యనే అంబానీ ఇంట్లో ఆయన కొడుకు పెండ్లి జరిగింది. తనకు కావలసిన వారిని తాను పిలుచుకున్నాడు. వచ్చినవారికి తనకు నచ్చిన రీతిలో బహుమతులు ఇచ్చి సత్కరించుకున్నాడు. ప్రపంచస్థాయి కళాకారులను, నిష్ణాతులను  పిల్చి అధ్భుత కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారిస్థాయిలో  వారికి పారితోషికాల ఇచ్చాడు. తాను కస్టపడి, తన తెలివి తేటలతో, శక్తి యుక్తులతో శ్రమను ధారపోసి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకొని సంపాదించుకున్న సంపాదనలోంచి తాను ఖర్చు పెట్టాలనుకున్నంత కొడుకు వివాహానికి ఖర్చు పెట్టుకున్నాడు.   ఆయన ప్రాధమిక హక్కులలో మన జోక్యం ఏమిటి?. ఆయన తన కుమారుని పెళ్ళిలో తాను ఖర్చుచేసిన విధానంపై మనకు అభ్యంతరం ఏమిటి?. ఈ విరుచుకుపడటాలు, అక్కసు వెళ్ళ  గక్కటం ఏంటీ? నాకు చాలా విచిత్రం అనిపించింది.   తన తండ్రి "బ్రిటిష్ షెల్" అనే ఇంధన కంపెనీలో 300 రూ.ల జీతంతో పనిచేసిన సాధారణ వ్యక్తి. చాలా క్రిందిస్థాయి నుండి పైకెదిగి తన వ్యాపారసామ్రాజ్యాన్ని స్థాపించుకున

83. NKP.. (17). ప్రభుత్వాలు మారినా..విధానాలు మారవా?

  ప్రభుత్వాలు మారినా విధానాలు మారవా? ప్రజల తలరాత మారదా? నేలకొండపల్లి మండల బస్సు ప్రయాణీకుల బాధలు ఎవ్వరికీ పట్టవా? ఆర్.టీ.సీ బస్సు స్టాండ్ ను నేలకొండపల్లి గ్రామంలో 1990 ఏప్రిల్ నెలలో అప్పటి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ జీ.వీ.సుధాకరరావు ప్రారంభించారు.  అప్పటి సర్పంచ్, స్వాతంత్ర సమర యోధులు శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు. ఈ బస్సు స్టాండ్ ఆనాడు, ఈనాడు పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో వున్న ఏకైక బస్సు స్టాండ్. రెండెకరాల సువిశాల విస్తీర్ణంలో వుంది. ఆ స్థలానికి రక్షణ లేకుండా పోతోంది. విలువ కోట్ల రూపాయల్లో వుంది. నియోజకవర్గంలో వున్న ఏకైక బస్సు స్టాండ్ ను కూడా సంరక్షించ లేరా? వినియోగంలోకి తేలేరా? 11 సంవత్సరాలనుండి నేలకొండపల్లి మండల ప్రజలు బస్సుల నిరీక్షనకై రోడ్డుమీద ఎండకు, వానకు నిలబడి నానా యాతన పడుతున్నారు. స్త్రీలకు వాష్ రూం సౌకర్యం వద్దా? ముసలివారు, గర్భిణీలు, పసిపిల్లలు ప్రభుత్వాల తిట్టుకుంటూ తమ దురదృష్టానికి వాపోతున్నారు. విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. వికలాంగుల పరిస్థితి సరేసరి.  ప్రయాణీకుల అసౌకర్యాల తొలగిపుకై చర్యలు తీసుకోవాలని స్థానిక శాసన సభ్యులు మరియు రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి గా

82. (SOCIAL.55). ఖమ్మంకు ఆత్మాభిమానం లేదనుకున్నారా?

ఖమ్మంకు  ఆత్మాభిమానం  లేదనుకున్నారా? లోకసభ ఎన్నికల బరిలో ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి. ఏవేవో కులాల కొట్లాటలు కనిపిస్తున్నాయి.  ఖమ్మం ఎన్నికల సమరాంగణములో ఏవేవో రాజకీయ మంత్రాంగాలు నడుస్తున్నాయి. ఖమ్మం ఆత్మాభిమానం ఎవ్వరికీ అక్కరలేదా ?. ఆత్మాభిమానం మంటగలుస్తున్నా . పౌరుషం ఆనవాళ్లు కనిపిస్తలే. ఖమ్మం ఉద్యమాల గుమ్మం. తెలుసా ఈ తరానికి? చరిత్ర ఎవ్వరైనా చెప్పారా? నాకు తెలిసి, ఉద్యమాలలో  కీలక స్థానాల్లోవుండి  త్యాగాలు చేసిన వారికో,  వారి కుటుంబ సభ్యులకో...  పార్టీ లోనో, ప్రభుత్వ, రాజ్యాంగ స్థానాలలోనో  ఉద్యమకారులకు, వాటి బాధితులకు అవకాశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళ బలిదానాలతో, ఆత్మార్పణతో ఏర్పడ్డ రాష్ట్రంలో మాది ఫక్తు రాజకీయ పార్టీ, ఇక్కడ మాకు అధికారంలోకి రావటమే మాలక్ష్యం ఉద్యమకారులతో, ఉద్యమంతో మాకు సంబంధం లేదు అని ప్రకటించడానికి ఉద్యమనాయకులకు న్యాయమా? అలా అన్నందుకు సిగ్గుపడాలి కదా! నైజాంపై పోరాటం సమయంలో, 1968 తెలంగాణా ఉద్యమ సమయంలో, 2000 సం.లో తర్వాత ప్రత్యేక తెలంగాణ పోరాటం సమయం ఉద్యమకారుల చూశాను. త్యాగాలు చేసిన వారికి ఎవ్వరికీ గుర్తింపులు లేవ్. బ్రిటిష్ ఇండియా స్వాతంత్ర చరిత్ర చూసినా అదే జరిగ

81. (SOCIAL--54) ఔనా? నిజమేనా?

Image
పల్లెల్లో సందడి మొదలైంది అలజడి మొదలైంది పంచాయతీ ఎన్నికల నగారా మ్రోగబోతోంది. "చేతులకు" పనిమొదలైంది "కార్లలో" ఇంధనం రెఢీ అవుతోంది "కోడవళ్లు" నూరటం షురూ అయింది. ఓ నడి వయస్సు పలుకరించింది అయ్యా చూస్తున్నరా? కాలం మారింది తరం మారింది ఓటు వేయాలంటే నోటియ్యాల గెలవాలంటే కోట్లు గావాలే యెట్లయ్యా గిట్లయితే?.... ఓ ప్రశ్న నా మనసును తట్టి లెపింది. గీట్లయితే ఎట్లా? నువ్వు రా అయ్యా యీరందరికీ బుద్ది చెప్పాలయ్యా నువ్వు నిలబడయ్యా అంది  ఆ రోజులు మళ్లీ రావాలయ్యా అంది. ఆలోచనలు ముసిరాయి యుద్ధాన్ని మొదలెట్టాయి. ఉద్యమానికి ఎక్కడో ఒకచోట  ప్రారంభం కావాలి కదా తొలి అడుగు పడాలి కదా అది ఇదే ఎందుకు కాకూడదు నడువు అని చెప్పింది. నా ఆలోచన అందీ.. కుడి యెడమ అయితే  ఇమేజ్ పోదా అని .. మనసు గీ పెట్టింది. ఉద్యమం అన్నాక కష్టాలు, నష్టాలు ఉండవా? మరకలు పడితే శుభ్రం కావా? యువతరం ఆ పని చేస్తుంది నువ్వు పదా అంది. ఔనా? నిజమేనా? చెప్పండి. .... ...పెండ్యాల వాసుదేవరావు <!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91">&l

80. (SOCIAL--53) దేశంలో ప్రజా సేవ ఇంత Costly నా? ఎవ్వరికీ బాధ్యతలు లేవా?

Image
                                    ఈ దేశంలో ప్రజాసేవ                                     ఇంత costly అయిందా?                                     వింటున్నాం                                      నియోజకవర్గంలో                                      ఒక అభ్యర్థికి 400-500 కోట్లు ఖర్చు,                                     అవతల వారూ అంతే..                                     నేనేమీ తీసిపోలేదంటూ..                                     అంతసొమ్ము ఇద్దరూ కలిసి                                     నియోజక వర్గ సమస్యలపై                                     ఖర్చు పెడితే                                     బతికినంతకాలం                                     జనం మిమ్ములను                                     వారి వారి హృదయాలలో                                      దాచుకుంటారు కదా!                                      మిమ్ముల పూజిస్తారు కదా!                                      డబ్బు ఖర్చుపెట్ట దలచుకుంటే                                      పై మార్గంలో వెళ్ళండి.                            

79. (social..52). మీరు నమ్ముతారా. ఎన్నికలు అంటే అలావుండాలి

Image
                                                    ఎన్నికలు .. సంస్కరణలు అంటే  నాకు  మా ప్రక్కగ్రామం అయిన బొదులబండకు చెందిన కీ.శే. శ్రీ పొట్టి పింజర హుసేనయ్య  జ్ఞాపకం వస్తాడు  1978 లో  ఆయన  పాలేరు నియోజక వర్గానికి ఏం. యల్. ఏ.గా గెలిచాడు   ఆ కాలంలో  ఆయన ప్రచారంలో  హంగు ఆర్భాటాలు లేవు.  మైకుల హోరులు, వాహనాల రొదలు అసలే లేవు.  ఊరేగింపులు, గడప గడపకు ప్రచారాలు లేవు.  ఒకటో, రెండో సమావేశాలు జరిగాయోమో  నాకైతే గుర్తు లేదు. మీరు నమ్ముతారా? పోలింగ్ జరిగేటప్పుడు పోలింగ్ స్టేషన్ లో  ఏజెంట్లు కూడా లేరు. పార్టీ గుర్తు చెప్పేవాళ్ళు అసలే లేరు.  సామాన్య జనంలో ఇందిరమ్మపై  అభిమానం ఉప్పెనలా ఉప్పొంగింది.  హుసేనయ్యను ఏం.ఎల్.ఏ గా గెలిపించింది. అంతకు ముందు మూడు పర్యాయాలు  ఏం. ఎల్. ఏ గా వున్న వ్యక్తిని ఓడగొట్టారు. అధికార పార్టీ అయిన కాంగ్రెసును  కాంగ్రెసు వాదులే ఓడించారు       ఇందిరమ్మ కాంగ్రెసును గెలిపించారు  అదే ఇప్పుడు మిగిలింది  జన బలం అది. జన శక్తి అలాంటిది. అలా వుంటే అందరూ బాగుంటారు  ఎన్నికల్లో ఓడినా  ఎవ్వరికీ గుండెపోటు రాదు. అందరి ఆస్తులకు రక్షణ లభిస్తుంది  ----పెండ్యాల వాసుదేవ రావు.       తేదీ: 05.11.20

78. (social...51). ఎవవరెవరో ఎక్కడినుండో వస్తారు..... ఆలోచించండి ప్రజలారా...

Image
ఆలోచించండి.  ఎన్నికల సందడి మొదలు కాగానే ఎవ్వరెవ్వరో వస్తారు ఎక్కడెక్కడి నుండో వస్తారు చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు,  దూరిపోతారు  తెగ హడావుడి చేస్తారు దండలు/ఓ ట్లు వేయించుకుంటారు కుర్చీలో/పదవిలో కూర్చుంటారు ఆ తరువాత ఏమీ పట్టించుకోరు ఏటో వెళ్ళిపోతారు ధన సంపాదనలో మునిగి పోతారు సమస్యలన్నీ పేరుకు పోతాయి సమాజం లో చీకట్లు ముసురుతాయి …. ఎన్నికల్లో  ఎప్పుడూ తక్కువ బడ్డుకు ఓటేద్దాం అనే  భావానికి అలవాటు పడ్డారు జనం ఆ ప్రభుత్వం మీద కోపం వుంటే   దాని ప్రత్యర్థి పార్టీకి, ప్రత్యర్థి పార్టీకి అధికారం వచ్చి దీనిపై కోపం వస్తే మాజీ అధికార పార్టీకి ఓటు వేయడం తప్ప గత్యంతరం లేని స్థితి ప్రత్యామ్నాయం లేని దుస్థితి… ఏదీ, ఏమీ ఆలోచించలేని సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఒకవైపు….. స్వలాభాలకోసం కార్యకర్తల ప్రయోజనాలు తాకట్టు పెట్టి అభ్యర్దుల నిర్ణయాలతో రాజకీయ పార్టీలు మరోవైపు….. ఈ పార్టీల వ్యవస్థ అవస్థల పాలు చేస్తోంది.. ఎన్నికల సంస్కరణల కొరడా పైకెత్తి యువతరం కార్య రంగంలోకి దిగవలసిన సమయం వచ్చింది, దొంగలు, దొంగలు వూళ్ళు పంచుకున్నట్లు గెలిచిన ప్రజాప్ర