Sunday, May 13, 2018

మా సహకార గ్రామీణ బ్యాంక్

48. (NKP-8). 

మా సహకార గ్రామీణ బ్యాంకు

( The Co-operative Rural Bank ltd).

ప్రస్తుతం ఈ బ్యాంకును అన్నిటిలాగే ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అంటున్నారు.

నేలకొండపల్లి సహకార గ్రామీణ బ్యాంకును తేది 13.07.1956 న స్వాతంత్ర్య సమరయోధులు, ఆనాటి మద్రాస్ రాష్ట్రంలో సీనియర్ కాబినెట్ మంత్రి మరియు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ గా పనిచేసిన శ్రీ కళా వెంకట్రావు గారు ప్రారంభించారు. కోనసీమను నందనవనం చేసిన మహానుభావుడాయన. శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారికి అత్యంత సన్నిహితుడు ఆయన. సత్యనారాయణరావు గారి ఆహ్వానం మేరకు ఆయన వచ్చారు.అప్పటికి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడలేదు.

మొదటి మూడు టర్మ్ లు సహకార గ్రామీణ బ్యాంకుకు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారు ప్రెసిడెంటుగా ఉన్నారు. అప్పుడు ఒక టర్మ్ ఒక సంవత్సరం మాత్రమే వుండేది. ఆ సహకార గ్రామీణ బ్యాంకు క్రింద 1.నేలకొండపల్లి, 2. సింగారెడ్డిపాలెం,3. సదాశివపురం, 4. కొత్త కొత్తూరు, 5, పాత కొత్తూరు, 6.బోదులబండ,7.తిరుమలాపురం,8. కోరట్లగుడెం, 9.అనాసాగారం.10.గువ్వలగూడెం, 11. ఆరెగూడెం, 12.కోనాయగుడెం,13. ఆచార్లగూడెం ఉండేవి. అన్ని భౌగోళికం గా అనుకూలంగా ఉండేవి.

క్రింది చిత్రంలో సహకార గ్రామీణ బ్యాంకు బకాయి దార్లకు ఇవ్వాలిసిన నోటిసుల ను గ్రామాల వారీగా SORTOUT చేస్తున్న సహకార గ్రామీణ బ్యాంకు ప్రెసిడెంట్ శ్రీ పెండ్యాల వాసుదేవ రావు కనిపిస్తున్నారు.

నాకు ఆ టర్మ్ (ఫస్ట్ టర్మ్) లో సిబ్బంది ఎవ్వరు లేరు. అంతా నేనే. ATTENDER తో సహా.

26 సంవత్సరాల వయస్సులో 1981 సంవత్సరం లో మొట్ట మొదటి సారిగా Co-operative Rural Bank president గా ఎన్నిక అయినాను. నాకన్నా ముందు జరిగిన ఎన్నికలన్నీ ఏకగ్రీవమే అయినవి.ఈ సమయంలో జరిగిన ఎన్నికలు మాత్రము గ్రామ పంచాయతి ఎన్నికలను మించి ఉధృతం గా జరిగాయి. తరం మార్పిడికి సంబంధించి జరిగిన ప్రసవ వేదన అది. ఆ కమిటీలో శ్రీ బుగ్గవీటి కృష్ణయ్య, Ex MLA OPPOSITION పాత్రను పోషించారు.ఆయన డైరెక్టర్ గా వుండే వారు.

నేను ఎన్నిక అయిన వెంటనే అప్పటివరకు సెక్రటరీ గా వున్న శ్రీరామారావు రాజినామ చేసాడు.సెక్రటరీతో సహా స్టాఫ్ ఎవ్వరు లేరు.ప్రెసిడెంట్ ను అనే మాట మరచి ఆ Term అంతా జీతం భత్యం లేని CEO గా సిబ్బంది లేకుండానే పూర్తి సమయం గడపవలసి వచ్చింది.

ప్రతీ విషయంలో ఖమ్మం సెంట్రల్ బ్యాంకు మరియు కో-ఆ ప రే టి వ్ డిపార్టుమెంటు తో యుద్ధమే.

ప్రత్యేకం గా ఆఫీస్ ఏర్పాటు చేసాము. ఫర్నిచర్ కొన్నాము. 25 సంవత్సరాల AUDIT పూర్తి చేసాము.Technical problem వల్ల loan సకాలంలో సెంట్రల్ బ్యాంకు ఇబ్బందులకు గురిచెయ్యటంతో 400 మంది రైతులకు sanction అయ్యే మొత్తమును దృష్టిలో పెట్టుకొని ఎరువులు అరువుకు తీసుకొని వచ్చి పంచాము. ఇంత సాహసం చేసే శక్తి నాకు గాని మరెవ్వరికి గాని లేదని ఓకే రైతు పెద్ద శ్రీ దేశ్ముఖ్ నరహరి రావు వ్యాఖ్యా నించారు.

శ్రీ పెండ్యాల సత్యనారయణ రావు గారు బ్యాంకుకై కొన్న ఒక ఎకరం భూమి అంతకు ముందు దశాబ్దంలో అన్యా క్రంతం కావటం తో మిగిలిన ముక్కలు ముక్కలుగా వున్న భూమిని అమ్మి గోదాము నిర్మాణాని కై అవుసరమైన 1200 చ.గ. స్థలాన్ని కొన్నాము. ఇప్పుడు దాని విలువ కోటి రూపాయల పైననే.

నా టర్మ్ అయిపోయే సమయంలో శ్రీ రామాయణం శ్రీధర్ SERETARY గా వచ్చాడు. అతని పనితనాన్ని చూసి సంతృప్తి చెందాక అతన్ని కొనసాగించాము.

ఈ సేవా కార్యక్రమాలతో జీవనోపాధికోసం జీవితంలో పైచదువులకు వెళ్ళలేక, ఉద్యోగ లేదా  వ్యాపారాల్లోకి పోలేక ఇందులోనే వుండిపోయాను నేను. నాకు ఇదే లోకం అయినది. దశాబ్దాల తరబడి ఈ బ్యాంకుతో అనుబంధం ముడిపడి పాయినది. బ్యాంకు ప్రక్షాళనకు, పునర్నిర్మాణానికి నేను ఎక్కువ సమయం వెచ్చించాను.

Below pic.  CRB, Nelakondapally 1987 TEAM. This was my 2nd term as President.





In the chairs middle Pendyala Vasudeva Rao, President, From Right to left: Sarvasri R.Sridhar(Secretary), D.Papa Rao(Supervisor), Vice President Vadde Ranga Rao, and Smt Gandluri Seeta.

In the standing row from left to right: Sarvasri Koti Hanumantha Rao, Pallapu Rama Rao, Pagidikattula Venkateswarlu, Kasaboina Janaiah, Rayapudi Venkateswar Rao, Bhukya Hanuma, Swamy Krishna Rao, Devarasetty Venkateswar Rao and Volloju Narayana.
On the Back Bench: Right to left: Khammam Venkateswarlu, Kanaparthi Nagender and Kummarikuntla Venkateswarlu(Attender).

ఈ టర్మ్ లో నేను ఒక్క నిమిషం కుడా ఉపిరి తీసుకునే సమయం లేకుండా వుండేది. ఏరియా అఫ్ ఆపరేషన్ పెరిగింది. లోనింగ్ పెరిగింది. షుగర్ పంట వచ్చింది. ఏరియా లోకలైజ్ అయినది. రాష్ట్ర సహకార శాకా మంత్రి అయిన శ్రీ గొల్లపల్లి సూర్య రావు ఖమ్మం జిల్లా ఇంఛార్జ్ మంత్రి కావటంవల్ల రాజకీయ ప్రత్యక్ష పోరాటం వుధృతంగా జరిగింది. బ్యాంకు కార్యకలాపాలలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకొనే వాడు. ఒక డైరెక్టర్ అనర్హత విషయమై ప్రత్యక్ష యుద్ధం జరిగింది మా బ్యాంకు పాలక వర్గం మొత్తాన్నేరద్దు చేస్తానని నోటీసు ఇప్పించాడు.నేను జవాబు ఏమి చెప్పినా పాలక వర్గం రద్దె.High Court government యిచ్చిన Statutory Notice ను admission stage లోనే QUASH చేయటం తో సహకార శాఖ తెల్లబొయింది.

Day to day కార్య కలాపాలలో కూడా అన్ని పోరాటాలే. సిబ్బందిని నియమించుకొంటె సెంట్రల్ బ్యాంకుతో యుద్ధం, వాళ్లకు జీతాలు పెంచుతే Co-operative depatrtment తో జగడం, సిబ్బందిని CO-OPERATIVE TRAINING కు సొసైటీ ఖర్చుతో పంపితే పోరాటం, సిబ్బంది హోదా పెంచి ప్రమోషన్ ఇస్తే ఆడిట్ అభ్యంతరాలు..రాష్ట్రం లో మొదటి సారిగా ప్రాధమిక లెవెల్ లో CHARTERED ACCOUNTANT తో ఆడిట్ చేయించు కోవటానికి రాష్ట్ర కమీషనర్ దగ్గరనుండి పర్మిషన్ కుడా తెచ్చుకొని పోరాటంతో విజయం సాదిం చాము. 

భవిష్యతులో జీవితం లో స్థిర పడే యత్నం లో ఒక ప్రక్కన LLB విద్యనూ అభ్యసించటం...ఇలా ఎన్నో.

ఒక సంవత్సరం చెరుకు రైతులకు లోన్స్ DISBURSEMENT చెయ్యకుండా (AREA LOCALISE అయినది) సెంట్రల్ బ్యాంకు తాస్తారం చేస్తుంటే నేను ఒక్కడినే జిల్లా కలెక్టర్ శ్రీ I.Y.R.కృష్ణ రావు గారి దగ్గరకు రిప్రేసేంట్ చేయటానికి వెళ్లి within 24 hours లో లోన్స్ బట్వాడా చేయించాను. నేను కలెక్టర్ గారి దగ్గరకు వెళ్ళిన సందర్భం లోనే సిపిఐ లీడర్ మొహమ్మద్ మౌలానా కుడా ఒక వంద మంది రైతులతో రైతులకు లోన్ బట్వాడా కోసం Representation కై వచ్చాడు. ఆయన పనికూడా ఐనది.

విషయం ఏమిటంటే ఒక్కడినే పోయి పని సాధించుకు రావటం వల్ల జనానికి సకాలంలో లోన్స్ వచ్చి ఇబ్బంది తెలియలేదు.తాము ఏ పరిస్థితిని ఎదుర్కొన్నారో అదెలా పరిష్కారము అయినదో వాళ్లకు తెలీదు.పుబ్లిసిటీ లేకపోవటం వల్ల నా కృషి తెలియలేదు. శ్రీ మౌలానా జనాన్ని ఊరి నుండి తీసుకుని రావటం వాళ్ళ ఆయన కృషి జనాలందరికీ తెలిసింది.

మా సహకార బ్యాంకు సభ్యులు అయిన రైతులు  అందరికి సకాలంలో ఋణాలు అందిస్తు ఇబ్బంది లేకుండా చేయటమే నా పంధా.

నేను అధికారం లో వున్నా, లేకున్నా సకాలంలో ఇబ్బందులు లేకుండా పని అయిపోయే విధంగా చేయటమే నా తత్వం. నేను చేసింది, సాధించింది అదే.ఇది మా నాయన గారి తత్వం.నేను నేర్చుకున్న పాఠం.



పైచిత్రంలో రెండవ CO-OPERATIVE RURAL BANK PRESIDENT శ్రీ కొమ్మినేని అనంతరామయ్య (2 YEARS- 1960--61 )  కనిపిస్తున్నారు.

చిత్రంలో శ్రీ శీలం సిద్దా రెడ్డికి సన్మాన పత్రం సమర్పిస్తున్న శ్రీ కొమ్మినేని అనంతరామయ్య. చిత్రంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావుతో చర్చిస్తున్న శ్రీ శీలం సిద్ధారెడ్డి, MLC & AP State Major Irrigation minister ప్రక్కన పాలేరు సమితి మాజీ ప్రెసిడెంట్ శ్రీ రావులపాటి సత్యనారాయణ రావు మరియు ఖమ్మం మాజీ MLA శ్రీ బుగ్గవీటి కృష్ణయ్య.



పై నున్న చిత్రంలో Co-operative Rural Bank కు మూడవ president గా వున్న శ్రీ కంకిపాటి రాజేశ్వర రావు @ జగన్నాధరావు కనిపిస్తున్నారు. శ్రీ కీసర అనంతరెడ్డి, ఖమ్మం MLA మరియు  TELANGANA PLANNING BOARD CHAIRMAN గారికి శ్రీ కంకిపాటి సన్మానపత్రం సమర్పిస్తున్న దృశ్యం.  అప్పుడు ఆయన సహకార గ్రామీణ బ్యాంకు ప్రెసిడెంట్. ఈయన 1975-81 వరకు రెండుటర్మ్ లు ప్రెసిడెంట్ గా వున్నారు.చిత్రంలో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారు సహకార గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకులు  కూడా చిత్రంలో వున్నారు.

                                                                                                         ---------పెండ్యాల వాసుదేవ రావు 
<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>



Thursday, May 10, 2018

మా పల్లె పాఠశాల ---జూనియర్ కళాశాల--జ్ఞాపకాలు.

47. (NKP-7). 

మా పల్లె పాఠశాల ----జూనియర్ కాలేజీ ----జ్ఞాపకాలు 


History of Committee School to the Government School.


This PIC was taken in front of the newly constructed building of Sri Bhakta Ramadasu Memorial Committee School, Nelakondapally in the year 1950's. Parents committee was formed in the year 1952 under the presidentship of Sri Pendyala Satyanarayana Rao. With their efforts school was upgraded to 6th (1952-53) to 10th (1956-57). The first batch of 10th class strength was only 14 members. After hard service and regular supervision, minimum strength was maintained. School buildings were constructed. Elders regularly visited the school to solve administration problems and to appoint good teachers. Sometimes the school was run in a private place. The committee school was handed over to the government in the year 1959. The name of the school was modified later as Z.P.S.S. School.
Sarvasri Pendyala Satyanarayana Rao, Boppana Venkateswara Rao, Pendyala Krishna Murthy and other seen in the pic when they visited the school.


The below rooms construction was for the additional accommodation of school classes in Nelakondapally village. Previously it was for primary school purpose.


In the below PIC H.M Sri APPARAO gari farewell gathering in Government High School Nelakondapally.

There are so many Village elders are there in the picture.


They are Sarvasri HM Apparao, Ravulapati Narasimha Rao, Pendyala Satyanarayana Rao, Kankipati Jagan Mohan Rao, Paidimarri Suryanarayana , Desmukh Srinivasa Rao, Tadikamalla Seetarama Rao, Rayapudi Viswanatham, Jakkepally Dharmaiah, Ravulapati Ranga Rao, Dr.Chakradhar Rao, Bandaru Rajeswar Rao, Kanamarlapudi Vasudev, Sadhu Anantaramaiah, Ravulapati Atmaram Rao, Desamukh Narahari Rao, Gandluri Narasimha Rao, Marla Laxminarayana, Chinnamsetty Janakiramulu, Kummarikuntla Narayana, Kummarikuntla Kotaiah, Dandala Subba Rao and Retd Headmaster Gopala Rao etc.

Government Junior College history: 


THE GOVT JUNIOR COLLEGE WAS SANCTIONED IN THE YEAR 1970 AT NELAKONDAPALLY AFTER SO MANY EFFORTS AND FIGHTS. Village elders collected Rs 25,000/- out of Rs 50,000/- which was needed as a mandatory deposit to remit to the govt. In the remaining amount, elders constructed the lab. Parents committee faced many legal hurdles and outside political forces. Local Khammam MP Smt Thella Laxmikanthamma influenced the education minister Sri P.V.Narasimha Rao to sanction junior college at Gokinepally village. She opposed the efforts of the Nelakondapally village elders to sanction Junior college at Nelakondapally. After a long fight, Junior college was sanctioned at Nelakondapally village. Within a gap of 15 days time,  another Junior college was sanctioned at Gokinepally village also within 9 km radius. Because of KASU BRAHMANANDA REDDY's (Hon'ble CM of AP state) blessings JUNIOR COLLEGE WAS SANCTIONED at Nelakondapally. Parents committee president Sri Pendyala Satyanarayana Rao sold his wife's gold bangles for expenses to stay at Hyderabad and for sanction of college etc.

Later after some years due to lack of strength Gokinepally Junior college was shifted to another village called Mudhigonda. Previously Gokinepally was a Multipurpose school but due to lack of strength school was  

BECAUSE OF THIS COLLEGE SO MANY YOUNG STUDENTS FROM WEAKER SECTIONS GOT THE OPPORTUNITY TO STUDY UP TO INTER/ DEGREE IN THOSE DAYS.

In the below PIC SRI SADHU ANANTHARAMAIAH AND SRI PANTANGI NAGABHUSHANAM PUROHITHS PERFORMING PUJA AT FOUNDATION PLACE.
Major Irrigation Minister of AP Govt Sri SEELAM SIDDHA REDDY AND SARPANCH & PARENTS COMMITTEE PRESIDENT Sri PENDYALA SATYANARAYANA RAO SEEN IN THE PIC.


FOR THE PURPOSE OF SCIENCE LABORATORY FOUNDATION STONE LAID BY SRI SEELAM SIDDHA REDDY ON DT: 27.10.1971.

FOR SANCTION OF GOVT JUNIOR COLLEGE AT NELAKONDAPALLY PEOPLES CONTRIBUTION WAS MANDATORY FOR RS 50,000/- IN VIEW OF DROUGHT CONDITIONS PARENTS COMMITTEE CULTIVATED THE TANK BED IN SURVEY.NOs. 225 & 782 AT NELAKONDAPALLY FOR THE PURPOSE OF INCREASING ITS FINANCIAL RESOURCES. FROM THE INCOME OF THIS CULTIVATION THE SAID SCIENCE LAB WAS CONSTRUCTED. District revenue authorities have filed a case against parents committee for unauthorised cultivation in government Tank bed. Due to the efforts of Sri Pendyala Satyanarayana Rao the case was subsidised after a long time. 

SARVA SRI PENDYALA SATYANARAYANA RAO (PARENTS COMMITTEE PRESIDENT FROM 1970-91), R. BHUVANA SUNDER REDDY(Z.P CHAIRMAN), KATTULA SANTHAIAH(LOCAL MLA), COLLEGE PRINCIPAL B.S. PETER AND SHAJAHAN BEGAM D.E.O. SEEN IN THE BELOW PIC.


In 60's another primary school was sanctioned in Nelakondapally village exclusively for Girls, but so many boys were studied in that school including me. I studied up to fourth class there. 
We can see the girl's school pic in below pic. Once it was the premises of "VIRAAT RAAYAANDHRA GRANDHALAYAM", a historical premise.
Another primary school was sanctioned in the name of "Singareddypalem primary school". Once Singareddypalem was a dead village. At the time of plot allocated to the weaker sections in 1950's houses were built. Singareddypalem and Nelakondapally villages are twin villages. Singareddypalem village is located to the western boundary of Nelakondapally village and western part of the trunk road which is Khammam to Kodad road.

In recent past Degree college was sanctioned and it is running on the same premises of Junior college in Nelakondapally.



                                                                          ----పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>



Tuesday, May 8, 2018

The Legends who drafted the INDIAN CONSTITUTION!

46. (SOCIAL-37) 

The Legends who drafted the INDIAN CONSTITUTION!


Sri B.R.Ambedkar, Chairman and other members of the Constitution drafting committee.
1. Sri K.Munshi (Bombay), 2. Alladi Krishna Swamy Iyyer (Madras), 3. N.Gopala Swamy Iyyer (Ex PM, J & K), 4. Md.Sadullah (Muslim League Member), 5. D.P.Khaitan (Lawyer) and 6. Bengal Narasimha Rao (Adviser).

After the resignation of Sri Mittal Madhava Rao advisor of Maharaja of Vadodara) and After the death of Sri, Khaitan, Sri T.T.Krishnamachary was appointed as members to the Committee. It was adopted on 26th Nov 1949. 

The Drafting Committee and its members were very influential in Indian constitution-making during the Committee stages and the deliberations of the Constituent Assembly.



On 29th August 1947, the Constituent Assembly through a resolution appointed a Drafting Committee and Dr BR Ambedkar was appointed the head of the drafting committee with one objective - draft a permanent and organized constitution for India. At its first meeting on 30th August 1947, the Drafting Committee elected B.R Ambedkar as its Chairman. 

The committee went back to its roots and referred to the Government of India Act, 1935. A  first draft of the constitution was submitted to the Assembly on November 4, 1947, after 141 days into working on it. Towards the end of October 1947, the Drafting Committee began to scrutinize the Draft Constitution prepared by the B.N Rau, the Constitutional Advisor. It made various changes and submitted the Draft Constitution to the President of the Constituent Assembly on 21st of February 1948.

Assembly sessions took place 166 days, for a period of two years, that was also open to the public. After a plethora of discussions, amendments and hard work, on January 24, 1950, 616 signatures were made by 308 members of the Assembly on the two hand-written copies (Hindi and English) of the final draft of Constitution of India. After two days, on January 26, 1950, the longest written Constitution of the world that incorporated 448 Articles in 22 Parts, 12 Schedules, and 97 Amendments was validated and found an across effect across every corner of the country.

                                                          -------పెండ్యాల  వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>




Monday, May 7, 2018

శ్రమదానంతో రోడ్ నిర్మాణం. భావి తరాలకు ఆదర్శం.

45.(NKP-6). 

శ్రమదానంతో రోడ్ నిర్మాణం. భావి తరాలకు ఆదర్శం.
ఆ రోజుల్లో భారత్ సేవక్ సమాజ్ అనే సంస్థ ఒకటి వుండేది. ఖమ్మం జిల్లాలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసేది. దానికి స్వాతంత్ర సమరరయోదులు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు కొంత కాలం ప్రెసిడెంట్ గా వున్నారు.

నేలకొండపల్లి నుండి బోడులబండ కు ప్రస్తుతమున్న రోడ్ వారు నిర్మించినదే.
ఖమ్మంజిల్లా ఏర్పడిన తరువాత జిల్లాలో చాలా చోట్ల గవర్నమెంట్ డొంకలు ప్రజల సౌకర్యార్ధం తన రూపురేఖలను ప్రభుత్వ అనుమతితో మార్చుకున్నాయి.

నేలకొండపల్లి నుండి తిరుమలాపురం,బోడులబండ, కోరట్లగుడెం ద్వారా రాజేశ్వరపురం, కూసుమంచి మార్గాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. కాని బోడులబండ మరియు పరిసర గ్రామాల పజలందరూ దాన్ని వ్యతిరేకించారు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు యువకులు, విధ్యార్ధులతో శ్రమదానం క్రింద ఆరోడ్ నిర్మాణం గావించారు. ఆ రోజుల్లో అదో SENSATIONAL NEWS. ఉద్యమ స్పూర్తితో ఆ నిర్మాణం గావించారు. 

ఆకార్యక్రమం ఒక నెల రోజులపాటు జరిగింది.నేలకొండపల్లి విద్యార్థుల పర్యవేక్షణ కోసం టీచర్ శ్రీ ద్రోణంరాజు కృష్ణా రావు, ఖమ్మం MUTIPURPOSE SCHOOL నుండి వచ్చిన విద్యార్థుల పర్యవేక్షణ కోసం అక్కడి ఇంగ్లీష్ టీచరు (ముస్లిం) పనిచేశారు.

విషయం తెలుసుకున్న హైదరాబాద్ రాష్ట్ర హోంశాఖా మంత్రి శ్రీ మందుగుల నరసింగ రావు ఆ కార్యక్రమం ఆఖరులో వచ్చారు, శ్రమదానంలో తానూ పాల్గొన్నారు.

క్రింద వున్న చిత్రం భారత్ సేవక్ సమాజ్ సమావేశంలో ఖమ్మం ప్రక్కనున్న వెంకటాయపాలెంలో ప్రసంగిస్తున్న శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు.. ఆ సమావేశం లో కుడా శ్రీ మందుముల నరసింగ రావు పాలుగొన్నారు.
This generation politicians should learn about this type of politicians and their contributions to the society.
   -----పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>

Tuesday, May 1, 2018

మా పాలేరు అసెంబ్లీ ప్రాంత రాజకీయాలు---1978 తర్వాత...

44. (NKP-5). 

నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవిర్భావం.

1978 సం.లో ఆంధ్ర ప్రదేశ్ రాష్రంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లాలో అప్పుడు ఇందిరా కాంగ్రెస్ పార్టీ  శ్రీ కీసర అనంత రెడ్డి గారి నాయకత్వం లో వుండేది. ఆయన తెలంగాణా ప్రాంతీయ బోర్డు చైర్మన్ గా కాబినెట్ ర్యాంక్ లో వుండేవారు.

1980 సం.లో శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారి ప్రతిపాదన మేరకు నేలకొండపల్లి Agricultural market committee ని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి విడగొట్టి ఏర్పాటు చేశారు.నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీకి మొట్టమొదటి ప్రెసిడెంట్ గా శ్రీ నాగుబండి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ గా శ్రీ వున్నం వెంకయ్య బాధ్యతల నిర్వహించారు.

క్రింది చిత్రం పాలక వర్గం అధికారిక పత్రాలు అందు కున్నప్పటిది.

చిత్రం లో కుడి నుండి వరుసగా సర్వశ్రీ వంగవీటి వెంకట సుబ్బయ్య, రామసహాయం  భువన సుందర్ రెడ్డి,కొమ్మినేని అనంత రామయ్య,కొత్త యోగానంద రావు, పెండ్యాల సత్యనారాయణ రావు, నాగుబండి సత్యనారాయణ,వున్నం వెంకయ్య, నాగళ్ల భద్రయ్య, ఎల్లంపల్లి రామచంద్రయ్య, సోమ్ల నాయక్, కిలారు వెంకయ్య,పెండ్యాల భగవాన్లు, నాగుబండి లక్ష్మినారాయణ వున్నారు.


నేలకొండపల్లి ప్రధమ వ్యవసాయమార్కెట్ కమిటీకి చైర్మన్ గా శ్రీ కొమ్మినేని అనంతరామయ్య, శ్రీ కొత్త యోగానందరావులు పోటికి వచ్చారు. కాని శ్రీ నాగుబండి సత్యనారాయణ ప్రెసిడెంట్ అయ్యారు.మొదటి నుండీ శ్రీ నాగుబండి జలగం శిష్యులుగా వుండేవారు. 

అసంతృప్తి చెందిన నేలకొండపల్లి ఉపసర్పంచ్ శ్రీ యోగానంద రావు సర్పంచ్ పదవికై వడివడిగా అడుగులు వేసాడు.చివరి నిమిషంలో రంగం నుంచి ఆయన తప్పుకోవటంతో అనుకోకుండా శ్రీ కొత్త జనార్ధనరావు తెరపైకి వచ్చి 1981 సంవత్సరంలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ గా శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు పై పోటీ చేసాడు.

ఆ పిదప శ్రీ వంగవేటి వెంకటసుబ్బయ్య మధ్యవర్తిత్వంతో మండల కాంగ్రెసుకమిటీ ప్రెసిడెంటుగా శ్రీ కొత్త జనార్ధనరావును శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారు ఆమోదించటంతో పెండ్యాల సత్యనారాయణ రావు గారి మరణం వరకు ఆ వర్గమంతా ఆయనతోనే ఉన్నారు.

కొసమెరుపు ఏమిటంటే ఈ రాజీమార్గాల వల్ల మార్కెటు కమిటీ చైర్మన్ మరియు మండలకాంగ్రెస్ ప్రసిడెంట్ పదవులకు నేను దూరంగా వుండ వలసి వచ్చింది.

పాలేరు అసెంబ్లీ చరిత్ర.
1962 సం లో ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గం నుండి పాలేరు  అసెంబ్లీ నియజక వర్గం ఏర్పడిన దగ్గర నుండి అది షెడ్యూల్ కులాల రిజర్వేషన్స్ లోనే వుంది. 1962  నుండి 1978 దాకా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి గా శ్రీ కతుల శాంతయ్య MLA గా ఎన్నికయ్యారు. 1978 సం. లో దేశంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చిన నూతన పరిణామాలరీత్యా బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ లో శ్రీ కత్తులశాంతయ్య వుండి పోవటం వల్ల INDHIRA CONGRESS అభ్యర్ధిగా శ్రీ పొట్టి పింజార హుస్సేన్ పాలేరు MLA  గా ఎన్నిక అయినాడు. తరువాత అసెంబ్లీ ముఖ చిత్రం మారి పోయి కొత్త రాజ కీయ వాతా వరణం కు దోహదం చేసింది.

1981 సం.లో పాలేరు MLA శ్రీ పొట్టిపింజార హుస్సేన్ ఆకస్మిక మరణంతో జరిగిన ఉపఎన్నికలో సంభాని చంద్రశేఖర్ పాలేరు రాజకీయాల్లో అడుగుపెట్టాడు.రాష్ట్ర యువజకాంగ్రెస్ నాయకుడైన శ్రీ ఇంద్రసేనారెడ్డి ఇచ్చిన చేయూతతో సింగరేణి కాలరీస్ ఎంప్లాయ్ అయిన శ్రీ సంభాని అసెంబ్లీ రాజకీయాలలో అరంగ్రేటం చేసాడు.

పార్టీ టికెట్ రాంగానే ఖమ్మం హిల్ బంగ్లా(అధికార కేంద్రం--Road అండ్ Buildings Guest house) లో వున్న శ్రీ కీసర అనంతరెడ్డి గారికి ఆశీస్సుల కోసం పాదాభివంధనం చేయబోగా , ఆయన వారించి ప్రక్కనే కూర్చొని వున్న శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు గారిని చూపించి ఆనియోజకవర్గం ఆయనది, ఆయన ఆశీస్సులు తీసుకొమ్మని సలహా ఇవ్వటం--శ్రీ సంభాని తీసు కోవటం జరిగి పోయాయి. చీఫ్ ఎలక్షన్ ఏజెంటుగా పెండ్యాల సత్యనారాయణ రావు గారే భాద్యతల తీసుకొని శ్రీ సంభానీని గెలిపించటం జరిగింది.

తరువాత సింగల్ గా జరిగిన రెండు (1983 మరియు 1985) అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ సంభాని చంద్రశేఖర్ ఓడిపోవటం తరువాత శ్రీ జలగం వెంగళరావు గారు లోకసభకు పోటీచేసినప్పుడు (1989), తరువాత శ్రీమతి రేణుకాచౌదరి లోకసభకు పోటీ చేసినప్పుడు (1999  మరియు 2004)  శ్రీ సంభాని చంద్రశేఖర్ ఎం.ఎల్.ఏ గా గెలవటం జరిగింది.

ఉపఎన్నికలో తప్ప అయన గెలిచింది లోకసభ ఎన్నికలతో బాటు జరిగిన అసెంబ్లి ఎన్నికలలోనే. విచిత్ర మేమిటంటే ఆయనతో బాటు  గెలిచిన లోక సభ సభ్యులు ఇద్దరినీ ఆయన తన రాజకీయ శత్రువులుగా భావించేవాడు. బ్రహ్మచారి అయిన శ్రీ చంద్రశేఖర్ విలక్షణవ్యక్తి. ఈ లక్షణమే ఆయన భవిష్యత్తును ప్రభావితం చేసింది. ఈయన రాజకీయాలలోకి వచ్చిన తరువాత పాలేరు, గట్టుసిగారం మొదలుకుని వల్లభి, నేలకొండపల్లి, మేడేపల్లి , ముదిగొండ మరియు కొన్ని ముఖ్య గ్రామాల  సీనియర్ నేతలంతా కొందఱు వ్రుద్ధ్యాప్యంవల్ల రాజకీయాలకు దూరంగా వుండటం, మరికొందరి మరణం వల్ల నియోజకవర్గంలో 1990 తరువాత కాంగ్రెసు పార్టీకి ఈయనే పెద్దదిక్కుగా మారాడు. ప్రత్నామ్యాయం లేకుండా పొయింది.

కాంగ్రెసుపార్టీ మొత్తం తన చెప్పుచేతలలోనే ఉండాలనే తన వ్యవహారశైలి వల్ల కాబినేటు  మంత్రిగా వుండికూడా తదుపరి ఎన్నికలలో(1994) ప్రజాగ్రహంతో ఓటమి చెందవలసి వచ్చింది.

శ్రీ సంభాని రాష్ట్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశాక నేలకొండపల్లిలో జరిగిన సన్మాన కార్యక్రమం క్రింది చిత్రం.
పాలేరు శాసన సభ్యులలో ప్రప్రధమం గా మంత్రి పదవిని అలంకరించింది శ్రీ సంభాని చంద్రశేఖర్ కావటం గమనార్హం.

శ్రీ సంభాని చంద్రశేఖర్ రాష్ట్రమంత్రి అయిన సందర్బంగా జరిగిన సన్మానకార్యక్రమంలో ప్రసంగిస్తున్నది శ్రీ పెండ్యాల వాసుదేవరావు. చిత్రంలో కూర్చున్నవారు కుడి నుండి ఎడమకు వరుసగా సర్వశ్రీ డి.పురుషుత్తం, సంభాని చంద్రశేఖర్, కంకిపాటి జగన్మోహనరావు, కత్తుల శాంతయ్య, జాస్తి వెంకటేశ్వరరావు, ఎం.వి.రామారావు, నాగుబండి సత్యనారాయణ. నిలుచున్నవారిలో నాగుబండిలక్ష్మీనారాయణ, చట్టు వెంకటేశ్వర్లు, డి. సూరిబాబు ఇతరులు వున్నారు.


-----పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>




tag

Saturday, April 28, 2018

ఎక్కడుంది మన చరిత్ర? పరిశోధన తోనే చరిత్ర వెలుగు లోకి రావాలి.


43. (ఖమ్మం చరిత్ర-1) 

ఎక్కడుంది మన చరిత్ర?



ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ చిత్రమిది.దీన్ని చూస్తే ఈ ఈ ప్రాంతాల్లో ఈ స్టేట్ వుందని ఈ తరానికి కుడా తెలుస్తుంది. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వున్న మన ఖమ్మం చరిత్ర 1952 వరకు ఏమిటి? కాంగ్రెస్ మరియు కమ్యునిస్ట్ లు ఎవ్వరు వ్రాయలేదు. కారణం తెలీదు. 1953 నుంచి ఖమ్మం జిల్లా చరిత్ర కుడా ఎవ్వరు వ్రాయలేదు. 

ఆత్మకధలు చరిత్ర దర్పణాలు కాదు.

రష్యా విప్లవం తరువాత బ్రిటిష్ ఇండియా Communist Party సహకారంతో జరిగిన నిజాం వ్యతిరేకపోరాటం గురించి అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమకారులు గొప్పగా చెబుతారు, కాని పోరాటం ముగిసిన రెండు దశాబ్దాల తరువాత గాని పోరాట ముగింపు సమయంలో రాష్ట్ర భాద్యతలలో వున్న శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు దాని గురించి వ్రాయలేదు.అదికూడా పోరాటం నేర్పిన గుణపాటాల గురించే వ్రాసాడు. తనకు సమగ్ర సమాచారం లేదని --తెలుస్తే చెప్పమని ముగించాడు.


తమ స్థానిక పార్టీ తీర్మానానికి భిన్నం గా తాము పోరాటాన్నిఅయిష్టం గా ఎలా కొనసాగిన్చాల్సి వచ్చిందో శ్రీ రావి నారాయణ రెడ్డి చెపారు.


ఏదో చెప్పాలనే తాపత్రయం తో పిడికిలి తెరచిన శ్రీ దేవులపల్లి వెంకటేశ్వర రావు చెప్పాలిసింది పూర్తి చేయకుండానే తన పిడికిలిని తుపాకితో మూసేసి అడవుల్లోకి వెళ్ళిపోయాడు.

1948 ఆఖరులో కొందరు ఉద్యమాన్ని వీడారు అని చెప్పిన శ్రీ పెండ్యాల వరవరరావు కారణాలు విశ్లేషిన్చ లేదు..వాస్తవానికి ఆ సమయంలో బ్రిటిష్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ గందరగోళ పరిస్థితిలో వుంది. అంతర్జాతీయ రాజకీయాల పట్ల కమ్యూనిస్ట్ పార్టీ వైఖరిలో మార్పు దానికి కారణం. శ్రీ P.C.JOSHI కి ఉద్వాసన చెప్పి శ్రీ RANADIVE కు పార్టీ సారధ్య భాధ్యతలు అప్పగించిన ఎఫెక్ట్ నిజాం రాష్ట్ర పార్టీ పై పడింది.


ఇంకా ఎంతో చరిత్ర వుంది. 
అప్పటి తరం ఇప్పుడులేదు. 
విషయాలు చెప్పగలిగే వాళ్ళు తక్కువ.

రెండేళ్ళ క్రింద ఒక ML PARTY కార్యకర్త శ్రీ రేపాల శివలింగం నాకు కలిసాడు. గత ఏడు సంవస్తరాలుగా చరిత్ర పరిశోధనలో వున్నట్లు చెప్పాడు. తాను సేకరించిన విషయాలను ఎవ్వరితోనైనా వ్రాయిస్తానని చెప్పాడు. చరిత్రకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం.

చరిత్ర చెప్పటం మరచిన సంఘటనల తాలూకు జ్ఞాపకాలు క్రింది ఫోటో లలో నిక్షిప్త మై ఉన్నవి. అవి జరిగిన ఉద్యమాలకు వాటి నాయకత్వమ్ వహించిన  వ్యక్తులకు సాక్షి . చరిత్ర చెప్పే చిత్రాలు.చరిత్రలో దాగిన చిత్రాలు.
ఫోటో. No.1
.

First Generation Heros of Telangana. 
Palair Patti Pradhamandhra Mahasabha at Nelakonda Pally in the year 1938 organised by Sri Pendyala Satyanarayana Rao. Palair Patti was played a key role in United Warangal dist in Nizam poratam days.

Sarvasri Pendyala Satyanarayana Rao, Ravi Narayana Reddy, Jamalapuram Kesava Rao, Peravelli Venkataramanaiah, T.Hayagreva Chary, Sarvadevabhatla Ramanatham, Kaloji Narayana Rao and Komaragiri Narayana Rao etc leaders seen in the pic No.1.

Villagers Sarvasri Pendyala Seshadri(Advocate), Pendyala Neelakanta Rao, Cheruvu Narayana Rao and Duggirala Sriramaiah also seen in the above pic.

PHOTO.No.2.

HISTORY NEVER IGNORES REAL HEROES.Below are the Andhra Mahasabha leaders as well as Founders of the Communist party of India in Nizam state. Sri Pendyala Satyanarayana RAO who was the first General Secretary of Warangal district Communist party of India (which was the first district committee in the state) and Sri P.V.RAMANAIAH who was the first General Secretary of Nizam state Regional Communist party of India seen in the picture. In sitting row left the first person was Sri Sarvadevabhatla Ramanatham. His name was missed in the printing in the below pic. 


నిజాంపై తిరుగుబాటు యుద్ధంలో ఆంధ్రమహాసభ వేదికగా కాంగ్రెస మరియు కమ్యూనిస్టులు కలిసే పనిచేశారు. పన్నెండవ ఆంధ్రమహాసభతో విడిపోయారు. పూర్తి కమ్యూనిస్టుల వేదికగా పన్నెండవ ఆంధ్రమహాసభ ఖమ్మం ప్రక్కన ఖానపురం హావేలిలో శ్రీ పెండ్యాల సత్యనారాయణరావు ఆధ్వర్యంలో జరిగింది. ఆ రోజుల్లో ఆ మీటింగ్ కు నలభై వేలమంది ప్రజలు హాజరైనారు.




PHOTO.No.3.
In the memory of Telangana struggle against Nizam.
Palair Patti Chaturdhandhra Maha Sabha at Nelakondapally.
In the pic. Front row in chairs.From left to Right
Sarvasri K.L.Narasimha Rao, Mandava Rathaiah, Pendyala Sugunamma(Child, D/o Satyanarayana Rao, Pendyala SATYANARAYANA Rao, P.Neelakanta Rao & another.

Standing row. Middle. Kanamarlapudi Venkatramaiah, Nunna Rangaiah, P. Sadasiva Rao,Thota Venkataratnam and others.



Photo.No.4.
Gandhi's meeting was held in my ancestral land in Khammam town near Venkatagiri Railway gate 5th  August 1946.

PHOTO.NO.5.
VIRAATRAYA ANDHRA GRANDHALAYAM building at NELAKONDAPALLY which was the centre for state-level activities against NIZAM. It was established in the year 1912 & reorganized by Sri Pendyala Satyanarayana Rao in the year 1934 for a social moment to educate people and fight against NIZAM. Secret meetings held here resulted in the formation of HYDERABAD STATE REGIONAL COMMUNIST PARTY OF INDIA. SRI Pendyala Satyanarayana Rao addressing the gathering in those days in the premises of Viraatrayaandhra Grandhaalayam at Nelakondapally. After the formation of the Telangana regional communist party, Nelakonda pally was the headquarters to the Khammam taluka communist party activities.


-------పెండ్యాల వాసుదేవరావు.

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>


Monday, April 23, 2018

నేలకొండపల్లి లో శ్రీ భక్త రామదాసు స్మారక ఉత్సవాలు ---ప్రారంభ చరిత్ర.

42.(NKP-4). 

శ్రీ భక్త రామదాసు స్మారక ఉత్సవములు నేలకొండపల్లి లో  ప్రారంభ చరిత్ర .

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో 1973 సంవత్సరం డిసెంబర్ 31 వ తేది నుండి 1974 జనవరి 2 వ తేది వరకు శ్రీ భక్త రామదాసు స్మారక ఉత్సవాలు  శ్రీ భక్త రామదాసు మెమోరియల్ సొసైటీని (REGD NO.715/74) ఆధ్వర్యం లో ప్రప్రధమం గా జరిగినవి. 


 శ్రీ భక్త రామదాసు స్మారక సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులుగా శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు, ఉపాధ్యక్షుడిగా శ్రీ కంకిపాటి జగన్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి గా శ్రీ పీ.బీ. సోమయాజులు, సహాయ కార్యదర్స్యులుగా పైడిమర్రి కృష్ణశర్మ, శ్రీ కొడవటిగంటి శివరామశర్మ మరియు  కోశాధికారిగా శ్రీ కొత్త యోగానంద రావు వున్నారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో దాదాపు అదే సమయంలో 1973 డిసెంబర్ 27 నుండి 1974 జనవరి 3 వ తేది వరకు వాగ్గేయకారుల ఉత్సవాలు ప్రారంభించారు. వాటికి అయిదు లక్షల రూపాయల మూల నిధిని ఏర్పరిచి ఆర్ధిక వనరులను ఏర్పచింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.

ప్రత్యేకించి శ్రీ భక్త రామదాసు పేరున స్మారకోత్సవములు నేలకొండపల్లిలో  మాత్రమే చరిత్రలో ప్రధమంగా ప్రారంభం అయినవి. ఇక్కడ నిర్వహణకు మాత్రం ప్రభుత్వ నిధులు మాత్రం ఏమీ లేవు. ఆ ధ్యాసే ప్రభుత్వ వర్గాలకు లేదు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలోనూ 1973 డిసెంబర్ 27 నుండి  1974 జనవరి 3 వ తేది వరకు వాగ్గేయకారుల ఉత్సవాలు ప్రారంభించారు. వాటికి అయిదు లక్షల రూపాయల మూల నిధిని ఏర్పరిచి ఆర్ధిక వనరులను ఏర్పచింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.
 శ్రీ భక్త రామదాసు విగ్రహావిష్కరణ.



                  
శ్రీ భక్తరామదాసు స్మారక మందిరంలోని ఏకశిలా తెల్ల రాతి విగ్రహము. ప్రాచిన గ్రందాలలోని చిత్రాల ఆధారంగా ఈ విగ్రహాన్న  రూపొందించారు.  పై ఫోటో లో శ్రీ భక్త రామదాసు విగ్రహం పెట్టినప్పటి చిత్రం. 1977 సం.లో మే 28 తేదిన శ్రీ భక్త రామదాసు ఏకశిలా విగ్రహాన్ని తెనాలి పట్టణం లోని శిల్పులతో చేయించి శ్రీ భక్త రామదాసు మందిరంలో నెలకొలిపారు. సీతా రామ లక్ష్మనుల విగ్రహాలను కుడా తెల్ల రాయి తోనే యించారు.

శ్రీ భద్రాచల సీరామచంద్రస్వామి దేవస్థానానికి  శ్రీ భక్తరామదాసు  స్మారక భవనం అప్పగింత.


శ్రీ భక్త రామదాసు గారు దేశ విఖ్యాత భాక్తాగ్రేస్వరుడు. చరిత్ర ప్రసిద్ది చెందినవాడు కావటం వల్ల ఆయన స్మారకంగా చేసే కార్యక్రమాల నిర్వహణకు ఒక ఆడిటోరియం కూడా అవుసరమున్నది. స్థానికుల ఆర్ధిక యిబ్బందులతో రామదాసుగారి స్మారక  కార్యక్రమాల నిర్వహణ ఆయన ఖ్యాతికి తగ్గట్లు న్యాయం చేయలేమని, ఆయన ఆథ్యాత్మిక భావ ప్రచార వ్యాప్తిని జాతీయ స్థాయిలో చేయవలసిన అవుసరాన్ని గమనించిన పెద్దలు శ్రీ పెండ్యాల సత్యనారాయణ రావు గారు ఈ స్మారక మందిరాన్ని/జన్మస్థల ప్రాంగణాన్ని భద్రాచల శ్రీ సీతారామస్వామి దేవస్థానానికి అప్పగించుటకు  శ్రీ భద్రాచల సీతారామస్వామి దేవస్థాన కమిటీని సంప్రదించటం జరిగింది.

మే 4 తేది 1983 సంవత్సరంలో జన్మ స్థల ప్రాంగణాన్ని భవన నిర్వహణకు, కార్యక్రమాల నిర్వహణకు  భద్రాచల రామాలయానికి AP STATE ENDODWNMENTS COMMISSIONER LETTER R.C.NO.B3/74179/81, DT: 22.02.1983 and EXECUTIVE OFFICER , SRI SEETHAA RAMASWAAMY DEVASTHANAM, BHADRACHALAM LETTER R.C.NO.C1/2804/81, DT: 15.04.1983 ప్రకారం స్వాధీనం చేయటం జరిగింది. 

భద్రాచల దేవస్థానానికి అప్పచేప్పిన తరువాత 28.03.1984 తేది వరకు మందిర నిర్వహణలో భాగము అయిన సిబ్బంది వేతనాలు, ఎలక్ట్రిసిటీ బిల్ చెల్లింపులు, నిత్య నైవేధ్య దీపారాధనల ఖర్చులే కాక ధనుర్మాసాది ఉత్సవములకు  కూడా వైభవంగా నిర్వహించారు. కాని పైన పేర్కొన్న తేదీ తరువాత మందిరం తీవ్రమైన నిర్లక్ష్యమునకు  గురికావటమే కాకుండా రామదాసు స్మారక కార్యక్రమాల వూసే లేకుండా పోయింది. భక్తిరసం ఉట్టిపడేలా మేళతాళ ధ్వనులతో మర్మోగావలసిన ఈ మందిర ప్రాంతంలో కీచురాళ్ళ ధ్వనులు జనులకు వినిపించింది. మందిరంలో ప్రతిష్టించిన సీతారామచంద్రుల విగ్రహాలు పూజా పునస్కారాలకు నోచుకోక అపరిసుభ్ర వాతావరణంలో వెలతేలా పోయింది. 1989 సంవత్సరము దాక అదే పరిస్థితి వుండేది. దేవస్థాన పాలకమండల్లకు చేసిన విజ్ఞాపనల ఫలితంగా కొంతకాలం ఆతరువాత పూజా ద్రవ్యాలు, తరువాత పూజారి నియామకం జరిగింది. మందిరాన్ని భద్రాచలానికి అప్పగించింది శ్రీ భక్తరామదాసు గారిక స్మారకోస్థవాల కార్యక్రమాలు జాతీయస్థాయిలో చేయటానికి, ఆయన ఆధ్యాత్మిక భావవ్యాప్తిని  విశ్వవ్యాపితం చేయటానికి.

భద్రాచలానికి అప్పగించాక ఆశించినది లభించక పోగా రామదాసు స్మారక మందిరం దయనీయ స్థితిని    క్రింది చిత్రం లో చూడవచ్చు.
 
         

              
        
 శ్రీ భక్త రామదాసు విద్వత్ కళా పీఠం ఆవిర్భావం.      
పై దుస్థితిలో రామదాస స్మారక కార్యక్రమాలను గాలికి వదిలేయలేక ఉడతా భక్తిగా శ్రీ భక్త రామదాసు ఉత్సవాలు జరపాలనే ఉద్దేశ్యాన్ని శ్రీ సత్యనారాయణ రావు గారికి తెలిపి వారి ఆశీస్సులతో 1990 సం.లో శ్రీ భక్త రామదాసు విద్వత్ కళాపీఠంను స్థాపింఛి కార్యక్రమాలు ప్రారంభించారు. దాని Regd No.1829/93 గా నమోదైంది. 1993 సంవత్సరములో రామదాసు స్మారక మందిరంలోని సీతారామచంద్రుల మూల విగ్రహాలకు ఇత్తడి మకరతోరణాన్ని శ్రీమతి పెండ్యాల అన్నపూర్నమ్మ గారు బహుకరణ చేసారు. శ్రీ భక్తరామదాసు విద్వత్కళాపీఠం ప్రధమ అధ్యక్షులుగా శ్రీ రావులపాటి రంగారావు, ప్రధాన కార్యదర్శిగా శ్రీభీకంసింగ్ వున్నారు. వీరితోపాటు సర్వశ్రీ పెండ్యాల రామ్మోహన రావు, గండికోట రాజేశ్వర్ రావు, గండికోట శేషభూషణ రావు కార్య వర్గం సభ్యులుగా వుండేవారు.

శ్రీ భక్త రామదాసు స్మారక మందిరమునకు తురుపు దిక్కున స్థలం కొనుగోలు.
శ్రీభక్త రామదాసు జన్మస్థలములోని భావికి ఉత్తరదిక్కున వున్న ప్రైవేటు స్థలమును 1990 సంవత్సరములో శ్రీభక్తరామదాసు విద్వత్కళాపీఠం పేరున 690.00 చ.గ.కొన్నారు. అందులోని వేపచెట్లు వగైరాల అమ్మకంతో కొనుగోలు సొమ్ము చేకూరింది.

 శ్రీ భక్త రామదాసు స్మారక మందిరంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు.

1993 సం.ములో రామదాసు మందిరంలోని సీతారామచంద్రుల మూలవిగ్రహాలకు ఇత్తడి మకరతోరణాన్ని శ్రీమతి పెండ్యాల అన్నపూర్నమ్మగారు బహుకరణ చేసారు.శ్రీ భక్త రామదాసు స్మారక మందిరమునకు తూరుపు దిక్కున ఆగ్నేయంమూల నుండి రాతి స్థంభం వరకు శ్రీ భక్త రామదాసు స్మారకకమిటీ అధ్యక్షులు శ్రీ పెండ్యాల వాసుదేవరావు సొంత ధనంతో కాంపౌండ్ నిర్మాణం చేశారు. ఆ సమయంలో అక్కడికి అనుకోకుండా వచ్చిన స్థానిక మాజీ MLA , అప్పటి భద్రాచల సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ శ్రీ కత్తుల శాంతయ్య నిర్మాణ వివరాలు తెలుసుకొని మా కుటుంబ నేపధ్యం తెలిసిన వారు కాబట్టి "ఇప్పటివరకు మీకుటుంబం పెట్టింది చాలు, నేను భద్రాచలదేవస్థానం నుంచి కొంత ఇస్తాను" అని చెప్పి వారి కమిటి తీర్మానం మేరకు Rs 25,000/-ఇచ్చారు. వెంటనే అప్పటి MLA శ్రీ సండ్ర వెంకటవీరయ్య తన నిధులనుంచి Rs 25,000/-ఇచ్చారు. ఈ విధంగా రామదాసు మందిరం చుట్టూ తూరుపు, దక్షిణ మరియు పడమర దిక్కులలో కాంపౌండ్ నిర్మాణం జరిగింది.

 1999 సంవత్సరంలో శ్రీ భక్త రామదాసు ప్రాజెక్ట్, భద్రాచలం వారి కార్యక్రమం.

శ్రీ భక్తరామదాసుప్రాజెక్ట్, భద్రాచలం వారు 1999 సం.లో అప్పటి ఖమ్మం డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ అప్పారావు, ఖమ్మంజిల్లా కలెక్టర్ శ్రీ N.గిరిధర్ మరియు జిల్లాసూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ పెండ్యాల సీతారామాంజనేయులు తీసుకున్న చొరవతో  శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం Renovation కార్యక్రమాన్ని చేపట్టారు. డంగుసున్నంతో వున్న గోడల plasting ను తీసేసి సిమెంట్ plasting ను చేసారు. సిమెంట్ ఫ్లోరింగ్ ను  తీసేసి Marble  ఫ్లోరింగ్ ను వేసారు. మందిరానికి ENAMIL painting ను వేసారు. జిల్లా ఉద్యానవ శాఖ వాళ్ళు మొక్కలు వేసారు. ప్రక్కనే వున్న విద్వత్కలాపీఠం స్థలాన్ని లెవెల్ చేయించి ఆస్థలంలో వున్న పాటి మన్నును చదును చేసి మందిరం చుట్టూ పోయించటంతో ప్రాగణమంతా ఎత్తు పెరిగింది. విద్వాత్కలా పీఠం స్థలాన్ని రామదాసు మందిర ప్ప్రాంగణంనంలో కలిపేసారు. ఆ స్థలానికి పడమర మరియు ఉత్తర దిక్కున కంపొండ్ నిర్మాణం చేసారు.   

శ్రీ భక్త రామదాసు ప్రాజెక్ట్, భద్రాచలం వారు  శ్రీ భక్త రామదాసు స్మారక మందిరం పేరును ధ్యానమందిరంగా మార్చారు. అంతకు ముందు స్మారకమందిరం గానే పిలువబడేది. భద్రాచల శ్రీ సీతారామస్వామిదేవస్థానంకు స్వాధీనం చేసేతంతవరకు శ్రీ రామదాసు స్మారకోత్సవాలుగాను తరువాత ఆరాధనోత్సవాలుగానామకరణం చేసి నిర్వహించారు.
శ్రీ భక్త రామదాసు ప్రాజెక్ట్, భద్రాచలం ప్రాజెక్ట్ వారి  కార్యక్రమం తరువాత మందిరం  చిత్రాలు. 

  

శ్రీ భక్త రామదాసు జయంతి కార్యక్రమాల ప్రారంభం: 
2001 సం.లో శ్రీ పెండ్యాల వాసుదేవరావు   శ్రీ భక్త రామదాసు విద్వాత్కళాపీఠం అధ్యక్షులుగా   బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్ట మొదటిసారిగా శ్రీ భక్త రామదాసు జయంతిని 14.02.2002  తేదిన నేలకొండపల్లిలో చేయటం జరిగింది. అప్పటినుడి రెగ్యులర్ గా  జయంతి కార్యక్రమాలు జరుగుతున్నవి. తరువాత భద్రాచలంలో కూడా దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ భక్త రామదాసు జయంతి కార్యక్రమాలు 372  జయంతి నుండే (11-2-2005 -13-2-2005) ప్రారంభం అయినవి. ఆకార్యక్రమాలు భద్రాచలం  కళ్యాణమంటపం వేదికగా జగినవి. అప్పుడు భద్రాచల దేవస్థానం  కార్యనిర్వహణాధికారిగా శ్రీ యం. రఘునాద్ వున్నారు. 

నేలకొండపల్లిలో ప్రధమంగా శ్రీ భక్తరామదాసు జయంతిని జరిపిన సంధర్హంగా చిన్నారి కళాకారులు, వారి గురువు శ్రీ మాధవరావుతో పీఠం ప్రెసిడెంట్ శ్రీ పెండ్యాల వాసుదేవ రావు మరియు పీఠం సెక్రటరీ శ్రీ రాజపుత్ర భీకంసింగ్.



శ్రీ భక్త రామదాసు ప్రాజెక్ట్, భద్రాచలం వారు మందిర పునరుద్ధ్హరణ తరువాత మందిర నిర్వహణలో ఏమాత్రం మార్పు రాలేదు. కార్యక్రమాల నిర్వహణ లోకల్ శ్రీ భక్త రామదాసు విద్వత్ కళాపీఠం మీదనే పడింది. 2001-04 వరకు పీఠం అధ్యక్షులు శ్రీ పెండ్యాల వాసుదేవ రావు స్వంత వనరులతోనే చేయవలసి వచ్చింది. తదుపరి వచ్చిన కార్యవర్గం ఏవో కొద్దిగా వసులుచేసిన చందాలతో కార్యక్రమాలను ప్రతి సంవత్సరం మొక్కుబడిగానే నిర్వహించారు. నియోజకవర్గంలో మొట్ట మొదటి సారిగా సోలార్ లైట్స్ ను  రామదాసు మందిరంలో శ్రీ భక్త రామదాసు మెమోరియల్ కమిటీ చొరవతో చైర్మన్ శ్రీ పెండ్యాల వాసుదేవ రావు పెట్టించటం జరిగింది.

శ్రీ భక్త రామదాసు జన్మస్థలాన్ని భద్రాచల రామాలయానికి అప్పగించేటంత వరకు శ్రీ రామదాసు స్మారకోత్సవాల పేరిట కార్యక్రమాలు జరిగేవి. జన్మస్థల ప్రాంగణాన్ని శ్రీ భక్త రామదాసు స్మారకమందిరం అనేవారు. విద్వాత్కళాపీఠం వారు స్టార్ట్ చేసాక అవి శ్రీ రామదాసు ఆరాధనోత్సవములని పిలవటం ప్రారంభం అయినది. శ్రీ భక్త రామదాసు ప్రాజెక్ట్ వారు భవన పునరుద్దరణ తరువాత జన్మస్థల ప్రాంగణాన్ని శ్రీ భక్త రామదాసు ధ్యాన మందిరమని నామకరణం చేశారు.

తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఉత్సవాల నిర్వహణ ప్రారంభం.

ఈ సందర్భంలో స్మారక మందిరంలో ఇదివరకు వున్న శ్రీ భక్త రామదాసు ఏకశిలా తెల్ల రాతి విగ్రహాన్ని మారుస్తారని విన్న పిదప జనం తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులకు క్రింది విధంగా విజ్ఞప్తి చేసియున్నాము. విజ్ఞప్తిని మన్నించి నందులకు  ధన్యవాదాలు.
We will be thankful to Hon'ble CM of Telangana for an announcement of Sri Bhaktha Ramadasu Jayanthi celebrations on behalf of State Govt at Nelakondapally.

Here is Ekasila White Stone Statue of Sri Bhaktha Ramadasu and Seeta Rama, Laxmana & Hanuman White Stone Statues in the Memorial Hall of Sri Bhaktha Ramadasu Birth Place Nelakonda Pally. The Statues were unveiled dt: 28 th May 1977 by the Elders who built the memorial in the year 1955. The Statues were made in Tenali town of Andhra Pradesh.

We bring to the notice of the Hon'ble CM of Telangana not to replace the present Ramadasu Statue with a new one which it will hurt the sentiments of people of this area. Arrange new one in another place.

The Statue was made on the basis of the pic which was in the old Historical Books.
Thank u.





2016 సం.లో తెలంగాణారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న దేవాలయాల పునరుద్ధరణలో భాగంగా వారి దృష్టి శ్రీ భక్త రామదాసు జన్మస్థలం మీద పడటము వారి ఆదేశాలమేరకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ శ్రీ భక్త రామదాసు గారి ఆరాధన మరియు జయంతి ఉత్శావాల నిర్వహణ చేపట్టటం నేలకొండపల్లి మరియు పరిసర గ్రామాల ప్రజల చిరకాల వాంఛ నేరవేరినట్లు అయినది. శ్రీ భక్త రామదాసు గారికి ఇకనైనా న్యాయం జరుగుతున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కలువకుంట్ల  చంద్రశేఖర రావు గారికి అభివందనాలు. 2017 మరియు 2018 సం.లలో రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగినవి. నేలకొండపల్లి పరిసర ప్రాంత ప్రజల కోరిక ఈడేరినట్లు అయినది. సంతోషం.
                                                                      జై శ్రీరామ్.
----పెండ్యాల వాసుదేవ రావు. 

<!-- Google tag (gtag.js) --> <script async src="https://www.googletagmanager.com/gtag/js?id=G-1M93C8YK91"></script> <script> window.dataLayer = window.dataLayer || []; function gtag(){dataLayer.push(arguments);} gtag('js', new Date()); gtag('config', 'G-1M93C8YK91'); </script>
      

హైకోర్టులో తెలుగులో వాదించవచ్చా? జిల్లా కోర్టులో పరిస్థితి ఏమిటి?

109. GEOPOLITICAL హైకోర్టులో తెలుగులో వాదించవచ్చా? జిల్లా కోర్టులో పరిస్థితి ఏమిటి? హైకోర్టులో మాతృభాషలో వాదించడం,  లిఖితపూర్వక వాదనలు,  జిల...